Car Deliveries: కార్లు ఇచ్చేద్దాం చకచకా
కార్ల కోసం వినియోగదార్లు బుకింగ్ చేసుకున్న స్థాయిలో, సరఫరాలు చేయడం కంపెనీలకు వీలు కావడం లేదు. ఫలితంగా గిరాకీ ఉన్న మోడళ్ల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.
వేచిచూసే సమయం తగ్గింపు దిశగా చర్యలు
ఇంజిన్ల తయారీ సామర్థ్యం పెంపుపై పెట్టుబడులు
రూ.20,000 కోట్లు వెచ్చించనున్న టాటా, మారుతీ, మహీంద్రా
ముంబయి: కార్ల కోసం వినియోగదార్లు బుకింగ్ చేసుకున్న స్థాయిలో, సరఫరాలు చేయడం కంపెనీలకు వీలు కావడం లేదు. ఫలితంగా గిరాకీ ఉన్న మోడళ్ల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ సమయాన్ని తగ్గించేందుకు దిగ్గజ కంపెనీలు రంగంలోకి దిగాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు గిరాకీకి తగ్గట్లుగా సంప్రదాయ ఇంజిన్ల (ఐసీఈవీ) తయారీ పెంపునకు నడుం కట్టాయి. భారీ ‘వెయిట్లిస్ట్’లో ఉన్న మోడళ్ల ఉత్పత్తి పెంచేందుకు వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఈ మూడు కంపెనీలు కలిసి రూ.20,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టొచ్చని ఆయా కంపెనీల ముఖ్య ఆర్థిక అధికారులు (సీఎఫ్ఓ) వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది.
మహీంద్రా: రూ.7,900 కోట్లు
డీజిల్ మోడళ్లపై సంస్థ గట్టిగా దృష్టి సారిస్తోంది. రాబోయే 12-15 నెలల్లో ఎస్యూవీ తయారీ సామర్థ్యాన్ని 6 లక్షల యూనిట్లకు పెంచాలని భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం వరకు నెలకు 29,000 కార్లను ఉత్పత్తి చేసిందీ కంపెనీ. దీంతో ఎక్స్యూవీ700 వంటి మోడల్ కోసం వేచిచూసే సమయం 22 నెలల వరకు పెరిగింది. అందుకే ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం మూడేళ్లలో రూ.7,900 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ఈ ఏడాది చివరికల్లా నెలకు 39,000; 2023 చివరకు నెలకు 49,000 చొప్పున కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా పెండింగ్లో ఉన్న మొత్తం 2.6 లక్షల కార్ల బుకింగ్లను త్వరగా సరఫరా చేయగలమని అనుకుంటోంది.
టాటా మోటార్స్: రూ.6,000 కోట్లు
ప్రయాణికుల, వాణిజ్య వాహనాల ఉత్పత్తి పెంచేందుకు రూ.6,000 కోట్లు వెచ్చించనుంది. ప్రస్తుతం నెలకు 50,000 వాహనాలు ఉత్పత్తి చేస్తుండగా.. ఈ సామర్థ్యాన్ని నెలకు 55,000కు చేర్చాలని భావిస్తోంది. ఫోర్డ్ నుంచి కొన్న సనంద్ ప్లాంట్ కార్యకలాపాలు మొదలైతే నెలకు అదనంగా 25,000-30,000 వాహనాలు తయారు చేయొచ్చు. దీంతో వార్షిక సామర్థ్యం 9 లక్షలకుపైగా చేరుతుంది. గత ఏడాదిన్నరగా ప్రయాణికుల వాహనాల వ్యాపారంలో గిరాకీ పెరిగిందని, అందుకే మూలధన వ్యయాలను పెంచామని కంపెనీ చెబుతోంది. రేంజ్ రోవర్ స్పోర్ట్, డిఫెండర్ ఎస్యూవీల గిరాకీ దృష్ట్యా తన బ్రిటిష్ అనుబంధ కంపెనీ జాగ్వార్ లాండ్ రోవర్పై రూ.23,500 కోట్ల పెట్టుబడులను కొనసాగించనుంది.
మారుతీ: రూ.7,000 కోట్లు
హరియాణలో కొత్త ప్లాంటు తొలిదశ, కొత్త మోడళ్ల కోసం మారుతీ సుజుకీ రూ.7,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రణాళిక రచించుకుంది. ఈ ఏడాదికి ముందుగా అనుకున్న పెట్టుబడులతో పోలిస్తే 40 శాతం ఎక్కువ ఇది.
విద్యుత్ వాహనాలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 కల్లా మొత్తం వాహన అమ్మకాల్లో ప్రైవేటు కార్లు 30% (100 శాతం నుంచి సవరించారు) వాణిజ్య వాహనాలు 70%, బస్సులు 40%, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు 80% మేర విద్యుత్తో నడిచేవే ఉండాలని లక్ష్యంగా నిర్దేశించింది. అయితే జాతీయ రహదారుల వెంబడి ఛార్జింగ్ వసతుల లేమి కారణంగా ఈవీలకు భారీ ఆదరణ దక్కడానికి మరింత సమయం పట్టవచ్చని వాహన విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా నియంత్రణలకు అనుగుణంగా కొత్త ఐసీఈ మోడళ్ల కోసం మూలధనాన్ని కంపెనీలు కొనసాగిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య