స్వల్ప లాభాలతో సరి
రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, మారుతీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రెండో రోజూ సూచీల రికార్డుల జోరు కొనసాగింది.
సమీక్ష
రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, మారుతీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రెండో రోజూ సూచీల రికార్డుల జోరు కొనసాగింది. చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో లాభాలు పరిమితమయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 81.71 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.21 శాతం లాభంతో 86.37 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్ 1140 పాయింట్లు, నిఫ్టీ 352 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్ నష్టపోగా.. షాంఘై లాభపడింది. ఐరోపా సూచీలు నష్టాల్లో కదలాడాయి.
సెన్సెక్స్ ఉదయం 62,327.88 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ.. 62,447.73 పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అనంతరం లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చిన సెన్సెక్స్, 20.96 పాయింట్ల అతిస్వల్ప లాభంతో 62,293.64 వద్ద ముగిసింది. నిఫ్టీ 28.65 పాయింట్లు పెరిగి 18,512.75 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,445.10- 18,534.90 పాయింట్ల మధ్య కదలాడింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 15 లాభపడ్డాయి. రిలయన్స్ 1.34%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.18%, విప్రో 1.16%, టెక్ మహీంద్రా 1.01%, యాక్సిస్ బ్యాంక్ 0.98%, మారుతీ 0.72%, టాటా స్టీల్ 0.71% చొప్పున రాణించాయి. నెస్లే 1.29%, కోటక్ బ్యాంక్ 0.95%, ఐసీఐసీఐ బ్యాంక్ 0.94%, టైటన్ 0.58% నష్టపోయాయి.
* రెండో వారమూ ఫారెక్స్ నిల్వలు పెరిగాయ్: నవంబరు 18తో ముగిసిన వారానికి దేశ విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు 2.54 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.22,000 కోట్లు) పెరిగి 547.25 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.44,90,000 కోట్ల)కు చేరాయని ఆర్బీఐ పేర్కొంది. ఫారెక్స్ నిల్వల్లో అధిక భాగం ఉండే విదేశీ కరెన్సీ ఆస్తులు 1.76 బిలియన్ డాలర్లు అధికమై 484.288 బిలియన్ డాలర్లకు చేరాయి.
* ఇంజినీరింగ్ సిస్టమ్స్, సొల్యూషన్లు అందించే యునిపార్ట్స్ ఇండియా ఐపీఓ నవంబరు 30న ప్రారంభమై డిసెంబరు 2న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.548- 577 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.836 కోట్లు సమీకరించనుంది.
* గుజరాత్ అంతా 5జీ సేవలు.. జియో: ప్రయోగాత్మక దశలో భాగంగా గుజరాత్లోని 33 జిల్లా కేంద్రాల్లో 5జీ సేవలను ప్రారంభించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. దీంతో అన్ని జిల్లా కేంద్రాల్లో 5జీ సేవలు ప్రారంభమైన తొలి రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది.
* వచ్చే సెప్టెంబరుకు హెచ్డీఎఫ్సీ విలీనం: మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీతో విలీనానికి మరో 8-10 నెలల సమయం పట్టొచ్చని, వచ్చే ఏడాది సెప్టెంబరుకు పూర్తయ్యే అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓ, ఎండీ శశిధరన్ జగదీశన్ తెలిపారు.
* ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజీ (ఐఈఎక్స్) రూ.98 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ (తిరిగి కొనుగోలు) చేయనుంది. ఇందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ పేర్కొంది. ‘బహిరంగ విపణి మార్గంలో రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ.200 ధరకు మించకుండా తిరిగి కొనుగోలు చేసేందుకు, రూ.98 కోట్లు వ్యయం చేయాలని బోర్డు నిర్ణయించింద’ని సంస్థ సమాచారం ఇచ్చింది. ఈ బైబ్యాక్లో గరిష్ఠంగా కొనుగోలు చేసే షేర్ల సంఖ్య 49 లక్షల వరకు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
Anil Agarwal: తన దినచర్యను తెలపడంతో పాటు యువతకు ఆరోగ్య సూత్రాలను పంచుకున్నారు వేదాంత అధిపతి అనిల్ అగర్వాల్. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 73,898 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 22,412 దగ్గర కొనసాగుతోంది. -
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది. -
సీపీ గుర్నానీ కంపెనీతో ఇంటర్గ్లోబ్ భాగస్వామ్యం
టెక్ దిగ్గజం సీపీ గుర్నానీకి చెందిన అసాగోతో, ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యం కుదుర్చుకుని, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార వెంచర్ ‘అలాన్ఓఎస్’ను ఏర్పాటు చేసింది. -
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ లాభం రూ.212 కోట్లు
కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.212.26 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది -
ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి అడుగులేస్తాం!
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి వ్యవహరిస్తామని, పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మధ్య స్థాయి ఐటీ సేవల కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ సందీప్ కల్రా వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు(8)
ఫోక్స్వ్యాగన్ తన స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్యూవీ) టైగన్లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది?
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్