2047 నాటికి అందరికీ బీమా
దేశంలోని ప్రజలందరికీ 2047 కల్లా బీమా భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) సంకల్పించింది.
ఐఆర్డీఏఐ దిశా నిర్దేశం
నూతన సంస్కరణలకు శ్రీకారం
ఈనాడు, హైదరాబాద్: దేశంలోని ప్రజలందరికీ 2047 కల్లా బీమా భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) సంకల్పించింది. ఇందుకోసం వినూత్న సంస్కరణలు ప్రతిపాదిస్తూ, ఒక విధాన పత్రాన్ని శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఐఆర్డీఏఐ 120వ బోర్డు సమావేశంలో ఆవిష్కరించింది. బీమా కంపెనీలు, వినియోగదార్లు, పంపిణీదార్ల అవసరాలను గుర్తించి, పరిష్కరించడం.. బీమా రంగాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన అంశంగా ఐఆర్డీఏఐ గుర్తించింది. ‘వినియోగదార్ల అవసరాలకు అనువైన పాలసీలను బీమా కంపెనీలు ఆవిష్కరించాలి. ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అనువైన వ్యవస్థ ఉండాలి. బీమా కంపెనీలు సులువుగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితులు కల్పించాలి. మార్కెట్ అవసరాల ప్రకారం బీమా నియంత్రణ వ్యవహారాలు ఉండాలి. బీమా రంగంలో కొత్తదనానికి, ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వాల’ని నిర్ణయించింది.
ముఖ్య నిర్ణయాలు
* ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు బీమా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్) ద్వారా రావాల్సిన అవసరం లేదు.
*ఇకపై సబ్సిడరీ కంపెనీలూ బీమా కంపెనీల ప్రమోటర్లుగా ఉండొచ్చు.
* ఒక వ్యక్తి బీమా కంపెనీల్లో 25 శాతం వరకు వాటా సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది 10 శాతమే.
* బీమా కంపెనీలో ప్రమోటర్లు తమ వాటాను 25% వరకు తగ్గించుకోవచ్చు
* బీమా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా.. కార్పొరేట్ ఏజెంట్లు (సీఏ), ఇన్సూరెన్స్ మార్కెటింగ్ సంస్థలు (ఐఎంఎఫ్) ఇకపై ఎక్కువ బీమా కంపెనీలు పాలసీలు విక్రయించవచ్చు. ప్రస్తుత కార్పొరేట్ ఏజెంట్లు 3 బీమా కంపెనీలు, ఐఎంఎఫ్లు 2 బీమా కంపెనీల పాలసీలే విక్రయించే వీలుంది. ఇకపై కార్పొరేట్ ఏజెంట్లు 9 కంపెనీలు, ఐఎంఎఫ్లు 6 కంపెనీల పాలసీలు విక్రయించే అవకాశం కల్పించనున్నారు.
* ముందస్తు అనుమతి తీసుకోకుండానే విభిన్న బీమా పాలసీలను ఆవిష్కరించే అవకాశాన్ని బీమా కంపెనీలకు కల్పిస్తారు. దీనివల్ల మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త రకమైన పాలసీలను తీసుకువచ్చే అవకాశం లభిస్తుంది.
* కొత్త మార్గాల్లో మూలధనం సమకూర్చుకునే అవకాశాన్ని బీమా కంపెనీలకు కల్పిస్తారు.
* ‘యాక్చువరీ’ల కొరతను అధిగమించడానికి వారి అనుభవం, అర్హత నిబంధనలను సడలిస్తారు.
* బీమా కంపెనీలకు ‘సాల్వెన్సీ’ నిబంధనలను సులభతరం చేయాలని ప్రతిపాదించారు.
బీమా కంపెనీల ఐపీఓకు పచ్చ జెండా
గో-డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కు తుది అనుమతిని, ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఐపీఓకు ప్రాథ]మిక అనుమతిని ఐఆర్డీఏఐ ఇచ్చింది. ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, హెడ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ విలీనానికి ఆమోదం తెలిపింది. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రిజిస్ట్రేషన్ను ఆమోదించింది.
ఎంతో స్ఫూర్తి దాయకం
‘‘చరిత్రాత్మకమైన సంస్కరణల దిశగా బీమా రంగాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఐఆర్డీఏఐ ప్రయత్నిస్తోంది. వ్యాపార కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేయటం, పంపిణీ విధానాలను సరళీకరించటం, వినియోగదారుడు కేంద్రంగా కొత్త ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావటం... వంటి విధానాలతో బీమా రంగం పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షిస్తుంది. ఎన్నో సమస్యలకు ఐఆర్డీఏఐ ఏకకాలంలో పరిష్కారాన్ని చూపింది. ‘అందరికీ బీమా’ అనేది ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ లక్ష్యాన్ని సాధించటానికి ప్రస్తుత సంస్కరణలు ఎంతగానో దోహదపడతాయి.’’
- భార్గవ్ దాస్గుప్తా, ఎండీ&సీఈవో ఐసీఐసీఐ లాంబార్డ్ జీఐసి లిమిటెడ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది. -
సీపీ గుర్నానీ కంపెనీతో ఇంటర్గ్లోబ్ భాగస్వామ్యం
టెక్ దిగ్గజం సీపీ గుర్నానీకి చెందిన అసాగోతో, ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యం కుదుర్చుకుని, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార వెంచర్ ‘అలాన్ఓఎస్’ను ఏర్పాటు చేసింది. -
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ లాభం రూ.212 కోట్లు
కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.212.26 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది -
ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి అడుగులేస్తాం!
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి వ్యవహరిస్తామని, పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మధ్య స్థాయి ఐటీ సేవల కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ సందీప్ కల్రా వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు(8)
ఫోక్స్వ్యాగన్ తన స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్యూవీ) టైగన్లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది?