సంక్షిప్త వార్తలు(5)
హైదరాబాద్కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్, తొలి సారిగా నేషనల్ ఏరోస్పేస్ స్టాండర్డ్ (ఎన్ఏఎస్) విడిభాగాలను బోయింగ్కు అందజేసింది.
బోయింగ్కు ఆజాద్ ఇంజినీరింగ్ నుంచి విడిభాగాల సరఫరా
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్, తొలి సారిగా నేషనల్ ఏరోస్పేస్ స్టాండర్డ్ (ఎన్ఏఎస్) విడిభాగాలను బోయింగ్కు అందజేసింది. ఈ కాంట్రాక్టును గత ఏడాది సెప్టెంబరులో సంస్థ దక్కించుకుంది. తమకు కావాల్సిన ఉత్పత్తులను రికార్డు సమయంలో ఆజాద్ ఇంజినీరింగ్ అందించిందని బోయింగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ (సప్లై చైన్) అశ్వనీ భార్గవ పేర్కొన్నారు. ఖచ్చిత ప్రణాళిక, కఠిన ప్రమాణాలను అనుసరించడం ద్వారా దీన్ని సాధించామని ఆజాద్ ఇంజినీరింగ్ ఎండీ రాకేష్ చోప్దార్ తెలిపారు. విమానాల్లో వినియోగించే టర్బైన్ బ్లేడ్ల తయారీ కోసం ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఆజాద్ ఇంజినీరింగ్ ఏర్పాటు చేసింది.
హైదరాబాద్లో ఫెనెస్టా నూతన అల్యూమినియం ఫ్యాక్టరీ
ఈనాడు, హైదరాబాద్: కిటికీలు, తలుపులు అందించే ఫెనెస్టా బిల్డింగ్ సిస్టమ్స్ (ఫెనెస్టా) హైదరాబాద్లో నూతన అల్యూమినియం ఫ్యాక్టరీని ప్రారంబించింది. కంపెనీకి ఇది ఏడో యూనిట్. ఇప్పటికే ఈ సంస్థకు కోట, భివాండీ, చెన్నై, భువనేశ్వర్ నగరాల్లో ఫ్యాక్టరీలున్నాయి. అల్యూమినియం కిటికీలు, తలుపులకు డిమాండ్ పెరుగుతున్నందున, కొత్త ఫ్యాక్టరీని హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు ఫెనెస్టా బిజినెస్ హెడ్ సాకేత్ జైన్ పేర్కొన్నారు. ఫెనెస్టా, దాదాపు రూ.9,000 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ గల డీసీఎం శ్రీరామ్ గ్రూపునకు చెందిన బిల్డింగ్ ఉత్పత్తుల విభాగం. యూపీవీసీ, అల్యూమినియం కిటికీలు, తలుపులను ఈ సంస్థ ఎంతోకాలంగా అందిస్తోంది. దేశవ్యాప్తంగా 270 మంది డీలర్లు ఉన్నట్లు ఈ సంస్థ వెల్లడించింది.
టాటాల చేతికి బిస్లరీ!
దిల్లీ: ప్యాకేజ్డ్ తాగునీటి వ్యాపార సంస్థ బిస్లరీ ఇంటర్నేషనల్ను విక్రయించేందుకు టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) సహా పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నామని ఆ సంస్థ ఛైర్మన్ రమేశ్ చౌహాన్ తెలిపారు. బిస్లరీని రూ.7,000 కోట్లకు టీసీపీఎల్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం ఖరారైందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. ‘మేం బిస్లరీని విక్రయించాలని అనుకుంటున్న మాట వాస్తవం. ఇందుకోసం ఆసక్తిగల కొనుగోలుదార్ల కోసం అన్వేషిస్తున్నాం. కొన్ని సంస్థలతో చర్చలూ జరుపుతున్నామ’ని చౌహాన్ తెలిపారు. బిస్లరీని ఎందుకు విక్రయించనున్నారనే ప్రశ్నకు చౌహాన్ స్పందిస్తూ.. ‘మా అమ్మాయి జయంతికి ఈ వ్యాపారాన్ని నిర్వహించేందుకు ఆసక్తి లేద’ని అన్నారు. వ్యాపార విస్తరణ, వృద్ధి కోసం బిస్లరీ ఇంటర్నేషనల్ను కొనుగోలు చేసేందుకు ఆ సంస్థతో చర్చలు జరుపుతున్నామని ఎక్స్ఛేంజీలకు టాటా గ్రూపు తెలియజేసింది.
లారస్ ల్యాబ్స్కు ఎథాన్ ఎనర్జీలో 26 % వాటా
ఈనాడు, హైదరాబాద్: సొంత విద్యుత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని లారస్ ల్యాబ్స్, సౌర విద్యుదుత్పత్తి సంస్థ ఎథాన్ ఎనర్జీ ఇండియాలో 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.10 ముఖ విలువ కల ఒక్కో షేరుకు రూ.42.70 చొప్పున ధర చెల్లించే ఒప్పందం ప్రకారం 7,40,000 షేర్లు కొనుగోలు చేస్తున్నట్లు లారస్ ల్యాబ్స్ గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. దీనివల్ల ఎథాన్ ఎనర్జీకి చెందిన 10 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంటు నుంచి విద్యుత్తు తీసుకునే అవకాశం ఏర్పడుతుందని లారస్ ల్యాబ్స్ పేర్కొంది.
ఎలీ లిల్లీ నుంచి రొమ్ము కేన్సర్ వ్యాధి ఔషధం
దిల్లీ: ప్రముఖ విదేశీ ఔషధ సంస్థ ఎలీ లిల్లీ, రొమ్ము కేన్సర్ ఔషధాన్ని మనదేశంలో విడుదల చేసింది. ‘రామివెన్’ అనే ఈ ఔషధాన్ని 50, 100, 150, 200 ఎంజీ డోసుల్లో దేశీయ మార్కెట్కు అందిస్తున్నట్లు ఎలీ లిల్లీ వెల్లడించింది. ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ కేన్సర్ (ఈబీసీ) బాధితులకు ఈ మందు అనువైదనిగా కంపెనీ పేర్కొంది. మనదేశంలో ఏటా దాదాపు 50,000 మందికి ఈబీసీ వ్యాధి వస్తున్నట్లు, ఇటువంటి వారికి ఈ ఔషధం భవిష్యత్తుపై భరోసా ఇస్తుందని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న