ఎల్ అండ్ టీ కన్సార్షియమ్కు గ్రీన్కో గ్రూపు ప్రాజెక్టు కాంట్రాక్టు
పునరుత్పాదక ఇంధన వనరుల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న గ్రీన్కో గ్రూపు మధ్యప్రదేశ్లో నిర్మిస్తున్న గాంధీసాగర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్, హైడ్రోమెకానికల్ పనుల కాంట్రాక్టును ఎల్అండ్టీ కన్సార్షియం దక్కించుకుంది.
ఈనాడు, హైదరాబాద్: పునరుత్పాదక ఇంధన వనరుల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న గ్రీన్కో గ్రూపు మధ్యప్రదేశ్లో నిర్మిస్తున్న గాంధీసాగర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్, హైడ్రోమెకానికల్ పనుల కాంట్రాక్టును ఎల్అండ్టీ కన్సార్షియం దక్కించుకుంది. ఈ కాంట్రాక్టును 30 నెలల వ్యవధిలో పూర్తిచేయాలి. దీని విలువ రూ.1,000-2,500 కోట్ల మధ్య ఉంటుంది. ఈ ప్రాజెక్టు మనదేశంలోని అతిపెద్ద క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఒకటి అవుతుందని ఎల్అండ్టీ తెలిపింది. కర్బన వ్యర్థాల నివారణలో మనదేశం మరో ముందడుగు వేయడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని పేర్కొంది. ఇటువంటి ప్రాజెక్టుల్లో రెండు ఇంటర్-కనెక్టెడ్ రిజర్వాయర్లు నిర్మిస్తారు. విద్యుత్తుకు డిమాండ్ తక్కువగా ఉన్న సమయాల్లో నీటిని వృథా చేయకుండా ఎగువన ఉండే రిజర్వాయర్కు పంప్ చేస్తారు. విద్యుత్తుకు డిమాండ్ పెరిగినప్పుడు ఆ నీటిని దిగువకు విడుదల చేయడం ద్వారా అదనపు విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. తద్వారా 80 శాతానికి మించిన విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా