Keka: ‘కేక’కు రూ.470 కోట్ల పెట్టుబడి
కంపెనీల మానవ వనరుల విభాగానికి అవసరమైన సాంకేతిక సేవలు అందించే అంకుర సంస్థ కేక రూ.470 కోట్ల నిధులను అందుకుంది. సిరీస్ ఏ ఫండింగ్లో భాగంగా వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థ వెస్ట్బ్రిడ్జ్ ఈ మొత్తాన్ని సమకూర్చింది.
ఈనాడు, హైదరాబాద్: కంపెనీల మానవ వనరుల విభాగానికి అవసరమైన సాంకేతిక సేవలు అందించే అంకుర సంస్థ కేక రూ.470 కోట్ల నిధులను అందుకుంది. సిరీస్ ఏ ఫండింగ్లో భాగంగా వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థ వెస్ట్బ్రిడ్జ్ ఈ మొత్తాన్ని సమకూర్చింది. సాఫ్ట్వేర్-యాజ్-ఏ-సర్వీస్ (సాస్) విభాగంలో పెద్దమొత్తం పెట్టుబడి సాధించిన సంస్థల్లో కేక ఒకటిగా నిలిచింది. ఈ నిధులను సంస్థ తన విస్తరణకు వినియోగించనుంది. ప్రస్తుతం 500 మంది ఉద్యోగులుండగా, ఏడాదిలో 1,000కి పెంచనుంది. ఏప్రిల్లో 95 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కార్యాలయానికి మారనుంది. ఐరోపాతో పాటు ఇతర దేశాల్లోనూ కార్యకలాపాలను విస్తరించనుంది. 2016లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 6,500 ఎంఎస్ఎంఈల్లో 15 లక్షల మంది ఉద్యోగులకు సేవలను అందిస్తోంది. 20-2000 మంది ఉద్యోగులున్న సంస్థలు తమ సేవలను వినియోగించుకుంటున్నాయని కేక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ యలమంచిలి తెలిపారు. మానవ వనరుల నిర్వహణ, సెలవులు, హాజరు, పేరోల్ వంటి వాటిల్లో తమ ఉత్పత్తులు సహాయం చేస్తాయని పేర్కొన్నారు. ఐటీ, ఔషధ, తయారీ, అకౌంటింగ్, ఫిన్టెక్ కంపెనీలు తమ సేవలను వాడుతున్నాయన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు అవసరమైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులను భారత్ నుంచి అందించాలన్నదే తమ లక్ష్యమని, అందుకే తమ సంస్థకు తెలుగు పేరు ‘కేక’ను పెట్టినట్లు విజయ్ తెలిపారు. ప్రస్తుత వార్షిక అంచనా రాబడి (ఏపీఆర్) రూ.85 కోట్ల వరకు ఉందన్నారు. మధ్యస్థాయి సంస్థలు తమ హెచ్ఆర్ ప్రక్రియను ఆధునికీకరించుకునేందుకు కేక ఉత్పత్తులు తోడ్పడతాయని, దీనికి పెట్టుబడులు అందించడంపై తాము సంతోషంగా ఉన్నట్లు వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్ ప్రిన్సిపల్ రిశిత్ దేశాయ్ అన్నారు.
ఇబ్బందేమీ లేదు: అమెరికా సహా పలు దేశాల్లో మాంద్యం తరహా పరిస్థితులున్నా, భారతీయ అంకురాలకు ఇబ్బందేమీ లేదని విజయ్ యలమంచిలి తెలిపారు. ఆయా దేశాలతో లావాదేవీలు అధికంగా ఉన్న సంస్థలే ఇక్కడ ఉద్యోగులను తొలగిస్తున్నాయన్నారు. పెట్టుబడిదారులు మాత్రం నిధులు సమకూర్చడంలో తొందరపడక, అన్ని విషయాలూ పరిశీలించి, అవసరమైన మేరకే అందిస్తున్నారని వెల్లడించారు. భారతీయ సాస్ మార్కెట్ 25 బిలియన్ డాలర్లుగా ఉందని, ఏటా 8-10 శాతం వృధ్ధి కనిపిస్తోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
Google layoffs: గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే