అదానీ కుటుంబం నుంచి రూ.20000 కోట్లు సమీకరించే ప్రతిపాదనను వ్యతిరేకించండి
అదానీ కుటుంబానికి వారెంట్ల జారీ ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటేయాలని అంబుజా సిమెంట్స్ వాటాదార్లకు సంస్థాగత మదుపర్ల సలహా సంస్థ ఐఐఏఎస్ సూచించింది. స్వతంత్ర డైరెక్టర్లుగా అమిత్ దేశాయ్, పుర్వి సేథ్ నియామక ప్రతిపాదనను కూడా తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది.
అంబుజా వాటాదార్లకు ఐఐఏఎస్ సూచన
దిల్లీ: అదానీ కుటుంబానికి వారెంట్ల జారీ ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటేయాలని అంబుజా సిమెంట్స్ వాటాదార్లకు సంస్థాగత మదుపర్ల సలహా సంస్థ ఐఐఏఎస్ సూచించింది. స్వతంత్ర డైరెక్టర్లుగా అమిత్ దేశాయ్, పుర్వి సేథ్ నియామక ప్రతిపాదనను కూడా తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది. అంబుజా సిమెంట్స్ అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) నేడు (ఈనెల 8న) జరగనుంది. ఇందులో 12 తీర్మానాలపై వాటాదార్ల అనుమతిని సంస్థ కోరింది. అదానీ గ్రూపునకు చెందిన హార్మోనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్కు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో 47.74 కోట్ల షేర్లను రూ.418.87 ధరకు కేటాయించడం ఇందులో ఒకటి. వీటిని ఒకటి లేదా పలు దఫాల్లో జారీ చేయడం ద్వారా రూ.20,001 కోట్లను కంపెనీ సమీకరించనుంది. బోర్డులో అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కుమారుడు కరణ్ అదానీ, మరో ఇద్దరు డైరెక్టర్లు, నలుగురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించే ప్రతిపాదనపైనా అనుమతి కోరనుంది. ‘వారెంట్ల మార్పిడితో మూలధన స్థాయి 19.4 శాతం మేర తగ్గేందుకు దారి తీయొచ్చు. ప్రమోటరు వాటా పరిమితి 63.1 శాతం నుంచి 70.3 శాతానికి పెరగొచ్చు. ఇష్యూ ధర కూడా ప్రస్తుత మార్కెట్ ధర రూ.500.20 కంటే 17.3 శాతం తక్కువ. హోల్సిమ్ నుంచి కొనుగోలు చేసిన ధర కంటే 8.8 శాతం ఎక్కువ. పైగా అంబుజా సిమెంట్స్కు స్టాండలోన్ పద్ధతిలో రూ.3,840 కోట్లు, ఏకీకృతంగా రూ.8,500 కోట్ల నగదు, నగదు సమాన నిల్వలు ఉన్నాయ’ని ఐఐఏఎస్ తెలిపింది. వీటన్నింటి దృష్ట్యా ప్రమోటర్లకు వారెంట్ల జారీ ప్రతిపాదనకు అనుకూలంగా లేమని, అందువల్ల వ్యతిరేకంగా ఓటేయాలని వాటాదార్లకు సూచించింది.
అదానీ రూ.65,000 కోట్ల పెట్టుబడులు
5-7 ఏళ్లలో మెగా సోలార్ ప్లాంటు ఏర్పాటు
జయపుర: రాజస్థాన్లో రూ.65,000 కోట్ల పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. వీటి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,000కు పైగా ఉద్యోగాలు కలుగుతాయని ఆయన తెలిపారు. వచ్చే 5-7 ఏళ్లలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేయడంతో పాటు, సిమెంటు ప్లాంటు విస్తరణ, జయపుర విమానాశ్రయ నవీకరణను ఈ నిధులతో చేపడతామని శుక్రవారమిక్కడ జరిగిన ‘ఇన్వెస్ట్ రాజస్థాన్ 2022 సమిట్’లో అదానీ వెల్లడించారు. వారం కిందటే ప్రపంచంలోనే అతిపెద్ద పవన-సౌర హైబ్రిడ్ విద్యుత్ ప్లాంటు వాణిజ్య కార్యకలాపాలను రాజస్థాన్లో తమ గ్రూప్ ప్రారంభించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో సిమెంటు తయారీ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం కోసం రూ.7,000 కోట్ల పెట్టుబడులు పెడతామని తెలిపారు. రెండు వైద్య కళాశాలలు, ఒక క్రికెట్ స్టేడియం కూడా నిర్మిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది. -
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
Wipro Q4 results: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. -
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!