2027కల్లా భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
1991లో పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ చేపట్టిన సంస్కరణలు.. అప్పటి ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించడమే కాదు.. ఆ తర్వాత వృద్ధి పరుగులు తీయడానికీ కారణమయ్యాయి.
3.4 లక్షల కోట్ల డాలర్ల నుంచి పదేళ్లలో 8.5 లక్షల కోట్ల డాలర్లకు
అయిదోవంతు అంతర్జాతీయ వృద్ధీ మనదే
మోర్గాన్ స్టాన్లీ అంచనాలు
దిల్లీ
1991లో పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ చేపట్టిన సంస్కరణలు.. అప్పటి ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ను గట్టెక్కించడమే కాదు.. ఆ తర్వాత వృద్ధి పరుగులు తీయడానికీ కారణమయ్యాయి.
ఇపుడు సరికొత్త సంస్కరణల అజెండాకు సమయం ఆసన్నమైంది. కొవిడ్ ముందు స్థాయికి జీడీపీని తీసుకెళ్లడమే కాదు.. అంత కంటే అధిక వృద్ధి సాధించేలా చేయాలి. అది పెద్ద కష్టమేమీ కాదని మోర్గాన్ స్టాన్లీ తాజా అంచనాల్లో పేర్కొంది. ఈ ప్రకారం..
* వచ్చే ఏడేళ్లలో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) మరో 3 లక్షల కోట్ల డాలర్ల మేర పెరుగుతుంది. 2027 కల్లా ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.
* భారత జీడీపీ ప్రస్తుత 3.4 లక్షల కోట్ల డాలర్ల నుంచి వచ్చే 10 ఏళ్లలో రెట్టింపునకు పైగా పెరిగి 8.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.
* ఏటా తన జీడీపీకి 400 బిలియన్ డాలర్లను భారత్ జత చేయొచ్చు. అలా అమెరికా, చైనాలు మాత్రమే చేశాయి.
* 2032 కల్లా భారత మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) 3.4 లక్షల కోట్ల డాలర్ల నుంచి 11 లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చు.
* ఈ అంచనాలన్నీ దేశీయ, అంతర్జాతీయ సానుకూలతలు ఉన్నపుడే సాధ్యమని పేర్కొంది. దేశీయంగా పెట్టుబడులకు, ఉద్యోగ సృష్టికి ఊతమిచ్చేలా విధానాల్లో మరింత మార్పు అవసరమని తెలిపింది.
ఇవీ సానుకూలతలు
‘వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా దేశీయ విపణిని ఒకే విధానం కిందకు తీసుకొచ్చారు. కార్పొరేట్ పన్నుల్లో కోత విధించారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాల ద్వారా దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఇవన్నీ కలిసి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ను వేగవంత వృద్ధిని సాధించే దేశంగా తయారు చేస్తున్నాయి. సేవల ఎగుమతుల్లో అధిక అంతర్జాతీయ వాటాను భారత్ ఇప్పటికే కలిగి ఉంది. ఈ సానుకూలతల వల్లే కరోనా సమయంలోనూ కార్పొరేట్ కంపెనీలు ఇబ్బంది లేకుండా పనిచేయగలిగాయ’ని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో ప్రస్తావించింది.
భారత్, చైనా మధ్య 15 ఏళ్ల అంతరం
ప్రస్తుత భారత జీడీపీ గణాంకాలను చైనా 2007లోనే సాధించింది. అంటే ఇరు దేశాలకు మధ్య 15 ఏళ్ల అంతరం ఉంది. అయితే మరో ఏడేళ్లలో భారత జీడీపీ అదనంగా 3 లక్షల కోట్ల డాలర్లను జత చేసుకోగలదు. ‘పనిచేసే వయసు ఉన్న జనాభా భారత్లో పెరుగుతున్నందున, దీర్ఘకాల వృద్ధి సాధ్యమవుతుంది. చైనాతో పోలిస్తే భారత పౌరుల సగటు వయసు 11 ఏళ్లు తక్కువ. ఇది కలిసి వస్తుంది. దీని వల్ల భారత వాస్తవ జీడీపీ వృద్ధి రాబోయే పదేళ్లలో సగటున 6.5 శాతం రాణించొచ్చు. ఇదే చైనా విషయంలో 3.6 శాతంగానే ఉండొచ్చ’ని నివేదిక వివరించింది.
మనమే గమ్యస్థానం
గత 30 ఏళ్లలో చైనా వృద్ధికి సహాయపడింది ఆ దేశ పారిశ్రామికీకరణే. రోడ్లు, రైల్వేలు వంటి మౌలిక వసతుల ద్వారానే మంచి వృద్ధి సాధించింది. భారత్ ఇపుడు మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆధార్ వంటి ప్రజా డిజిటల్ మౌలిక వసతులను భారత్ నిర్మించింది. తద్వారా వినియోగదార్లు, వ్యాపారుల మధ్య లావాదేవీలు సులభంగానే కాక, సురక్షితంగా సాగుతున్నాయి. ఈ సానుకూలతల వల్ల, రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ వృద్ధిలో అయిదో వంతును భారత్ ఒక్కటే సాధించగలదని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. మెరుగైన వృద్ధి కనుచూపు మేరలో కనిపించని ప్రపంచంలో.. బహుళజాతి కంపెనీలకు; అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ ఒక గమ్యస్థానంలా మారగలదని చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
Afcons Infra IPO: ఐదేళ్ల తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ వస్తోంది. నిర్మాణ రంగ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!