మొబైల్.. కంప్యూటర్.. బ్యాంకింగ్.. అన్నింటిలోనూ ఉద్యోగ కోతలే
మొబైల్ ఫోన్లకు గిరాకీ తగ్గడానికి తోడు ప్రభుత్వ తనిఖీలు అధికం కావడం, ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందన్న అంచనాల నేపథ్యంలో, చైనా మొబైల్ కంపెనీలు దేశీయంగా వ్యయ నియంత్రణపై దృష్టి సారించాయి.
వచ్చే ఏడాదికి వ్యయ నియంత్రణపై చైనా కంపెనీల దృష్టి
సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగ కోతలు ప్రారంభించగా, మొబైల్ - కంప్యూటర్ తయారీ సంస్థలు, బ్యాంకింగ్ దిగ్గజమూ ఇదే బాట పడుతున్నట్లు ప్రకటించాయి.
మొబైల్ ఫోన్లకు గిరాకీ తగ్గడానికి తోడు ప్రభుత్వ తనిఖీలు అధికం కావడం, ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందన్న అంచనాల నేపథ్యంలో, చైనా మొబైల్ కంపెనీలు దేశీయంగా వ్యయ నియంత్రణపై దృష్టి సారించాయి. ఇందుకోసం ఉద్యోగాల్లో కోతకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కంపెనీల నుంచి స్మార్ట్ఫోన్ల సరఫరాలు ఈ ఏడాది స్తబ్దుగా నమోదు కాగా, వచ్చే ఏడాదిలోనూ అదే ధోరణి ఉంటుందనే అంచనాలున్నాయి. ‘అందుకే మార్కెటింగ్, పంపిణీ విభాగాల్లో నూతన పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీ ఇంకా నిర్ణయం తీసుకోలేద’ని మార్కెట్ పరిశోధనా సంస్థ ఐడీసీ ఇండియా ప్రతినిధి తెలిపారు.
లాభదాయకతపై సందేహాల వల్లే: 2022 తరహాలోనే గిరాకీలో స్తబ్దత, నియంత్రణ పరమైన ఒత్తిడి కొనసాగితే లాభదాయకతపై ప్రభావం పడొచ్చని మొబైల్ పరిశ్రమ భావిస్తోంది. అందుకే సిబ్బందికి లే ఆఫ్లు, స్వచ్ఛంద పదవీ విరమణల దిశగా అవి అడుగులు వేయొచ్చని అంచనా వేస్తున్నారు. దేశీయ స్మార్ట్ఫోన్ విపణిలో 80 శాతం వాటా చైనా కంపెనీలదే. షియోమీ, ఒపో, వివో వంటి చైనా కంపెనీల కార్యకలాపాలపై ప్రభుత్వ పరిశోధనా సంస్థలు దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే. అక్టోబరు-డిసెంబరుకు స్మార్ట్ఫోన్ల సరఫరాలు స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో, 2021తో పోలిస్తే 2022 మొత్తం మీద 8-9 శాతం మేర క్షీణత నమోదు కావొచ్చని ఐడీసీ ఇండియా అంచనా వేసింది.
ఇప్పటికే తొలగింపులు
అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశీయంగా కొన్ని త్రైమాసికాల్లో పలు చైనా కంపెనీలు 600-800 మంది ఉద్యోగులను తగ్గించాయని తెలుస్తోంది. డేటా రక్షణ విధానాల్లో కఠిన ఆంక్షల నేపథ్యంలో, కొన్ని కంపెనీల నుంచి ఉద్యోగులే తప్పుకుని, వేరే కంపెనీలకు మారుతున్నారని సమాచారం. విక్రయాల విభాగాల్లో ఉన్న ఉన్నతాధికారులు తొలగడం కనిపించింది. గత ఏడాదిన్నర కాలంలో ఈ కంపెనీల సిబ్బందిలో 30% కోత విధించినట్లు చెబుతున్నారు. 2023లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే కొన్నేళ్లలో 20-30 శాతం మేర తొలగింపులుండొచ్చంటున్నారు. మార్కెట్లో అవకాశాలకు అనుగుణంగా సిబ్బంది వలసలూ పెరగవచ్చని అంచనా.
హెచ్పీలో 6,000 మంది ఇంటికి
ఆర్థిక మందగమనం నేపథ్యంలో అమెరికాలోని దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తగ్గించుకునే ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్టాప్ల తయారీ సంస్థ హెచ్పీ కూడా 2025 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం ఉద్యోగుల్లో 12 శాతం (సుమారు 6,000) మందికి లేఆఫ్ ఇస్తామని ప్రకటించింది. వ్యక్తిగత, వాణిజ్య పరమైన గిరాకీ తగ్గడం వల్ల, 2023 తొలి త్రైమాసికంలో అంచనా వేసిన దాని కంటే లాభం మరింత తగ్గే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. 2022లో ఎదురైన సవాళ్లు, 2023లోనూ కొనసాగొచ్చని సంస్థ ముఖ్య ఆర్థిక అధికారి మేరీ మయర్స్ వెల్లడించారు. కంపెనీలో సుమారు 50,000 మంది ఉద్యోగులు ప్రస్తుతం పని చేస్తున్నారు. వీరిలో 4,000-6,000 మందికి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమవుతోంది. కొవిడ్ పరిణామాల్లో పీసీలు, ల్యాప్టాప్లకు ప్రజలు, సంస్థల నుంచి అధిక ఆర్డర్లు రావడంతో గరిష్ఠ విక్రయాలు నమోదయ్యాయి. అప్పటితో పోలిస్తే, ప్రస్తుతం విక్రయాలు భారీగా పడ్డాయని కంపెనీ వెల్లడించింది. అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో కుటుంబాలు, వ్యాపార సంస్థలు వ్యయాలను తగ్గించుకుంటుండటమూ గిరాకీ తగ్గడానికి మరో కారణంగా భావిస్తోంది. కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ కూడా సెప్టెంబరు త్రైమాసికంలో 6 శాతం తక్కువ ఆదాయాన్ని ప్రకటించింది. ఇంటెల్ కూడా తమ ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అమెజాన్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ప్లాట్ఫామ్స్, సిస్కో సిస్టమ్స్, గూగుల్.. ఇలా దిగ్గజ సంస్థలన్నీ ఇటీవల ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన సంగతి విదితమే.
క్రెడిట్ సూయిజ్లో 9,000
డిసెంబరు త్రైమాసికంలో 2,700 మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు 2025 నాటికి మొత్తం 9,000 మందిని ఇంటికి పంపించేందుకు స్విట్జర్లాండ్లో రెండో అతి పెద్ద బ్యాంక్ అయిన క్రెడిట్ సూయిజ్ సిద్ధమైంది. సంపద నిర్వహణ సేవల ఖాతాదారుల్లో స్తబ్దత నెలకొన్నందున, అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12,300 కోట్లు) మేర నష్టం ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా లేవని, అన్ని విభాగాల పని తీరు అంతగా బాగోలేదని క్రెడిట్ సూయిజ్ తెలిపింది. ఇదే స్థితి మరికొన్ని నెలలు కొనసాగొచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులను తగ్గించుకోవాలని చూస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
Credit card: క్రెడిట్ కార్డు ద్వారా జరుపుతున్న లావాదేవీలు 2024 మార్చిలో సరికొత్త మైలురాయిని చేరాయి. -
15 లక్షల వాహనాల ఉత్పత్తే టార్గెట్.. హ్యుందాయ్ మోటార్ గ్రూప్
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్