భారత వృద్ధి రేటు అంచనాల్లో కోత
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) భారత వృద్ధి రేటు అంచనాను 7 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది.
2022-23లో 7%: ఎస్అండ్పీ
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) భారత వృద్ధి రేటు అంచనాను 7 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. అయితే అంతర్జాతీయ మందగమన ప్రభావం భారత్పై తక్కువగానే ఉంటుందని పేర్కొంది. కాగా.. 2022-23కు వృద్ధి రేటును 7.3 శాతం గాను, 2023-24కు 6.5 శాతం గాను సెప్టెంబరులో ఎస్ అండ్ పీ అంచనా వేసింది. ‘దేశీయంగా గిరాకీపై ఎక్కువగా ఆధారపడే భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థలపై ప్రపంచ మందగమన ప్రభావం పరిమితంగానే ఉండొచ్చు. 2022-23లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 శాతంగా నమోదు కావచ్చ’ని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా-పసిఫిక్ ముఖ్య ఆర్థికవేత్త లూయిస్ కూయిజ్స్ తెలిపారు. 2021లో భారత ఆర్థిక వ్యవస్థ 8.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆసియా- పసిఫిక్ ప్రాంతంలోని కొన్ని దేశాల్లో కొవిడ్-19 ప్రభావం నుంచి దేశీయ గిరాకీ మరింత పుంజుకునే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ తన నివేదికలో తెలిపింది. ఈ పరిణామం వచ్చే ఏడాది భారత్ వృద్ధికి కలిసి వస్తుందని పేర్కొంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 6.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఆర్బీఐ కీలక రెపో రేటు 6.25 శాతానికి చేరుతుందని పేర్కొంది. మార్చి చివరి నాటికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ.79.50కు దిగివస్తుందని తెలిపింది.
రెండో త్రైమాసికంలో 5.8%.. ఎస్బీఐ రీసెర్చ్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 5.8 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. వివిధ సంస్థల సగటు అంచనాలతో పోలిస్తే ఇది 30 బేసిస్ పాయింట్లు తక్కువ. అధికారిక జీడీపీ గణాంకాలు రేపు (నవంబరు 30న) విడుదల కానున్నాయి.
బ్యాంకు రుణాల్లో 17.2% వృద్ధి: ఆర్బీఐ
జులై-సెప్టెంబరు 2022 త్రైమాసికంలో బ్యాంకుల రుణ వృద్ధి 17.2 శాతం మేర నమోదైందని.. ఇది ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయనడానికి నిదర్శనమని ఆర్బీఐ త్రైమాసిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతక్రితం త్రైమాసికంలో రుణాల వృద్ధి 14.2 శాతంగా నమోదు కాగా, ఏడాది కిందట ఇదే మూడు నెలల కాలంలో 7 శాతంగా మాత్రమే ఉంది. ఆ నివేదికలోని ముఖ్యాంశాలు..
* డిపాజిట్ల సగటు వృద్ధి జూన్ 2021 నుంచీ 9.5-10.2 శాతానికి దగ్గరగానే ఉంది. సెప్టెంబరు 2022లో ఇది 9.8 శాతంగా ఉంది.
* డిసెంబరు 2020 నుంచీ గ్రామీణ, పాక్షిక పట్టణ, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే మెట్రో నగరాల్లోని బ్యాంకు శాఖల్లో మంచి వార్షిక వృద్ధి నమోదవుతూ వస్తోంది.
* డిపాజిట్ల సేకరణలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు రంగ బ్యాంకులు మెరుగ్గా రాణిస్తున్నాయి
* సెప్టెంబరు 2022లో డిపాజిట్ల ఏడాది వారీ వృద్ధి అంతక్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 6.4 శాతం నుంచి 10.2 శాతానికి చేరింది.
* ఇక కరెంట్, సేవింగ్స్ డిపాజిట్ల వృద్ధి వరుసగా 9.4 శాతం నుంచి 8.8 శాతానికి; 17.5% నుంచి 14.5 శాతానికి తగ్గాయి.
* మొత్తం డిపాజిట్లలో సేవింగ్స్ డిపాజిట్ల వాటా జూన్ 2019లో 32.4 శాతంగా ఉండగా.. జూన్ 2022న 35.2 శాతం వద్ద గరిష్ఠాలకు చేరాయి. తాజా త్రైమాసికంలో అవి 34.7 శాతంగా నమోదయ్యాయి.
బ్యాంకుల రుణాల వృద్ధి బలంగానే: ఫిచ్
అధిక వడ్డీ రేట్ల ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల రుణ మంజూరులో బలమైన వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. ఈ పరిణామం నికర ఆదాయాలు పెరిగేందుకు దోహదం చేస్తుందని తెలిపింది. ముఖ్యంగా నికర వడ్డీ మార్జిన్లు ఇందుకు ఉపకరిస్తాయని పేర్కొంది. ‘2022-23లో బ్యాంకుల రుణాల వృద్ధి 13 శాతంగా ఉండొచ్చు. 2021-22లో ఇది 11.5 శాతంగా ఉంది. కొవిడ్-19 పరిణామాల తర్వాత ఆర్థిక కార్యకలాపాల్లో పురోగతి, అధిక జీడీపీ వృద్ధి.. బ్యాంకుల రుణాల్లో బలమైన వృద్ధికి దోహదం చేస్తుంది. రిటైల్, నిర్వహణ మూలధన విభాగాల రుణాలకు అధిక గిరాకీ ఉండొచ్చని భావిస్తున్నామ’ని ఫిచ్ ఒక ప్రకటనలో తెలిపింది. 2022-23లో భారత జీడీపీ వృద్ధి 7 శాతంగా నమోదుకావచ్చని అంచనా వేసింది. వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ.. రుణాల వృద్ధి కోసం నిధులను సమీకరించేందుకు భారత్ బ్యాంకులు సిద్ధంగానే ఉంటాయని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Elon Musk: ‘అవును కెటామైన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు గతంలో డ్రగ్స్ వినియోగించినట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. -
‘ఆ వార్తలు అవాస్తవం’: అమెరికా దర్యాప్తు చేపట్టిందన్న కథనంపై అదానీ గ్రూప్ స్పందన
లంచం ఆరోపణల విషయంలో దర్యాప్తు గురించి వెలువడిన మీడియా కథనం అవాస్తవమని అదానీ గ్రూప్(Adani Group) వెల్లడించింది. -
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. -
2024-25లోనూ ఐటీ నియామకాలు అంతంతే
ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధి బాట పట్టేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పరిస్థితి ఉంటుందనే అంశమే కాస్త ఊరట కలిగిస్తోంది. -
దీర్ఘకాలంలో చిన్న, మధ్య షేర్లు బలంగానే
చిన్న, మధ్య స్థాయి షేర్ల విలువలు మరీ అధిక స్థాయికి చేరాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేసిన వ్యాఖ్యలతో ఈ షేర్లు గత 3 వారాల్లో భారీగా కుదేలయ్యాయి. -
ఆఫీసుకు వస్తేనే పదోన్నతులు
కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్ట్యాప్ల తయారీ కంపెనీ డెల్ లేఖ పంపినట్లు తెలుస్తోంది. -
రూ.1991కే ఫ్లై91 ప్రయాణం
ఫ్లై91 సంస్థ సోమవారం తన విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి విమానం గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం గం.7.55కు బయలుదేరి వెళ్లింది. -
ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగింది: హైర్ ప్రో
అంతక్రితం ఏడాదితో పోలిస్తే, 2022-23 ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగినట్లు ఏఐ పవర్డ్ రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ హైర్ ప్రో నివేదిక వెల్లడించింది. -
అంకురాలకు విలువే సర్వస్వం కాదు
పారదర్శకత, నైతిక ప్రవర్తన కోసం స్వీయ నియంత్రణ విధానాన్ని దేశీయ అంకుర సంస్థలు అవలంబించాలని జీ20లో భారత తరపు ప్రధాన ప్రతినిధి (షెర్పా) అమితాబ్ కాంత్ తెలిపారు. -
మదుపర్ల అప్రమత్తత
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్నందున, మదుపర్లు అప్రమత్తత పాటించారు. -
బీమా రంగంలోకి రూ.54,000 కోట్ల ఎఫ్డీఐ
గత తొమ్మిదేళ్లలో బీమా రంగం రూ.54,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆకర్షించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. -
బెంగళూరు- లక్షద్వీప్ విమాన సర్వీసు: ఇండిగో
లక్షద్వీప్కు విమాన సదుపాయాన్ని విస్తరించడంలో భాగంగా ఈనెల 31 నుంచి బెంగళూరు- అగత్తి మధ్య నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో సోమవారం వెల్లడించింది. -
మనవడికి రూ.240 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి భారీ బహుమతి ఇచ్చారు. -
సంక్షిప్త వార్తలు
ఈ వేసవిలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అంతర్జాతీయ విమాన సర్వీసులను 20 శాతానికి పైగా పెంచనుంది. దేశ, విదేశీ మార్గాల్లో రోజువారీ 360కి పైగా విమాన సర్వీసులను నడపబోతోంది. -
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
WhatsApp payments: వాట్సప్లో పేమెంట్స్ ఇక మరింత సులువు కానుంది. చాట్ లిస్ట్లోనే ఇకపై క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
-
Elon Musk: ‘అవును కెటామైన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
-
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత