అత్యుత్తమ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్
భారత్లో ఉద్యోగులు పనిచేయడానికి అత్యుత్తమ సంస్థగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఆదాయాలు, లాభాలు, మార్కెట్ విలువ పరంగా దేశంలో అతిపెద్ద సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది.
ప్రపంచంలో 20వ స్థానం: ఫోర్బ్స్
దిల్లీ: భారత్లో ఉద్యోగులు పనిచేయడానికి అత్యుత్తమ సంస్థగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఆదాయాలు, లాభాలు, మార్కెట్ విలువ పరంగా దేశంలో అతిపెద్ద సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. ఫోర్బ్స్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2022 ప్రకారం.. దేశయంగా తొలిస్థానంలో ఉన్న రిలయన్స్, ప్రపంచంలో 20వ స్థానంలో నిలిచింది. ఒక భారత సంస్థకు ఇదే అత్యుత్తమ ర్యాంకు. 800 కంపెనీలతో రూపొందించిన ఈ జాబితా అగ్రస్థానంలో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ నిలిచింది. తర్వాతి స్థానాలను అమెరికా సంస్థలు మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఆల్ఫాబెట్ (గూగుల్), యాపిల్ దక్కించుకున్నాయి. అమెరికా కంపెనీలే రెండు నుంచి పన్నెండు స్థానాలను పొందాయి. జర్మనీ వాహన దిగ్గజం బీఎండబ్ల్యూ గ్రూప్ 13వ స్థానంలో ఉంది. ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 14, ఫ్రాన్స్ సంస్థ డెకాథ్లాన్ 15వ స్థానాల్లో నిలిచాయి.
* జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్, అమెరికా పానీయాల సంస్థ కోక-కోలా, జపాన్ వాహన దిగ్గజాలు, హోండా, యమహా, సౌదీ చమురు సంస్థ అరామ్కో వంటి సంస్థల కన్నా రిలయన్స్ ఇండస్ట్రీస్ మెరుగైన స్థానం పొందింది.
* ఈ జాబితాలో మన దేశం నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (137వ స్థానం), బజాజ్ (173), ఆదిత్య బిర్లా గ్రూప్ (240), హీరో మోటోకార్ప్ (333), ఎల్ అండ్ టీ (354), ఐసీఐసీఐ బ్యాంక్ (365), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (455), ఎస్బీఐ (499), అదానీ ఎంటర్ప్రైజెస్ (547), ఇన్ఫోసిస్ (668) ఉన్నాయి.
* ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యోగాలకు రాజీనామా చేసే గ్రేట్ రిజిగ్నేషన్ కొనసాగగా, కొవిడ్-19 పరిణామాలు కార్యాలయాల పనితీరును మార్చేశాయి. అధిక వేతనాలు, మెరుగైన ప్రయోజనాలు, అవకాశాలు, పని-జీవన సమతౌల్యతకు ఉద్యోగులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని నివేదిక తెలిపింది.
* 57 దేశాల నుంచి 1,50,000 మంది పూర్తి స్థాయి, తాత్కాలిక ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
రిలయన్స్కే మెట్రో క్యాష్ అండ్ క్యారీ
జర్మనీ సంస్థ మెట్రో ఏజీ, మన దేశంలో నిర్వహిస్తున్న మెట్రో క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 మిలియన్ యూరోల (సుమారు రూ.4060 కోట్ల)కు కొనుగోలు చేయనుంది. దేశంలో 31 టోకు వ్యాపార కేంద్రాలను మెట్రో నిర్వహిస్తోంది. వీటితో పాటు ఆయా కేంద్రాలకు ఉన్న భూమి, ఇతర ఆస్తులు కూడా రిలయన్స్కే చెందుతాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వ్యాపార సంస్థలకూ ప్రత్యేక లావాదేవీలు నిర్వహించాలని భావిస్తున్న రిలయన్స్ రిటైల్కు ఇది కలిసి రానుంది. కొన్ని నెలలుగా ఇరు సంస్థల మధ్య జరుగుతున్న సంప్రదింపులు కొలిక్కి వచ్చాయని, రిలయన్స్ ఆఫర్కు మెట్రో అంగీకరించిందని చెబుతున్నారు. దీనిపై ఇరు సంస్థలు అధికారికంగా స్పందించలేదు. మెట్రోకు కిరాణా దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరర్లు, కార్పొరేట్ సంస్థలు, ఎంఎంఈలు, కంపెనీలు ఖాతాదార్లుగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.