రూ.1.20 లక్షల కోట్ల ఔషధ ఎగుమతులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబరులో దేశం నుంచి ఔషధ ఎగుమతులు 14.57 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.20 లక్షల కోట్లు)గా నమోదయ్యాయని ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెగ్జిల్) డైరెక్టర్ జనరల్ ఉదయ భాస్కర్ వెల్లడించారు.
ఏప్రిల్-అక్టోబరుపై ఫార్మెగ్జిల్ డీజీ ఉదయ భాస్కర్
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబరులో దేశం నుంచి ఔషధ ఎగుమతులు 14.57 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.20 లక్షల కోట్లు)గా నమోదయ్యాయని ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెగ్జిల్) డైరెక్టర్ జనరల్ ఉదయ భాస్కర్ వెల్లడించారు. 2021-22 ఇదే కాల ఎగుమతులు 13.98 బి.డా. (సుమారు రూ.1.15 లక్షల కోట్ల) కంటే ఇవి 4.22 శాతం అధికమని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద 24.62 బి.డా. (సుమారు రూ.2.01 లక్షల కోట్ల) ఔషధాల ఎగుమతి జరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 27 బి.డా. (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) విలువైన ఔషధాలు ఎగుమతి చేయగలమనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జులై (-0.32%), అక్టోబరు (-5.45%)లలో ప్రతికూల వృద్ధి నమోదైనా కూడా, రాబోయే నెలల్లో ఔషధ ఎగుమతులు బాగుంటాయనే నమ్మకం ఉందని, అందుకే ఆర్థిక సంవత్సరం మొత్తంమీద సానుకూల వృద్ధి అంచనాలు వేస్తున్నట్లు వివరించారు.
* మొత్తం ఎగుమతుల్లో అమెరికా, కెనడా, మెక్సికో, ఐరోపా, ఆఫ్రికా దేశాల వాటా 67.5 శాతం ఉంటుందని ఉదయ భాస్కర్ చెప్పారు. అయితే వ్యాక్సిన్ల ఎగుమతులు తగ్గినట్లు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ఉన్నా కూడా, ఔషధ ఎగుమతులు పెరుగుతాయన్నదే తమ విశ్వాసంగా చెప్పారు.
* అక్టోబరులో దేశం నుంచి అన్ని రకాల ఎగుమతులు 16.65 శాతం తగ్గి 29.78 బి.డా.కు పరిమితమయ్యాయని వాణిజ్య శాఖ తెలిపింది. ఇందులో భాగమైన ఔషధ ఎగుమతులు 5.45 శాతం తగ్గి, 1.95 బి.డా.కు పరిమితమయ్యాయి.
ఎగుమతులు తగ్గేందుకు..
కొన్ని దేశాల కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ బలోపేతం కావడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎదురైన ఆంక్షల వల్లే అక్టోబరులో ఔషధ ఎగుమతులు తగ్గాయని ఉదయభాస్కర్ తెలిపారు. మన దేశం నుంచి ఔషధాలు అధికంగా ఎగుమతి అయ్యే 5 దేశాల్లో నైజీరియా ఒకటి. డాలర్తో పోలిస్తే, ఆ దేశ కరెన్సీ నైరా మారకపు విలువ గణనీయంగా తగ్గడంతో, ఆ దేశం దిగుమతులను పరిమితం చేసుకుందని వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Politics News
Tripira Election: త్రిపుర బరిలో కేంద్రమంత్రి.. భాజపా జాబితా విడుదల
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ ఆల్టైమ్ ‘XI’.. కెప్టెన్సీపై చర్చ.. ఓజా ఎంపిక ఎవరంటే?