‘ఫేస్బుక్’లో 11,000 మందికి ఉద్వాసన
ఆదాయాల్లో ఒడుదొడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో, ఫేస్బుక్ మాతృసంస్థ మెటా తన ఉద్యోగుల్లో 13 శాతాన్ని అంటే 11,000 మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు.
మొత్తం సిబ్బందిలో 13 శాతానికి సమానం
న్యూయార్క్: ఆదాయాల్లో ఒడుదొడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో, ఫేస్బుక్ మాతృసంస్థ మెటా తన ఉద్యోగుల్లో 13 శాతాన్ని అంటే 11,000 మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ‘కరోనా అనంతరమూ వేగవంతమైన వృద్ధి ఉంటుందన్న అంచనాలతో, గతంలో నియామకాల విషయంలో దూకుడుగా నిర్ణయం తీసుకున్నాం. దురదృష్టవశాత్తు నేను అంచనా వేసినట్లుగా అది జరగలేద’ని జుకర్బర్గ్ పేర్కొన్నారు. ఇటీవలే ట్విటర్ యజమానిగా మారిన మస్క్, కూడా ‘రోజుకు 4 మిలియన్ డాలర్ల మేర నష్టమొస్తోందంటూ తన 7500 మంది ఉద్యోగుల్లో సగం మేరకు గతవారం తొలగించిన విషయం తెలిసిందే. కొవిడ్ సమయంలో, అప్పటి అవసరాల మేరకు వేగంగా నియమాకాలు చేపట్టిన ఇతర టెక్ కంపెనీలు కూడా, ఇప్పుడు ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి.
ఇవీ కారణాలు..
* కొవిడ్ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా నెలల తరబడి లాక్డౌన్లు అమలు కావడంతో, ప్రజలు ఇళ్లలో కంప్యూటర్ల ముందు, ఫోన్లతోనే ఎక్కువగా గడిపారు. అందువల్లే ఫేస్బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమ కంపెనీలు ఆర్థికంగా రాణించాయి లాక్డౌన్ ముగిశాక ప్రజలు తమ వృత్తి, వ్యాపారాలకు వెళ్తున్నందున, సామాజిక మాధ్యమాలకు కేటాయించే సమయం తగ్గింది. ఫలితంగా ఆయా సంస్థలకు ఆదాయ వృద్ధి పరిమితమవుతోంది. మెటా అయితే తన చరిత్రలోనే తొలి త్రైమాసిక ఆదాయ క్షీణతను ఇటీవల నమోదు చేసింది.
* స్మార్ట్ఫోన్లకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన ‘మెటావర్స్’పై మెటా 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.82,000 కోట్ల) మేర పెట్టుబడులు పెట్టింది. అయితే ప్రస్తుతానికి ఇది వినియోగదార్లను పెద్దగా ఆకట్టుకోవడం లేదు.
* యాపిల్ ప్రైవసీ టూల్స్తో సంస్థకు సవాళ్లు ఎదురయ్యాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ వినియోగదార్లను వారి అనుమతి లేకుండా ట్రాక్ చేయడం, యాడ్స్ పోస్ట్ చేయడం కష్టమవుతోంది. ఇక ఇన్స్టాగ్రామ్కు టిక్టాక్తో పోటీ తీవ్రమైంది.
సిబ్బందికి ప్యాకేజీ ఇలా: ‘మా అన్ని వ్యాపారాల్లో వ్యయాలను తగ్గిస్తున్నాం. బడ్జెట్లలో కోత, ప్రోత్సాహకాలు- కార్యాలయాల తగ్గింపు వంటివి చేపట్టాం. అయినా వ్యయాలు పెద్దగా తగ్గలేదు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింద’ని జుకర్బర్గ్ పేర్కొన్నారు. ‘16 వారాల మూల వేతనంతో పాటు, కంపెనీలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి రెండు వారాల చొప్పున వేతనాన్ని తొలగింపునకు గురైన ఉద్యోగులు అందుకుంటారు. ఆరు నెలల పాటు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా కొనసాగుతుంద’ని ఆయన స్పష్టం చేశారు.
హెచ్1బీ వీసాదార్లకు మద్దతు: సాధారణంగా హెచ్1బీ వీసా కలిగిన వారు అమెరికాలో నివాసం ఉంటూ మూడేళ్ల పాటు పనిచేయొచ్చు. మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. అయితే వీరికి ఉద్యోగం పోతే, 60 రోజుల్లోగా వీసాను స్పాన్సర్ చేసే మరో కంపెనీలో చేరాల్సి ఉంటుంది. లేదంటే అమెరికాను వీడాల్సిందే. అమెరికా టెక్ కంపెనీలు నియమించుకునేవారిలో ఎక్కువ భాగం హెచ్1బీ సిబ్బందే ఉంటారు. అందులోనూ భారత్ వంటి దేశాల నుంచే అధికంగా ఉంటారు. ఇప్పుడు ఫేస్బుక్లో ఉద్యోగం కోల్పోతున్న వారిలో హెచ్1బీ వీసాదార్లు ఉంటే వారికి ‘ఇమిగ్రేషన్ మద్దతు’ ఇస్తామని జుకర్బర్గ్ పేర్కొన్నారు. ‘వీసాపై ఉన్న ఉద్యోగులకు ఇది కష్ట సమయం. మీకు, మీ కుటుంబానికి ఏం కావాలన్నదానిపై ఆధారపడి, మీకు మార్గదర్శకత్వం ఇచ్చేందుకు ఇమిగ్రేషన్ స్పెషలిస్టులు మా వద్ద ఉన్నార’ని ఆయన అన్నారు.
‘‘ఉద్యోగుల తొలగింపు నిర్ణయాలకు బాధ్యత నాదే. ఆయా కుటుంబాలకు ఇందువల్ల ఎంత కష్టం ఏర్పడుతుందో నాకు తెలుసు. లేఆఫ్నకు గురైన వారికి నా క్షమాపణలు. కంపెనీని మరింత బలోపేతం చేయడానికి వ్యయాల కోత, నూతన నియామకాల నిలిపివేత వంటి చర్యలు తీసుకుంటున్నాం.’’
- ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 లక్షల వాహనాల ఉత్పత్తే టార్గెట్.. హ్యుందాయ్ మోటార్ గ్రూప్
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM