స్మార్ట్ఫోన్ సరఫరాలు బాగా తగ్గాయ్
దేశంలో స్మార్ట్ఫోన్ సరఫరాలు ఈ ఏడాది జులై- సెప్టెంబరులో 10 శాతం తగ్గి మూడేళ్ల కనిష్ఠమైన 4.3 కోట్లకు పరిమితమయ్యాయని మార్కెట్ పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడించింది.
సెప్టెంబరు త్రైమాసికంలో 4.3 కోట్లు: ఐడీసీ
దిల్లీ: దేశంలో స్మార్ట్ఫోన్ సరఫరాలు ఈ ఏడాది జులై- సెప్టెంబరులో 10 శాతం తగ్గి మూడేళ్ల కనిష్ఠమైన 4.3 కోట్లకు పరిమితమయ్యాయని మార్కెట్ పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడించింది. 2019 తర్వాత ఒక త్రైమాసికంలో నమోదైన అత్యల్ప సరఫరాలు ఇవేనని తెలిపింది. బలహీన గిరాకీ, అధిక ధరలు పండగ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపాయని వివరించింది. మొత్తం స్మార్ట్ఫోన్లలో 5జీ ఫోన్ల వాటా 36 శాతానికి (1.6 కోట్లు) చేరింది. జూన్ త్రైమాసికంలో 5జీ స్మార్ట్ఫోన్ సగటు ధర 377 డాలర్లు (దాదాపు రూ.30,600) కాగా, సెప్టెంబరు త్రైమాసికంలో ఇది 393 డాలర్ల (దాదాపు రూ.32,000)కు పెరిగిందని వెల్లడించింది.
* స్మార్ట్ఫోన్ నిల్వలు పేరుకుపోగా, పండగల తర్వాత గిరాకీ సహజంగానే తగ్గుతుంది కనుక డిసెంబరు త్రైమాసికంలోనూ సరఫరాలు స్తబ్దుగా ఉండొచ్చని పేర్కొంది. ఫలితంగా 2022 వార్షిక సరఫరాలు 8-9 శాతం తగ్గి దాదాపు 15 కోట్లుగా నమోదుకావొచ్చని ఐడీసీ డివైస్ రీసెర్చ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవ్కేందర్ సింగ్ వెల్లడించారు. 2023లోనూ గిరాకీపై ద్రవ్యోల్బణం ప్రభావం చూపొచ్చని.. అధిక ధరల నేపథ్యంలో ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్లకు మారడం నెమ్మదించొచ్చని అంచనా వేశారు. 4జీ నుంచి 5జీ ఫోన్లకు మారేవారితో మధ్యశ్రేణి, ఖరీదైన విభాగాలకు కలిసిరావొచ్చని అభిప్రాయపడ్డారు.
* అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్తో పాటు ఇతర ఇకామర్స్ పోర్టళ్ల ఆఫర్లతో ఆన్లైన్ విక్రయాలు మెరుగ్గానే ఉన్నాయని, సంప్రదాయ విక్రయాలు మాత్రం 20 శాతం తగ్గాయని నివేదిక పేర్కొంది.
* మొత్తం మార్కెట్లో మీడియాటెక్ చిప్సెట్ ఆధారిత స్మార్ట్ఫోన్ల వాటా 47 శాతానికి పెరిగింది. క్వాల్కామ్ 25 శాతానికి, యునిసాక్ 15 శాతానికి తగ్గాయి.
* షియామీ 21.2 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉన్నా, సరఫరాలు తగ్గాయి. శామ్సంగ్ 18.5 శాతం వాటాతో రెండో స్థానాన్ని మళ్లీ దక్కించుకుంది. వివో (14.6 శాతం), రియల్మీ (14.2 శాతం), ఓపో (12.5 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రీమియం విభాగంలో యాపిల్ (63 శాతం) అగ్రస్థానం కొనసాగించింది.
శామ్సంగ్.. 13% తగ్గొచ్చు!
వచ్చే ఏడాది శామ్సంగ్ తమ స్మార్ట్ఫోన్ సరఫరాలను 13 శాతం తగ్గించొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొవిడ్-19 పరిణామాలతో పాటు పలు కారణాల వల్ల ఈ ఏడాది కంపెనీ ఆశించిన స్థాయిలో స్మార్ట్ఫోన్లను విక్రయించలేకపోయింది. అందువల్ల వచ్చే ఏడాది స్మార్ట్ఫోన్ సరఫరాలను 13 శాతం తగ్గించి 3 కోట్లకు పరిమితం చేయొచ్చని అంటున్నారు. ఈ ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబరు త్రైమాసికంలో సరఫరాల పరంగా కంపెనీ మార్కెట్ వాటా పెరగలేదు. 2021తో పోలిస్తే మొత్తంగా 8 శాతం క్షీణత నమోదైంది. వచ్చే ఏడాది అంతర్జాతీయంగా శామ్సంగ్ 27 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించొచ్చని అంచనా వేస్తున్నారు. 2022లో విక్రయించగలమని భావిస్తున్న 26 కోట్ల స్మార్ట్ఫోన్లతో పోలిస్తే ఇవి ఎక్కువే. అయితే లాభదాయకత పెంచుకునేందుకు ఫోల్డబుల్ ఫోన్లపై కంపెనీ దృష్టి పెట్టే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.