సంక్షిప్త వార్తలు(3)
కరెన్సీ మారకపు విలువలు ఎలా మారతాయో అంచనా వేయడం కష్టమని, అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కనుక వడ్డీ రేట్ల పెంపు విషయంలో నెమ్మదిస్తే, భారత రూపాయి మారకపు విలువ స్థిరపడే అవకాశం ఉందని ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న అమెరికా ఆర్థికవేత్త డగ్లస్ డబ్ల్యూ.డైమండ్ అభిప్రాయపడ్డారు.
పసిడి దిగుమతులు తగ్గాయ్
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబరులో పసిడి దిగుమతులు 24 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.96 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి. 2021-22 ఇదే కాల దిగుమతులు 29 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.37 లక్షల కోట్ల)తో పోలిస్తే, ఇవి 17.38 శాతం తక్కువ. ఒక్క అక్టోబరులో చూస్తే 27.47 శాతం తక్కువగా 3.7 బి.డా. పసిడి దేశంలోకి దిగుమతి అయ్యింది. ఏప్రిల్-అక్టోబరులో 4.8 బి.డా. వెండి దిగుమతి అయ్యింది. 2021-22 ఇదేకాలంలో వెండి దిగుమతుల విలువ 1.52 బి.డాలర్లే. ఒక్క అక్టోబరులో అయితే 34.80 శాతం తక్కువగా 585 మిలియన్ డాలర్ల వెండి దిగుమతి అయ్యింది.
వడ్డీ రేట్లపై ఫెడ్ నెమ్మదిస్తే రూపాయి స్థిరపడొచ్చు
ఎకనామిక్స్ నోబెల్ విజేత డగ్లస్
దిల్లీ: కరెన్సీ మారకపు విలువలు ఎలా మారతాయో అంచనా వేయడం కష్టమని, అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కనుక వడ్డీ రేట్ల పెంపు విషయంలో నెమ్మదిస్తే, భారత రూపాయి మారకపు విలువ స్థిరపడే అవకాశం ఉందని ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న అమెరికా ఆర్థికవేత్త డగ్లస్ డబ్ల్యూ.డైమండ్ అభిప్రాయపడ్డారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మాజీ ఛైర్ బెన్ బెర్నాంకే, అమెరికాకే చెందిన మరో ఆర్థికవేత్త ఫిలిప్ హెచ్ డిబ్విగ్లతో కలిసి నోబెల్ బహుమతిని డగ్లస్ పంచుకున్నారు.
* డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఇంకా పతనమవుతుండటంపై డైమండ్ మాట్లాడుతూ.. అమెరికా వడ్డీ రేట్లను పెంచినప్పుడల్లా, డాలర్ బలోపేతమవుతుందని పేర్కొన్నారు. ఒకసారి వడ్డీ రేట్ల పెంపు నెమ్మదిస్తే రూపాయి విలువ స్థిరీకరించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.'
* నోబెల్ బహుమతి కింద సుమారు 9 లక్షల యూఎస్ డాలర్లు/రూ.7.3 కోట్లను విజేతలకు అందిస్తారు. డిసెంబరు 10న స్టాక్హోమ్, ఓస్లోలో ఈ బహుమతీ ప్రదానం ఉండనుంది.
రెండేళ్లలో హీరో-హార్లే బైక్
దిల్లీ: హీరో మోటోకార్ప్, హార్లే-డేవిడ్సన్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న బైక్ రెండేళ్లలో మార్కెట్లోకి వస్తుందని హీరో మోటోకార్ప్ సీఎఫ్ఓ నిరంజన్ గుప్తా వెల్లడించారు. ప్రీమియం బైక్ల విభాగంలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకునే ప్రణాళికలో భాగంగానే హార్లే డేవిడ్సన్తో కలిసి బైక్ను అభివృద్ధి చేసి విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. బడ్జెట్ బైక్ల విభాగంలో (100-110సీసీ) నాయకత్వ హోదాలో ఉన్న హీరో మోటోకార్ప్ 160 సీసీ, అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్ విక్రయాల పరిమాణం, లాభదాయకతను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే రెండేళ్లలో ప్రీమియం విభాగంలో తాము తీసుకురాబోయే మోడళ్లు విక్రయ పరిమాణం, లాభదాయకతలో మార్పు తీసుకొస్తాయని, హార్లేతో కలిసి అభివృద్ధి చేస్తున్న ప్లాట్ఫామ్ ఇందుకు ఉపకరిస్తుందని అనలిస్ట్ కాల్ సందర్భంగా గుప్తా వెల్లడించారు. మధ్య కాలానికి ప్రీమియం విభాగంలో మార్కెట్ వాటా పెంచుకునేందుకు ఈ మోడల్ బైక్లు దోహదం చేస్తాయన్నారు. 2020 అక్టోబరులో హీరో మోటోకార్ప్, అమెరికా బ్రాండ్ హార్లే-డేవిడ్సన్లు భారతీయ విపణి కోసం భాగస్వామ్యాన్ని ప్రకటించిన సంగతి విదితమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్