నిఫ్టీ కొత్త శిఖరాలకు..
భారత మార్కెట్లు మరింత స్థిరీకరణకు గురికావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బుధవారం వెలువడే సెప్టెంబరు త్రైమాసిక జీడీపీ వివరాలు, గురువారం వెలువడే వాహన విక్రయ - తయారీ పీఎంఐ గణాంకాలతో పాటు అమెరికా జీడీపీ, కార్మిక మార్కెట్ విశేషాలనూ గమనించాలి.
బ్యాంకింగ్, వాహన, ఎఫ్ఎంసీజీ షేర్లకు సానుకూలతలు
అంతర్జాతీయ, దేశీయ గణాంకాలు కీలకం
విశ్లేషకుల అంచనాలు
స్టాక్ మార్కెట్
ఈ వారం
భారత మార్కెట్లు మరింత స్థిరీకరణకు గురికావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బుధవారం వెలువడే సెప్టెంబరు త్రైమాసిక జీడీపీ వివరాలు, గురువారం వెలువడే వాహన విక్రయ - తయారీ పీఎంఐ గణాంకాలతో పాటు అమెరికా జీడీపీ, కార్మిక మార్కెట్ విశేషాలనూ గమనించాలి. సానుకూల ధోరణి కొనసాగుతుందని.. నిఫ్టీ-50 సూచీ సరికొత్త జీవనకాల గరిష్ఠాలకు చేరొచ్చని చెబుతున్నారు. నిఫ్టీ-50కి 18,600 వద్ద నిరోధం, 18,300 వద్ద మద్దతు లభించొచ్చంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల పనితీరు, మదుపర్ల సెంటిమెంటుపై ప్రభావం చూపుతుంది. గత 5 వారాల్లో, నాలుగు వారాలు నిఫ్టీ మంచి లాభాలనే నమోదు చేసింది. అయితే మదుపర్లు ఎంపిక చేసిన రంగాలు, షేర్లపై దృష్టి సారించడం మేలని సూచిస్తున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
* సిమెంటు కంపెనీల షేర్లు మార్కెట్తో పాటే కదలాడొచ్చు. డిసెంబరులో కంపెనీలు బస్తాకు రూ.25 చొప్పున ధరలు పెంచొచ్చన్న అంచనాలు నిజమైతే ఈ షేర్లు రాణించొచ్చు.
* యంత్రపరికరాల షేర్లు ఒక శ్రేణికి లోబడే కదలాడొచ్చు. ఆర్డర్ల వార్తలు సానుకూలంగా ఉన్నందున పై స్థాయిలోనే చలించొచ్చు.
* బ్యాంకింగ్ షేర్లు లాభాలను కొనసాగించొచ్చు. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ స్క్రిప్లు రాణించడంతో నిఫ్టీ బ్యాంక్ గత వారం జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన 43,339ని చేరింది. 43,500 వద్ద నిరోధం; 42,500 వద్ద మద్దతు కనిపించొచ్చని అంచనా.
* సంవత్సరాంత పండగల గిరాకీ, కమొడిటీ ధరలు కిందకు దిగి రావడం వల్ల ఎఫ్ఎమ్సీజీ షేర్లు రాణించొచ్చు. గ్రామీణ గిరాకీ పుంజుకోవచ్చన్న అంచనాలూ కలిసిరావొచ్చు.
* మార్కెట్తో పాటే వాహన కంపెనీల షేర్లు సానుకూల ధోరణిలో చలించొచ్చు. నవంబరు అమ్మకాలు డిసెంబరు1న రానున్నాయి. చాలా వరకు వృద్ధినే నమోదు చేయనున్నాయని అంచనా. ప్రయాణికుల వాహనాలు ముందుండి నడిపించొచ్చు.
* ప్రధాన వార్తలేమీ లేనందున ఔషధ కంపెనీలు స్తబ్దుగానే కొనసాగొచ్చు. కొన్ని కంపెనీల షేరు ధరలు సహేతుకంగానే ఉన్నా.. నియంత్రణ పరమైన ఇబ్బందులు, కొత్త ఆవిష్కరణల్లో మందగమనం, పోటీ పెరగడం వంటి వాటి వల్ల మదుపర్లు వెనకడుగు వేయొచ్చు.
* అంతర్జాతీయ బలహీనతలు కొనసాగుతుండడం, ఫెడ్ వైఖరిలో స్పష్టత రావడంతో దేశీయ లోహ కంపెనీల షేర్లలో తాజా కొనుగోళ్లకు ఆసక్తి ఉండకపోవచ్చు.
* అప్స్ట్రీమ్ కంపెనీలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా షేర్లు ముడి చమురు ధరల ఆధారంగా చలించొచ్చు. చైనా నుంచి తక్కువ గిరాకీ కారణంగా చమురు ధరలు తగ్గే అవకాశమే కనిపిస్తోంది.
* ఎంపిక చేసిన టెలికాం షేర్లలో కదలికలు కొనసాగొచ్చు. భారతీ ఎయిర్టెల్ షేరు రూ.820 దిశగా వస్తే కొనుగోళ్లు చేయవచ్చని.. రూ.860కి పైకి వెళ్లేందుకు అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఆర్ఐఎల్ను రూ.2700 లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చంటున్నారు.
* ఐటీ షేర్లు అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా ట్రేడవవచ్చు. ఐటీ రంగంలో 80% దిద్దుబాట్లు పూర్తయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్, రేట్ల పెంపు విషయంలో ఇచ్చిన సంకేతాలు సానుకూలంగా పనిచేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
Credit card: క్రెడిట్ కార్డు ద్వారా జరుపుతున్న లావాదేవీలు 2024 మార్చిలో సరికొత్త మైలురాయిని చేరాయి. -
15 లక్షల వాహనాల ఉత్పత్తే టార్గెట్.. హ్యుందాయ్ మోటార్ గ్రూప్
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ