సూచీలకు అతి స్వల్ప నష్టాలు
సూచీల రెండు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. శుక్రవారం ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య కదలాడిన సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఐటీ, ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ ఇందుకు కారణమైంది.
ఐటీ, ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ
సమీక్ష
సూచీల రెండు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. శుక్రవారం ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య కదలాడిన సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఐటీ, ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ ఇందుకు కారణమైంది. నవంబరు నుంచి రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున ముడిచమురు ఉత్పత్తి తగ్గిస్తామంటూ, ఓపెక్ ప్లస్ దేశాలు ప్రకటించడంతో చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ కొత్త జీవన కాల కనిష్ఠానికి పడిపోవడమూ ప్రభావం చూపింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 13 పైసలు తగ్గి 82.30 వద్ద ముగిసింది. బ్రెంట్ క్రూడ్ ధర 3.64% పెరిగి 97.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లోనే ముగియగా.. ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.
ఒడుదొడుకుల్లో...: ఉదయం సెన్సెక్స్ 58,092.56 పాయింట్ల వద్ద నష్టాల్లో ఆరంభమైంది. ఆ తర్వాత కాస్త కోలుకున్నా, తిరిగి నష్టాల బాట పట్టింది. ఇంట్రాడేలో 57,851.15 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. అక్కడ నుంచి సూచీ మళ్లీ పుంజుకుని 58,269.34 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరింది. చివరకు 30.81 పాయింట్ల నష్టంతో 58,191.29 వద్ద ముగిసింది. నిఫ్టీ 17.15 పాయింట్లు కోల్పోయి 17,314.65 వద్ద స్థిరపడింది.
14 పైకి.. 16 కిందకు: సెన్సెక్స్ 30 షేర్లలో 14 రాణించగా.. 16 డీలాపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 1.37%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.3%, ఎస్బీఐ 1.28%, టీసీఎస్ 1.28%, బజాజ్ ఫైనాన్స్ 0.79%, ఐటీసీ 0.77%, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 0.73% షేర్లు కూడా నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. టైటన్ 5.27%, పవర్ గ్రిడ్ 1.45%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.06%, ఎన్టీపీసీ 0.95%, మారుతీ సుజుకీ 0.93%, భారతీ ఎయిర్టెల్ 0.66%, ఎల్ అండ్ టీ 0.57%, ఏషియన్ పెయింట్స్ 0.49% షేర్లు రాణించాయి.
* రంగాల సూచీల విషయానికొస్తే.. చమురు-గ్యాస్ 0.78%, విద్యుత్ 0.72%, లోహ 0.63%, ఐటీ 0.57%, ఎఫ్ఎమ్సీజీ 0.52 శాతం మేర క్షీణించాయి. వినియోగ వస్తువుల రంగాల సూచీ 2.13 శాతం పెరగగా. టెలికమ్యూనికేషన్స్, పరిశ్రమలు, భారీ యంత్రపరికరాల సూచీలూ రాణించాయి.
* సెప్టెంబరు త్రైమాసికంలో టైటన్ అమ్మకాలు 18 శాతం పెరగడంతో కంపెనీ షేరు బీఎస్ఈలో 5.27 శాతం పెరిగి రూ.2,730.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలో అత్యధికంగా పెరిగిన షేరు ఇదే.
* సుజ్లాన్ ఎనర్జీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరుగా వినోద్ ఆర్ తంతిని నియమించారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి వచ్చిందని కంపెనీ తెలిపింది. కంపెనీ వ్యవస్థాపకులు, సీఎండీగా ఉన్న తుల్సి తంతి ఈనెల 1న మరణించిన సంగతి విదితమే.
ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఐపీఓకు 71.93 రెట్ల స్పందన
బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరిట విక్రయశాలలు నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా తొలి పబ్లిక్ ఆఫర్ ముగిసేసరికి 71.93 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 6.25 కోట్ల షేర్లను జారీ చేయనుండగా.. 449.53 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయని ఎన్ఎస్ఈ వద్ద లభ్యమవుతున్న గణాంకాలు చెబుతున్నాయి. అర్హులైన సంస్థాగత మదుపర్ల విభాగంలో 169.54 రెట్లు, సంస్థాగతేతర మదుపర్ల విభాగంలో 63.59 రెట్లు, చిన్న మదుపర్ల విభాగంలో 19.71 రెట్ల స్పందన లభించింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.500 కోట్లు సమీకరించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)