2027కల్లా భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
1991లో పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ చేపట్టిన సంస్కరణలు.. అప్పటి ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించడమే కాదు.. ఆ తర్వాత వృద్ధి పరుగులు తీయడానికీ కారణమయ్యాయి.
3.4 లక్షల కోట్ల డాలర్ల నుంచి పదేళ్లలో 8.5 లక్షల కోట్ల డాలర్లకు
అయిదోవంతు అంతర్జాతీయ వృద్ధీ మనదే
మోర్గాన్ స్టాన్లీ అంచనాలు
దిల్లీ
1991లో పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ చేపట్టిన సంస్కరణలు.. అప్పటి ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించడమే కాదు.. ఆ తర్వాత వృద్ధి పరుగులు తీయడానికీ కారణమయ్యాయి.
ఇపుడు సరికొత్త సంస్కరణల అజెండాకు సమయం ఆసన్నమైంది. కొవిడ్ ముందు స్థాయికి జీడీపీని తీసుకెళ్లడమే కాదు.. అంత కంటే అధిక వృద్ధి సాధించేలా చేయాలి. అది పెద్ద కష్టమేమీ కాదని మోర్గాన్ స్టాన్లీ తాజా అంచనాల్లో పేర్కొంది. ఈ ప్రకారం..
* వచ్చే ఏడేళ్లలో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) మరో 3 లక్షల కోట్ల డాలర్ల మేర పెరుగుతుంది. 2027 కల్లా ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.
* భారత జీడీపీ ప్రస్తుత 3.4 లక్షల కోట్ల డాలర్ల నుంచి వచ్చే 10 ఏళ్లలో రెట్టింపునకు పైగా పెరిగి 8.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.
* ఏటా తన జీడీపీకి 400 బిలియన్ డాలర్లను భారత్ జత చేయొచ్చు. అలా అమెరికా, చైనాలు మాత్రమే చేశాయి.
* 2032 కల్లా భారత మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) 3.4 లక్షల కోట్ల డాలర్ల నుంచి 11 లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చు.
* ఈ అంచనాలన్నీ దేశీయ, అంతర్జాతీయ సానుకూలతలు ఉన్నపుడే సాధ్యమని పేర్కొంది. దేశీయంగా పెట్టుబడులకు, ఉద్యోగ సృష్టికి ఊతమిచ్చేలా విధానాల్లో మరింత మార్పు అవసరమని తెలిపింది.
ఇవీ సానుకూలతలు
‘వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా దేశీయ విపణిని ఒకే విధానం కిందకు తీసుకొచ్చారు. కార్పొరేట్ పన్నుల్లో కోత విధించారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాల ద్వారా దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఇవన్నీ కలిసి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ను వేగవంత వృద్ధిని సాధించే దేశంగా తయారు చేస్తున్నాయి. సేవల ఎగుమతుల్లో అధిక అంతర్జాతీయ వాటాను భారత్ ఇప్పటికే కలిగి ఉంది. ఈ సానుకూలతల వల్లే కరోనా సమయంలోనూ కార్పొరేట్ కంపెనీలు ఇబ్బంది లేకుండా పనిచేయగలిగాయ’ని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో ప్రస్తావించింది.
భారత్, చైనా మధ్య 15 ఏళ్ల అంతరం
ప్రస్తుత భారత జీడీపీ గణాంకాలను చైనా 2007లోనే సాధించింది. అంటే ఇరు దేశాలకు మధ్య 15 ఏళ్ల అంతరం ఉంది. అయితే మరో ఏడేళ్లలో భారత జీడీపీ అదనంగా 3 లక్షల కోట్ల డాలర్లను జత చేసుకోగలదు. ‘పనిచేసే వయసు ఉన్న జనాభా భారత్లో పెరుగుతున్నందున, దీర్ఘకాల వృద్ధి సాధ్యమవుతుంది. చైనాతో పోలిస్తే భారత పౌరుల సగటు వయసు 11 ఏళ్లు తక్కువ. ఇది కలిసి వస్తుంది. దీని వల్ల భారత వాస్తవ జీడీపీ వృద్ధి రాబోయే పదేళ్లలో సగటున 6.5 శాతం రాణించొచ్చు. ఇదే చైనా విషయంలో 3.6 శాతంగానే ఉండొచ్చ’ని నివేదిక వివరించింది.
మనమే గమ్యస్థానం
గత 30 ఏళ్లలో చైనా వృద్ధికి సహాయపడింది ఆ దేశ పారిశ్రామికీకరణే. రోడ్లు, రైల్వేలు వంటి మౌలిక వసతుల ద్వారానే మంచి వృద్ధి సాధించింది. భారత్ ఇపుడు మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆధార్ వంటి ప్రజా డిజిటల్ మౌలిక వసతులను భారత్ నిర్మించింది. తద్వారా వినియోగదార్లు, వ్యాపారుల మధ్య లావాదేవీలు సులభంగానే కాక, సురక్షితంగా సాగుతున్నాయి. ఈ సానుకూలతల వల్ల, రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ వృద్ధిలో అయిదో వంతును భారత్ ఒక్కటే సాధించగలదని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. మెరుగైన వృద్ధి కనుచూపు మేరలో కనిపించని ప్రపంచంలో.. బహుళజాతి కంపెనీలకు; అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ ఒక గమ్యస్థానంలా మారగలదని చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి