ఐఫోన్లో మన హవా ఎంత?
భారత్లో యాపిల్ ఐఫోన్ 14 అసెంబ్లింగ్ సెప్టెంబరులోనే మొదలైంది. తాజాగా మరో సరఫరాదారు(పెగాట్రాన్) కూడా ఈ మోడల్ ఐఫోన్ల తయారీకి ముందుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దేశీయంగా వినియోగం పెరుగుతోంది
తయారీకి ఫాక్స్కాన్ తరవాత పెగాట్రాన్!
చైనాలో ఫాక్స్కాన్ ప్లాంటులో సమస్యల నేపథ్యం
భారత్లో యాపిల్ ఐఫోన్ 14 అసెంబ్లింగ్ సెప్టెంబరులోనే మొదలైంది. తాజాగా మరో సరఫరాదారు(పెగాట్రాన్) కూడా ఈ మోడల్ ఐఫోన్ల తయారీకి ముందుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్పత్తిని అన్ని ప్రాంతాల్లోనూ విస్తరించాలన్న కంపెనీ ఆలోచనల్లో భాగమే ఇది. ఇందుకు కారణమూ ఉంది. ఐఫోన్ తయారీలో ఎక్కువగా పాలుపంచుకుంటున్న చైనాలో వరుస పెట్టి లాక్డౌన్లు రావడం; అమెరికా-చైనా మధ్య సంఘర్షణ వాతావరణం కనిపించడంతో యాపిల్ చూపు భారత్పై పడింది. ఇది మనకు ఎటువంటి వ్యాపారావకాశాలు, ఉద్యోగావకాశాలను ఇవ్వబోతోందన్నదే అసలు ప్రశ్న. అది చైనాకు భారత్ ఎంత వరకు పోటీనివ్వగలుగుతుందన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది.
2017లో భారత్లో విస్ట్రాన్ ద్వారా ఐఫోన్ అసెంబ్లింగ్ మొదలైంది. ఇపుడు ఐఫోన్ల తయారీ పెంపునకు.. భారత్లో సరఫరాదార్లయినై తైవాన్ కంపెనీలు ఫాక్స్కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్లు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో ఐఫోన్ 12 హ్యాండ్సెట్ల తయారీ(తమిళనాడు)ని భారత్లో మొదలుపెట్టిన పెగాట్రాన్.. ఇపుడు ఐఫోన్ 14 తయారీని సైతం చేపట్టనుందని వార్తలు వెలువడుతున్నాయి.ఇక 2022-23లో భారత్లో ఐఫోన్ల తయారీని ఫాక్స్కాన్ 150% మేర పెంచాలని భావిస్తోంది. ఈ కంపెనీ ఇక్కడ ఉత్పత్తి చేసే ఐఫోన్లు అంతర్జాతీయ సరఫరాలో ప్రస్తుతం 2-4 శాతంగానే ఉండగా.. వచ్చే కొన్నేళ్లలో 40-45 శాతానికి పెంచాలని ప్రణాళికలు రచిస్తుండడం ఐఫోన్ల తయారీలో చైనాతో భారత్ పోటీపడడానికి వీలు కల్పించే అంశం.
దేశీయ కంపెనీలు సైతం..
భారత దిగ్గజాలైన టాటా గ్రూప్, వేదాంతాలు కూడా ఐఫోన్ల తయారీకి సంయుక్త సంస్థల ఏర్పాటుకు చర్చలు జరుపుతున్నాయి. టాటా అయితే హోసూరు ప్లాంటులో ఐపోన్ మోడళ్లకు మెకానిక్స్ సరఫరా చేయడం కోసం 45,000 మందిని నియమించుకుంటోంది కూడా. విస్ట్రాన్తో జత కట్టాలనీ చర్చిస్తోంది. దేశంలో భారీగా కార్మిక శక్తి ఉండడం, కార్మిక వ్యయాలు తక్కువ కావడం వల్ల కూడా చైనాకు వెలుపల భారతే అత్యుత్తమ తయారీ కేంద్రంగా కనిపిస్తోంది. అయితే జేపీ మోర్గాన్ సర్వే ప్రకారం.. 2025 కల్లా మొత్తం ఐఫోన్ తయారీలో భారత్ వాటా ప్రస్తుతమున్న 6 శాతం నుంచి 25 శాతానికి చేరినా.. అప్పటికీ చైనా వాటా 94 శాతం నుంచి 75 శాతానికి మాత్రమే తగ్గుతుంది. అంటే చైనాదే పైచేయిగా ఉంటోంది.
మన బలం పెరగాలంటే..
చైనా వాటాను తగ్గించగలిగినా.. భారత్(2), వియత్నాం(3)లు ఆ దేశం తర్వాతి స్థానాల్లోనే ఉంటాయి. ఎందుకంటే.. చైనా తన ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో సరఫరా వ్యవస్థలపై భారీగా పెట్టుబడులు పెడుతూ వచ్చింది. దీంతో ఆర్థిక వ్యవస్థ అసాధారణ వేగాన్ని అందుకోవడంతో ప్రపంచంలోనే తయారీ శక్తిగా ఆ దేశం మారింది. ఐఫోన్ కేంద్రంగా ఉండడం వల్ల ఆ లాభాల్లో ఎక్కువ వాటా చైనాకే వెళుతోంది. విచిత్రం ఏమిటంటే భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లోనే చైనా కంపెనీ ఫోన్లదే ఆధిపత్యం. యాపిల్ మార్కెట్ వాటా చైనాతో పోలిస్తే భారత్లో చాలా తక్కువ. ఈ విషయంలో రాణించాలంటే భారత్ మరిన్ని పెట్టుబడులు పెట్టాలి. అందుకు అనుగుణంగానే 2026 కల్లా ఎలక్ట్రానిక్స్ తయారీ 300 బిలియన్ డాలర్ల పరిశ్రమగా మార్చాలని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఎక్కువ భాగం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం ద్వారా మొబైల్ ఫోన్ల తయారీ ద్వారానే సాధించాలనుకుంటోంది. భారత్లో తయారీకి దిగ్గజం టెక్ కంపెనీలను ఈ పథకం ఆకర్షిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. (పీఎల్ఐ పథకం కింద పెగాట్రాన్ రూ.1132 కోట్ల పెట్టుబడులు పెట్టాలనీ భావిస్తోంది.)
ధర తగ్గుతుందా?
ఇటీవల ప్రకటించిన గూగుల్ పిక్సెల్ 7 ఫోన్ ధరలు ఇతర దేశాల కంటే భారత్లో 20 శాతం వరకు అధికంగా ఉన్నాయి. పన్నులు, కస్టమ్స్.. ఇలా స్థానిక అంశాల ఆధారంగానే ధర నిర్ణయించామని కంపెనీ చెబుతోంది. అలాగే ఐఫోన్ ధరలూ ఇతర దేశాలతో పోలిస్తే భారత్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఐఫోన్ 14నే తీసుకుంటే అమెరికాలో దాని ప్రారంభ ధర 799 డాలర్లు కాగా.. ఇక్కడ 980 డాలర్లు పలుకుతోంది. అధిక పన్నుల వల్ల ఇక్కడ ధర పెరుగుతోంది. చైనాలో 843 డాలర్లు మాత్రమే. అక్కడ హై ఎండ్ విడిభాగాలు లభ్యమవుతుండడమే కారణం. అంటే భారత్లో తయారీ చేపట్టినా కూడా మనం విడిభాగాలపై, ఇతరత్రా మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. దిగుమతులపై ఆధారపడడం తగ్గించి, ఇక్కడ విడిభాగాల తయారీ, మౌలిక వసతులను బలోపేతం చేసుకుంటే స్మార్ట్ఫోన్ మార్కెట్ను భారత్ అందిపుచ్చుకోవచ్చు. ధరలూ కిందకు దిగివస్తాయి. ఇవన్నీ జరిగితే కంపెనీలకు వ్యాపారావకాశాలు, తద్వారా ప్రజలకు ఉద్యోగావకాలు పెరుగుతాయన్నది కాదనలేని వాస్తవం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. -
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
అంబానీ, అదానీ తొలిసారి చేతులు కలిపారు. ఓ పవర్ ప్రాజెక్ట్ విషయంలో వీరి మధ్య భాగస్వామ్యం కుదిరింది. -
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది. -
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. సోషల్మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రీమియం, ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా