అపోలో డయాగ్నొస్టిక్స్ సేవల భారీ విస్తరణ
డయాగ్నొస్టిక్స్ సేవల విభాగాన్ని పెద్దఎత్తున విస్తరించేందుకు అపోలో హాస్పిటల్స్ గ్రూపు సన్నాహాలు చేస్తోంది. ఈ విభాగం నుంచి మూడేళ్లలో రూ.1,000 కోట్ల ఆదాయం నమోదు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
మూడేళ్లలో రూ.1,000 కోట్ల ఆదాయ లక్ష్యం
ఈనాడు, హైదరాబాద్: డయాగ్నొస్టిక్స్ సేవల విభాగాన్ని పెద్దఎత్తున విస్తరించేందుకు అపోలో హాస్పిటల్స్ గ్రూపు సన్నాహాలు చేస్తోంది. ఈ విభాగం నుంచి మూడేళ్లలో రూ.1,000 కోట్ల ఆదాయం నమోదు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సాధారణ రోగ నిర్ధరణ పరీక్షలే కాకుండా, అత్యాధునిక, సంక్లిష్ట వైద్య పరీక్షలూ నిర్వహించే సామర్థ్యం, సదుపాయాలు సమకూర్చుకోవాలని భావిస్తోంది.
3 విభాగాలుగా
అపోలో హాస్పిటల్స్కు 3 ప్రధాన వ్యాపార విభాగాలున్నాయి. అందులో ఎంతో ముఖ్యమైన వైద్య సేవలను అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) నిర్వహిస్తోంది. దీని అనుబంధ సంస్థ అయిన అపోలో హెల్త్ అండ్ లైఫ్స్టైల్ లిమిటెడ్ (ఏహెచ్ఎల్ఎల్) కింద ప్రైమరీ క్లినిక్స్, డయాగ్నొస్టిక్స్ ల్యాబ్స్, డేకేర్ సేవలున్నాయి. డిజిటల్ హెల్త్కేర్ (అపోలో 24/7), ఫార్మసీ సేవలు.. అపోలో హెల్త్కో లిమిటెడ్ (ఏహెచ్ఎల్) కింద ఉన్నాయి.
సెప్టెంబరు త్రైమాసికంలో రూ.100 కోట్లు
సెప్టెంబరు త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ గ్రూపు ఆదాయాలు, 2021-22 ఇదేకాలంతో పోల్చినప్పుడు 14 శాతం వృద్ధితో రూ.4,251 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో వైద్య సేవల వాటా 53 శాతమైతే, డయాగ్నొస్టిక్స్, ప్రైమరీ క్లినిక్స్, డేకేర్ సేవల వాటా 7 శాతమే. మిగిలిన వాటా అపోలో 24/7, ఫార్మసీ విభాగాల నుంచి లభించింది. డయాగ్నొస్టిక్స్ సేవల విభాగ ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.100 కోట్లను అధిగమించడం ప్రత్యేకత. ఈ విభాగంలో ఇంకా విస్తరించి, ఆదాయాలు పెంచుకోవాలని అపోలో యాజమాన్యం ప్రయత్నాలు చేపట్టింది. దీని కోసం డయాగ్నొస్టిక్స్ కేంద్రాల నెట్వర్క్ను పెంచుకుంటోంది.
2000 కేంద్రాలకు చేరితే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 260 కలెక్షన్ కేంద్రాలను, 9 థర్డ్ పార్టీ ల్యాబ్లను తన నెట్వర్క్ పరిధిలోకి తెచ్చుకుంది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200 నగరాలు/ పట్టణాల్లో 1500 కేంద్రాల నెట్వర్క్ అపోలో చేతిలో ఉంది. రోజుకు 13,000 మందికి పైగా వినియోగదార్లు అపోలో డయాగ్నొస్టిక్స్ సేవలను తీసుకుంటున్నారు. వచ్చే 6 - 8 నెలల్లో డయాగ్నొస్టిక్స్ కేంద్రాల నెట్వర్క్ను 2,000 కేంద్రాలకు పెంచుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో అపోలో డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు ఉన్నాయి. మున్ముందు పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లో కొత్త కేంద్రాలను ప్రారంభించాలనేది ప్రణాళిక. ఇందులో భాగంగా ముంబయి, దిల్లీల్లో ఇటీవల నూతన కేంద్రాలను ప్రారంభించారు. డయాగ్నొస్టిక్స్ సేవల విభాగంలో ఇప్పటికే ఉన్న జాతీయ, ప్రాంతీయ స్థాయి సంస్థలకు తోడు కొత్తగా రిలయన్స్, అదానీ వంటి దిగ్గజ సంస్థలు అడుగు పెట్టే ఆలోచనలు చేస్తున్నందున, భవిష్యత్తులో పోటీ ఎంతో పెరగనుంది. అందువల్ల విస్తరణ ద్వారా ఈ విభాగంలో తన స్థానాన్ని పదిలపరుచుకునే యత్నాల్లో అపోలో హాస్పిటల్స్ గ్రూపు నిమగ్నమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
టెలికాం మార్కెట్లో తిరిగి పుంజుకుంటామని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పారు. వీఐ 2.0 ప్రస్థానం ప్రారంభం కాబోతోందన్నారు. -
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
Tech Mahindra: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా మార్చితో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. లాభంలో భారీ క్షీణతను నమోదు చేసుకుంది. -
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
Credit card: క్రెడిట్ కార్డు ద్వారా జరుపుతున్న లావాదేవీలు 2024 మార్చిలో సరికొత్త మైలురాయిని చేరాయి. -
15 లక్షల వాహనాల ఉత్పత్తే టార్గెట్.. హ్యుందాయ్ మోటార్ గ్రూప్
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...