ఐఫోన్‌ 14 డెలివరీలు మరింత ఆలస్యం

యాపిల్‌ ఐఫోన్ల తయారీకి ప్రపంచంలోనే అతిపెద్దదైనా చైనా ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగులు ఆందోళన బాట చేపట్టారు.

Published : 24 Nov 2022 02:37 IST

చైనా ఐఫోన్‌ ఫ్యాక్టరీలో ఆందోళనలు
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోలు

యాపిల్‌ ఐఫోన్ల తయారీకి ప్రపంచంలోనే అతిపెద్దదైనా చైనా ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగులు ఆందోళన బాట చేపట్టారు. కరోనా బారిన పడిన ఉద్యోగులకు, ప్లాంటులో పనిచేస్తున్న సిబ్బందికి తగిన రక్షణ చర్యలు చేపట్టలేదంటూ వీరు తలపెట్టిన నిరసనలకు సంబంధించిన వీడియోలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. అందులో వేల మంది మాస్కులు ధరించి పోలీసులను ఎదుర్కొంటున్న దృశ్యాలున్నాయి. ఆ ప్లాంటులో 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. కరోనా నియంత్రణ చర్యల కరణంగా ఈ ప్లాంటు నుంచి ఐఫోన్‌ 14 డెలివరీలు ఆలస్యం కావొచ్చని యాపిల్‌ పేర్కొంది. తాజా పరిణామాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని