అమ్ముడవ్వాల్సిన ఇళ్లు 7.85 లక్షలు
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో విక్రయమవ్వాల్సిన ఇళ్లు 7.85 లక్షల వరకు ఉంటాయని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ ప్రాప్టైగర్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుత అమ్మకాల వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ఇళ్లను అమ్మేందుకు స్థిరాస్తి సంస్థలకు సగటున 32 నెలల సమయం పడుతుందని తెలిపింది.
32 నెలలు పట్టొచ్చు
8 ప్రధాన నగరాలపై ప్రాప్టైగర్ నివేదిక
దిల్లీ: దేశంలోని 8 ప్రధాన నగరాల్లో విక్రయమవ్వాల్సిన ఇళ్లు 7.85 లక్షల వరకు ఉంటాయని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ ప్రాప్టైగర్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుత అమ్మకాల వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ఇళ్లను అమ్మేందుకు స్థిరాస్తి సంస్థలకు సగటున 32 నెలల సమయం పడుతుందని తెలిపింది. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో అయితే 62 నెలల సమయం అవసరమని పేర్కొంది. ఆమ్రపాలి, జేపీ ఇన్ఫ్రాటెక్, యునిటెక్ లాంటి స్థిరాస్తి సంస్థలు కొనుగోలుదార్లకు ఇళ్ల అప్పగింతలో విఫలమవ్వడం.. దిల్లీ-ఎన్సీఆర్ స్థిరాస్తి విపణిపై ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొంది. ప్రాప్ టైగర్ సంస్థ 8 నగరాలు- అహ్మదాబాద్, దిల్లీ ఎన్సీఆర్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, ముంబయి మెట్రోపాలిటన్ ప్రాంతం, పుణెల్లోని స్థిరాస్తి విపణిపై అధ్యయనం చేస్తుంటుంది. ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం..
* సెప్టెంబరు 30 నాటికి విక్రయమవ్వని ఇళ్లు/ఫ్లాట్ల సంఖ్య 7,85,260కు పెరిగింది. జూన్ చివరికి ఈ సంఖ్య 7,63,650గా ఉంది.
* ఈ ఏడాది జులై-సెప్టెంబరులో పై 8 నగరాల్లో గృహ విక్రయాలు 49 శాతం పెరిగి 83,220కు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ సంఖ్య 55,910గా ఉంది.
* గృహాలకు గిరాకీ పుంజుకోవడంతో.. ఇళ్ల నిల్వలను విక్రయించేందుకు పట్టే సమయం తగ్గింది. 2021 మూడో త్రైమాసికంలో ఈ సమయం సగటున 44 నెలలుగా ఉండగా.. ఈ ఏడాది జులై-సెప్టెంబరులో 32 నెలలకు దిగివచ్చింది. కొవిడ్-19 రెండో దశ తర్వాత విక్రయాలు పుంజుకోవడం ఇందుకు తోడ్పడింది.
* నిల్వల విక్రయాన్ని పూర్తి చేసేందుకు పట్టే సమయం కోల్కతాలో అత్యంత తక్కువగా 24 నెలలుగా ఉంది.
* ఎనిమిది నగరాల్లో విక్రయం కాని ఇళ్లలో సుమారు 21 శాతం వరకు రెడీ-టు-మూవ్ విభాగంలో ఉన్నాయని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.