Akasa Air: విశాఖపట్నం- బెంగళూరు మధ్య 10 నుంచి ఆకాశ ఎయిర్‌ విమానం

బెంగళూరు- విశాఖపట్నం మధ్య డిసెంబరు 10 నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తామని ఆకాశ ఎయిర్‌ వెల్లడించింది. ఈ మార్గంలో రోజూ రెండు విమానాలు నడపనున్నట్లు తెలిపింది.

Updated : 24 Nov 2022 10:38 IST

దిల్లీ: బెంగళూరు- విశాఖపట్నం మధ్య డిసెంబరు 10 నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తామని ఆకాశ ఎయిర్‌ వెల్లడించింది. ఈ మార్గంలో రోజూ రెండు విమానాలు నడపనున్నట్లు తెలిపింది. మొదటి సర్వీసు డిసెంబరు 10న, రెండో సర్వీసు 12 నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభించాక.. కంపెనీ అందుబాటులోకి తెస్తున్న 10వ మార్గం ఇదే.  డిసెంబరు 17 నుంచి బెంగళూరు- అహ్మదాబాద్‌ మార్గంలో మూడో విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. పుణె- బెంగళూరు మధ్య నవంబరు 26 నుంచి రోజూ రెండు విమాన సర్వీసులు నడుపుతుండగా, మూడో సర్వీసు డిసెంబరు 10న ప్రారంభమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని