వేలిముద్రల దొంగలున్నారు జాగ్రత్త!
సిమ్కార్డులు తీసుకునేందుకు, ఆర్థిక లావాదేవీలకు ఇ-కేవైసీ కోసం, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ వేలిముద్రలు వేస్తుంటాం.
లావాదేవీ సమయంలోనే అన్లాక్ చేసుకోవాలి
ఆధార్కూ ఇలా చేస్తే మేలు
ఎంఆధార్, టోల్ఫ్రీ నంబరును వినియోగించుకోవాలి
* సిమ్కార్డులు తీసుకునేందుకు, ఆర్థిక లావాదేవీలకు ఇ-కేవైసీ కోసం, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ వేలిముద్రలు వేస్తుంటాం.
* ఆధార్ కార్డు జారీచేసేప్పుడు మన వేలిముద్రలు/కనుపాపల ఐరిస్ తీసుకుని, డేటాలో నిక్షిప్తం చేసినందున, ఆధార్ అనుసంధానిత పథకాల్లో వ్యక్తుల ధ్రువీకరణ క్షణాల్లో పూర్తవుతోంది.
* అయితే వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో ఈ వేలిముద్రల డేటాను సేకరిస్తున్న మోసగాళ్లు, వాటితో వేలిముద్రల రూపులు తయారు చేసి, వేరే రాష్ట్రాల్లో నగదు అపహరిస్తున్నారనే ఫిర్యాదులొస్తున్నాయి.
* ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే, మనమే జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఇందుకోసం ఆధార్, బయోమెట్రిక్స్ వివరాలను లాక్ చేసుకుని, అవసరమైనప్పుడు అన్లాక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
* ఇందుకు సంక్షిప్త సందేశాలు(ఎస్ఎంఎస్) లేదా ఎం ఆధార్ యాప్ను వినియోగించుకోవచ్చు.
ఎలాగంటే..
1 ఆధార్తో అనుసంధానమైన సిమ్కార్డు ఉన్న స్మార్ట్ఫోన్లో ఎంఆధార్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి.
2 దీనిలో మన ఆధార్ నెంబరు నమోదు చేసి, సూచనలు పాటిస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
3 తదుపరి 16 అంకెల వర్చువల్ ఐడీని సృష్టించుకోవాలి. దీనిని 24 గంటలకు ఒకసారి మార్చుకోవచ్చు కూడా.
4 ఇది నమోదయ్యాక యాప్లో మన ఆధార్ కార్డు ప్రత్యక్షమవుతుంది.
5 తదుపరి కింది భాగంలో సర్వీసెస్, మైఆధార్, ఎన్రోల్మెంట్ సెంటర్, మోర్ వంటి విభాగాలుంటాయి.
6 ఇందులో మైఆధార్ను క్లిక్ చేస్తే గెట్ ఓటీపీ, క్యూఆర్కోడ్, ఇ-కేవైసీ, అథెంటికేషన్ హిస్టరీ, ఆధార్తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా, అప్డేట్ హిస్టరీ వంటివి కనిపిస్తాయి.
7 వాటి దిగువన ఆధార్ అప్డేట్, బుక్ యాన్ అపాయింట్మెంట్, వర్చువల్ ఐడీ, బయోమెట్రిక్స్లాక్, ఆధార్ లాక్ కనపడతాయి.
ఈ మోసాల బారిన పడకుండా..
మనం యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసో, ఫోన్ నెంబరుకు నగదు బదిలీ ద్వారానో బిల్లులు చెల్లిస్తుంటాం. ఇవన్నీ కూడా మన ఆధార్, బ్యాంక్ ఖాతా- ఫోన్నెంబరు జత అయిన ఫలితంగానే సాధ్యమవుతోంది. ఏటీఎంలలో అయితే నగదును కార్డు-పిన్ వినియోగించుకుని, ఉపసంహరిస్తుంటాం. గ్రామాల్లో ఏటీఎంలు అతి తక్కువగా ఉన్నాయి. గ్రామీణులకు ఆసరా పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి అందించేందుకు, ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ‘బ్యాంకింగ్ కస్టమర్ సర్వీస్ పాయింట్’ (సీఎస్పీ)లను బ్యాంకులు నెలకొల్పాయి. ఆధార్తో అనుసంధానమయ్యే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో పాటు సాధారణ బ్యాంక్ ఖాతాదారులు కూడా నగదును ఈ కేంద్రాల్లో ఉపసంహరించుకోవచ్చు. గరిష్ఠంగా ఒక వ్యక్తి రోజుకు రూ.30,000 వరకు ఇక్కడ విత్డ్రా చేయొచ్చు.
* ఒక బ్యాంక్ తరఫున నిర్వహించే కేంద్రంలో ఏ బ్యాంక్ ఖాతాదారు అయినా ఆధార్ అనుసంధానిత వివరాలతో, వేలిముద్ర వేసి కూడా నగదు ఉపసంహరించుకోవచ్చు. ఈ సదుపాయాన్నే బిహార్ వంటి చోట్ల నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఖాతాదారుల వేలిముద్రలు, ఆధార్ వివరాలు సేకరించి, వాటితో రూపులు తయారు చేస్తున్నారు. తదుపరి సుదూర రాష్ట్రాల్లో తమకు అనువుగా ఉన్న గ్రామాల్లోని సీఎస్పీల దగ్గర, ఆ వేలిముద్రల సాయంతో, సంబంధితుల ఖాతాలోని నగదును అపహరిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై విశాఖ పోలీసులు కేసులు కూడా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
వేలి ముద్రల సమాచారం రక్షణకు
వేలిముద్రల వివరాలు లాక్ చేసుకునేందుకు బయోమెట్రిక్స్లాక్ను టచ్ చేయాలి. అప్పుడు ఓటీపీ నమోదు చేస్తే, లాక్ అయిపోయినట్లే. మళ్లీ మనం ఎక్కడైనా ఆధార్ అనుసంధానిత పథకాల్లో వేలిముద్ర వేయాలనుకున్నప్పుడు అన్లాక్ చేయాలనుకుంటే, అక్కడే అన్లాక్ బయోమెట్రిక్స్ను టచ్ చేయాలి. అప్పుడు దాదాపు 10 నిమిషాల సేపు మాత్రమే బయోమెట్రిక్స్ను వినియోగించుకోవచ్చు. ఇందువల్ల మన ఆధార్ అనుసంధానిత వేలిముద్రలను ఎవరూ ఉపయోగించలేరు. ఎవరైనా అక్రమంగా ప్రయత్నించినా, తెలిసిపోతుంది.
ఆధార్ వివరాల రక్షణకు
బయోమెట్రిక్స్ లాక్ కిందే ఆధార్ లాక్ లింక్ ఉంటుంది. దీనికి కూడా వర్చువల్ ఐడీ, ఓటీపీ వంటివి నమోదు చేశాకే, ఆధార్ లాక్ అవుతుంది. తదుపరి వర్చువల్ ఐడీని మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.
* https://resident.uidai.gov.in/bio-lock వెబ్సైట్లో ఆధార్/వర్చువల్ ఐడీ నమోదు చేసి, మొబైల్కు వచ్చే ఓటీపీ నమోదు చేసినా కూడా ఈ సేవలు పొందొచ్చు.
మెసేజ్ ద్వారా
* ఈ ప్రక్రియలో వర్చువల్ ఐడీ కీలకం. ఒకవేళ వర్చువల్ ఐడీ మరచిపోతే, ఆధార్ నమోదిత మొబైల్ నుంచి టోల్ ఫ్రీ నంబర్ 1947కు ఆధార్లోని చివరి 4/8 అంకెలను మెసేజ్ చేసి, పొందొచ్చు. ఉదాహరణకు చివరి అంకెలు 1234.. అయితే ఆర్వీఐడీ 1234 అని 1947కు మెసేజ్ చేస్తే వస్తుంది.
* ఎస్ఎంఎస్ ద్వారా కూడా వర్చువల్ ఐడీ పొందొచ్చు. ఆధార్లోని చివరి 4 అంకెలు 1234 అయితే జీవీఐడీ 1234ని 1947కు పంపితే ఇది వస్తుంది.
మా కేంద్రాల్లో సమాచారం నిల్వ ఉండదు
స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న సీఎస్పీలలో ఖాతాదారుల వివరాలు నిల్వ ఉండవు. మార్ఫో ఆర్డీ సెన్సర్ పరికరాలను వాడుతున్నందున, ఖాతాదారు వేలిముద్ర వేయగానే ఆ వివరాలు బ్యాంక్ సర్వర్కు వెళ్లి, ధ్రువీకరణ పొందాక, ఆటోమేటిక్గా చెరిగిపోతాయి. ఇందువల్ల ఈ కేంద్రాల్లో లావాదేవీలు సురక్షితమే. ఆధార్, బయోమెట్రిక్స్ను లాక్ చేసుకుంటే మోసపోయే ప్రమాదాలు తగ్గుతాయి.
- కె.రంగరాజన్, డీజీఎం, ఎస్బీఐ
- ఈనాడు వాణిజ్య విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు