చైనా +1.. మనకు గొప్ప అవకాశం
వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవటంపై వ్యాపార సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సూచించారు.
సీఐఐ దక్షిణ ప్రాంత సదస్సులో కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవటంపై వ్యాపార సంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సూచించారు. నాణ్యత, వ్యయాల పరంగా గట్టి పోటీ ఇవ్వగలగాలన్నారు. సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) దక్షిణ ప్రాంత విభాగం సమావేశం శనివారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, దాదాపు 19,000 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా క్లస్టర్, అతిపెద్ద ఇంక్యుబేషన్ కేంద్రమైన టీ-హబ్, ప్రొటోటైప్ కేంద్రమైన టీ-వర్క్స్... వంటి వినూత్నమైన సదుపాయాలు హైదరాబాద్ నగరంలో ఉన్నట్లు తెలిపారు. అటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇటు బయోటెక్నాలజీ రంగాలు విస్తరించిన ప్రత్యేకతా హైదరాబాద్కు దక్కుతుందని అన్నారు. దీనికి అదనంగా పటాన్చెరులో అతిపెద్ద మెడ్టెక్ పార్కు సిద్ధం అవుతోందని తెలిపారు. శ్వేత విప్లవంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, మాంస ఉత్పత్తులు, వంట నూనెల విభాగంలోనూ క్రియాశీలకమైన పాత్ర పోషించటానికి సిద్ధమవుతున్నట్లు వివరించారు. ‘చైనా + 1’ మనకు గొప్ప అవకాశమని, దీన్ని అందిపుచ్చుకొని అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించాలని వ్యాపార సంస్థలకు కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్ పర్సన్ సుచిత్ర ఎల్ల, డిప్యూటీ ఛైర్మన్ కమల్ బాలి, రీజినల్ డైరెక్టర్ ఎన్ఎంపీ జయేశ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాపార వివాదాల పరిష్కారానికి
వినూత్న విధానాలు అవసరం..
జస్టిస్ ఎన్వీ రమణ
ఈనాడు, హైదరాబాద్: దేశంలో వ్యాపార వివాదాల పరిష్కారానికి వినూత్న విధానాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సీఐఐ- దక్షిణ ప్రాంత సమావేశంలో ఆయన ప్రత్యేకోపన్యాసం చేశారు. న్యాయస్థానాలు మాత్రమే తమ వివాదాలను పరిష్కరిస్తాయనే ఉద్దేశంతో వ్యాపార సంస్థలు ఏ ఇతర వేదికలను సంప్రదించడం లేదని, ఇది సరికాదని పేర్కొన్నారు. న్యాయప్రక్రియలో న్యాయస్థానాలకు మాత్రమే కాకుండా ప్రభుత్వ విభాగాలన్నింటికీ పాత్ర ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. ‘వివాదాల పరిష్కారానికి ఇంకెన్నో ప్రత్యామ్నాయ వేదికలు, యంత్రాంగాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో త్వరితంగా వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఈ వేదికలు కల్పిస్తున్నాయి. న్యాయస్థానాలను ఆశ్రయించే ముందు ఆయా వేదికలను పరిశీలించాలి’ అని సూచించారు. తన ముందుకు వచ్చిన వివాదాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో పరిష్కారించటానికి తాను ఎంతో ప్రాధాన్యం ఇచ్చినట్లు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ప్రత్యామ్నాయ విధానాల్లో వివాదాలను పరిష్కరించుకునే యత్నాలను కోర్టులూ ప్రోత్సహిస్తాయని తెలిపారు. ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార వ్యవస్థ దేశంలో గత రెండు దశాబ్దాల్లో ఎంతో విస్తరించిందని వివరించారు. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు, తమ వివాదాల పరిష్కారానికి విభిన్నమైన మార్గాలను అన్వేషించాలని కోరారు.
వ్యాపార సంస్థలు వివాదం ముదరకుండా, సంప్రదింపులతో పరిష్కరించుకునేందుకు మొగ్గుచూపాలని సూచించారు. న్యాయవ్యవస్థ సమర్థత పెరిగేందుకు, ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను గుర్తించేందుకు సీఐఐ వంటి పారిశ్రామిక సంఘాలు కృషి చేయాలని కోరారు. ఇటువంటి అంశాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. తాము ఎదుర్కొంటున్న చట్టపరమైన ఇబ్బందులను ప్రస్తావించాలని సూచించారు. లేని పక్షంలో ఆయా చట్టాల్లోని మంచి చెడుల గురించి ఎలా తెలుస్తుందని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్