భారత వృద్ధి రేటు అంచనాల్లో కోత
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) భారత వృద్ధి రేటు అంచనాను 7 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది.
2022-23లో 7%: ఎస్అండ్పీ
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) భారత వృద్ధి రేటు అంచనాను 7 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. అయితే అంతర్జాతీయ మందగమన ప్రభావం భారత్పై తక్కువగానే ఉంటుందని పేర్కొంది. కాగా.. 2022-23కు వృద్ధి రేటును 7.3 శాతం గాను, 2023-24కు 6.5 శాతం గాను సెప్టెంబరులో ఎస్ అండ్ పీ అంచనా వేసింది. ‘దేశీయంగా గిరాకీపై ఎక్కువగా ఆధారపడే భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థలపై ప్రపంచ మందగమన ప్రభావం పరిమితంగానే ఉండొచ్చు. 2022-23లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 శాతంగా నమోదు కావచ్చ’ని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా-పసిఫిక్ ముఖ్య ఆర్థికవేత్త లూయిస్ కూయిజ్స్ తెలిపారు. 2021లో భారత ఆర్థిక వ్యవస్థ 8.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆసియా- పసిఫిక్ ప్రాంతంలోని కొన్ని దేశాల్లో కొవిడ్-19 ప్రభావం నుంచి దేశీయ గిరాకీ మరింత పుంజుకునే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ తన నివేదికలో తెలిపింది. ఈ పరిణామం వచ్చే ఏడాది భారత్ వృద్ధికి కలిసి వస్తుందని పేర్కొంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 6.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఆర్బీఐ కీలక రెపో రేటు 6.25 శాతానికి చేరుతుందని పేర్కొంది. మార్చి చివరి నాటికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ.79.50కు దిగివస్తుందని తెలిపింది.
రెండో త్రైమాసికంలో 5.8%.. ఎస్బీఐ రీసెర్చ్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 5.8 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. వివిధ సంస్థల సగటు అంచనాలతో పోలిస్తే ఇది 30 బేసిస్ పాయింట్లు తక్కువ. అధికారిక జీడీపీ గణాంకాలు రేపు (నవంబరు 30న) విడుదల కానున్నాయి.
బ్యాంకు రుణాల్లో 17.2% వృద్ధి: ఆర్బీఐ
జులై-సెప్టెంబరు 2022 త్రైమాసికంలో బ్యాంకుల రుణ వృద్ధి 17.2 శాతం మేర నమోదైందని.. ఇది ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయనడానికి నిదర్శనమని ఆర్బీఐ త్రైమాసిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతక్రితం త్రైమాసికంలో రుణాల వృద్ధి 14.2 శాతంగా నమోదు కాగా, ఏడాది కిందట ఇదే మూడు నెలల కాలంలో 7 శాతంగా మాత్రమే ఉంది. ఆ నివేదికలోని ముఖ్యాంశాలు..
* డిపాజిట్ల సగటు వృద్ధి జూన్ 2021 నుంచీ 9.5-10.2 శాతానికి దగ్గరగానే ఉంది. సెప్టెంబరు 2022లో ఇది 9.8 శాతంగా ఉంది.
* డిసెంబరు 2020 నుంచీ గ్రామీణ, పాక్షిక పట్టణ, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే మెట్రో నగరాల్లోని బ్యాంకు శాఖల్లో మంచి వార్షిక వృద్ధి నమోదవుతూ వస్తోంది.
* డిపాజిట్ల సేకరణలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు రంగ బ్యాంకులు మెరుగ్గా రాణిస్తున్నాయి
* సెప్టెంబరు 2022లో డిపాజిట్ల ఏడాది వారీ వృద్ధి అంతక్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 6.4 శాతం నుంచి 10.2 శాతానికి చేరింది.
* ఇక కరెంట్, సేవింగ్స్ డిపాజిట్ల వృద్ధి వరుసగా 9.4 శాతం నుంచి 8.8 శాతానికి; 17.5% నుంచి 14.5 శాతానికి తగ్గాయి.
* మొత్తం డిపాజిట్లలో సేవింగ్స్ డిపాజిట్ల వాటా జూన్ 2019లో 32.4 శాతంగా ఉండగా.. జూన్ 2022న 35.2 శాతం వద్ద గరిష్ఠాలకు చేరాయి. తాజా త్రైమాసికంలో అవి 34.7 శాతంగా నమోదయ్యాయి.
బ్యాంకుల రుణాల వృద్ధి బలంగానే: ఫిచ్
అధిక వడ్డీ రేట్ల ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల రుణ మంజూరులో బలమైన వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. ఈ పరిణామం నికర ఆదాయాలు పెరిగేందుకు దోహదం చేస్తుందని తెలిపింది. ముఖ్యంగా నికర వడ్డీ మార్జిన్లు ఇందుకు ఉపకరిస్తాయని పేర్కొంది. ‘2022-23లో బ్యాంకుల రుణాల వృద్ధి 13 శాతంగా ఉండొచ్చు. 2021-22లో ఇది 11.5 శాతంగా ఉంది. కొవిడ్-19 పరిణామాల తర్వాత ఆర్థిక కార్యకలాపాల్లో పురోగతి, అధిక జీడీపీ వృద్ధి.. బ్యాంకుల రుణాల్లో బలమైన వృద్ధికి దోహదం చేస్తుంది. రిటైల్, నిర్వహణ మూలధన విభాగాల రుణాలకు అధిక గిరాకీ ఉండొచ్చని భావిస్తున్నామ’ని ఫిచ్ ఒక ప్రకటనలో తెలిపింది. 2022-23లో భారత జీడీపీ వృద్ధి 7 శాతంగా నమోదుకావచ్చని అంచనా వేసింది. వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ.. రుణాల వృద్ధి కోసం నిధులను సమీకరించేందుకు భారత్ బ్యాంకులు సిద్ధంగానే ఉంటాయని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. -
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
అంబానీ, అదానీ తొలిసారి చేతులు కలిపారు. ఓ పవర్ ప్రాజెక్ట్ విషయంలో వీరి మధ్య భాగస్వామ్యం కుదిరింది. -
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది. -
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. సోషల్మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రీమియం, ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా