దివాలా స్మృతిలో రికవరీ తగ్గుతోంది
రుణాల్లో కూరుకుపోయిన కంపెనీల నుంచి దివాలా స్మృతి కింద వసూళ్లు సెప్టెంబరు త్రైమాసికం చివరకు 30.18 శాతానికి తగ్గిపోయాయి.
ముంబయి: రుణాల్లో కూరుకుపోయిన కంపెనీల నుంచి దివాలా స్మృతి కింద వసూళ్లు సెప్టెంబరు త్రైమాసికం చివరకు 30.18 శాతానికి తగ్గిపోయాయి. అంటే తాము ఇచ్చిన రుణాల్లో అధిక భాగాన్ని ఆర్థిక సంస్థలు వదిలేసుకుంటున్నట్లేనని కేర్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. 2019-20 తొలి త్రైమాసికంలో రికవరీ 43 శాతం కాగా, ఇప్పుడు ఇంతగా తగ్గిపోవడం గమనార్హం. 2021-22 నాలుగో త్రైమాసికం చివరకు రికవరీ రేటు 32.9 శాతం ఉండగా, ఇప్పుడు మరింత తగ్గింది. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు చెందిన వివిధ బెంచ్ల వద్దకు చేరిన కేసుల్లో రూ.7,90,626.2 కోట్ల రుణాలు వసూలు కావాల్సి ఉంది. ఇందులో సెప్టెంబరు త్రైమాసికం చివరకు రూ.2,43,452.5 కోట్లు (30.18%) మాత్రమే రికవరీ అయ్యాయి. అంటే తాము ఇచ్చిన నిధుల్లో దాదాపు 70 శాతాన్ని ఆర్థిక సంస్థలు వదిలేసుకుంటున్నట్లే. 2020-21 రెండో అర్ధభాగం నుంచి ఎన్సీఎల్టీ వద్దకు చేరుతున్న కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది.
* 2016లో దివాలా స్మృతి ప్రక్రియ అమల్లోకి వచ్చినప్పటి నుంచి, 5,893 కంపెనీల రుణ కేసుల పరిష్కారం కోసం ఎన్సీఎల్టీకి చేరగా, 9 శాతం మాత్రమే పరిష్కారమయ్యాయి. 31 శాతం కేసులు లిక్విడిటీకి చేరాయి. 14 శాతం కేసులు రివ్యూకు చేరగా, 11 శాతం ఉపసంహరించారు.
* ఇందులో 3,008 కేసులను ఆపరేషనల్ క్రెడిటార్లు, 2,531 కేసులను ఆర్థిక రుణదాతలు దాఖలు చేశారు. కార్పొరేట్ రుణదాతలు వేసినవి 3 శాతంగా మాత్రమే ఉన్నాయి.
* తయారీ రంగం నుంచి 39 శాతం కేసులు, స్థిరాస్తి నుంచి 21 శాతం, నిర్మాణ రంగం నుంచి 11 శాతం, ట్రేడింగ్ నుంచి 10 శాతం కేసులు దాఖలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా