స్వల్పకాలంలో మరింత పైకి
అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో గత వారం దేశీయ సూచీలు లాభాల్లో ముగిశాయి. భవిష్యత్తు రేట్ల పెంపులో నెమ్మదించే అవకాశం ఉందని అమెరికా ఫెడ్ ప్రకటించడంతో, అంతర్జాతీయంగా మార్కెట్లకు పరిస్థితులు సానుకూలంగా మారాయి.
సమీక్ష: అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో గత వారం దేశీయ సూచీలు లాభాల్లో ముగిశాయి. భవిష్యత్తు రేట్ల పెంపులో నెమ్మదించే అవకాశం ఉందని అమెరికా ఫెడ్ ప్రకటించడంతో, అంతర్జాతీయంగా మార్కెట్లకు పరిస్థితులు సానుకూలంగా మారాయి. బ్యారెల్ ముడిచమురు ధర 4.2 శాతం తగ్గి 83.6 డాలర్లకు చేరడం, దేశీయ సంస్థాగత మదుపుదార్ల (డీఐఐ) కొనుగోళ్లతో సెంటిమెంట్ సానుకూలంగానే కొనసాగింది. షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. నెలవారీ డెరివేటివ్ల ముగింపు గడువు నేపథ్యంలో ఒడుదొడుకులు కనిపించాయి. చైనాలో కొవిడ్ నిబంధనలపై ఆందోళనలు ప్రభావం చూపాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 81.68 వద్ద మార్పులేకుండా ముగిసింది. అంతర్జాతీయంగా చూస్తే.. అక్టోబరు నెల ద్రవ్యోల్బణం జపాన్లో 40 ఏళ్ల గరిష్ఠమైన 3.6 శాతానికి, ఐరోపా సమాఖ్యలో 9.9 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 1 శాతం లాభంతో 62,294 పాయింట్ల వద్ద, నిఫ్టీ 1.1 శాతం పెరిగి 18,513 పాయింట్ల దగ్గర స్థిరపడ్డాయి. ఐటీ, చమురు-గ్యాస్, వాహన షేర్లు లాభపడగా, విద్యుత్, స్థిరాస్తి, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.1,246 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.1,781 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. నవంబరులో ఇప్పటివరకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు) రూ.31,630 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 7:5గా నమోదు కావడం..
ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.
ఈ వారంపై అంచనా: సెన్సెక్స్ జీవనకాల గత గరిష్ఠ ముగింపు అయిన 62,245 పాయింట్ల పైకి చేరింది. ఇది సూచీ మరింత పైకి వెళ్లే అవకాశాలను సూచిస్తోంది. 61,440 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఇది కోల్పోతే 60,850 వద్ద కీలక మద్దతు ఉంది. నిరోధం/లాభాల స్వీకరణకు ముందు మార్కెట్ మరింత పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
ప్రభావిత అంశాలు: మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలకు చేరిన నేపథ్యంలో మదుపర్లు అంతర్జాతీయ మార్కెట్లు, రూపాయి కదలికలు, ముడి చమురు ధరల ఒడుదొడుకులు, ఎఫ్ఐఐ పెట్టుబడుల ధోరణి నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ వారం వెలువడనున్న సెప్టెంబరు త్రైమాసిక జీడీపీ గణాంకాలు, అక్టోబరు మౌలిక రంగ గణాంకాలను గమనించాలి. నవంబరు వాహన విక్రయాలు, పీఎంఐ తయారీ గణాంకాలూ ఈ వారంలోనే వెల్లడవుతాయి. సమీప కాలంలో షేరు/రంగం ఆధారిత కదలికలు చోటు చేసుకోవచ్చు. గుజరాత్ శాసనసభ ఎన్నికలూ కీలకం కానున్నాయి. ఈ వారంలో ధర్మాజ్ క్రాప్ గార్డ్, యూనిపార్ట్స్ ఇండియాలు రూ.1,100 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఐపీఓలకు వస్తున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే చైనాలో కొవిడ్ ఆంక్షలు, అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళనలు మార్కెట్లలో ఒడుదొడుకులకు కారణం కావొచ్చు. యూఎస్ రిటైల్ విక్రయాల గణాంకాలు రానున్నాయి. తయారీ సూచీ, యూఎస్ వ్యవసాయేతర ఉద్యోగ గణాంకాలు, ఐరోపా నవంబరు ద్రవ్యోల్బణం, జపాన్ వినియోగదారు విశ్వాస సూచీ గణాంకాలను పరిశీలించాలి.
తక్షణ మద్దతు స్థాయులు: 61,740; 61,442; 60,848
తక్షణ నిరోధ స్థాయులు: 62,600; 63,500; 64,000
సెన్సెక్స్ స్వల్పకాలంలో మరింత పైకి వెళ్లొచ్చు.
సతీశ్ కంతేటి, జెన్ మనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ