సెన్సెక్స్ @ 68,500
వచ్చే ఏడాది డిసెంబరుకు సెన్సెక్స్ 10 శాతం దూసుకెళ్లి 68,500 పాయింట్లకు చేరే అవకాశం ఉందని అమెరికా బ్రోకరేజీ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.
2023 డిసెంబరుకు చేరొచ్చు
మోర్గాన్ స్టాన్లీ అంచనా
సమీక్ష
ముంబయి: వచ్చే ఏడాది డిసెంబరుకు సెన్సెక్స్ 10 శాతం దూసుకెళ్లి 68,500 పాయింట్లకు చేరే అవకాశం ఉందని అమెరికా బ్రోకరేజీ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. మార్కెట్ రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, కొన్ని ప్రతిబంధకాలు కూడా ఉన్నట్లు పేర్కొంది. సంస్థ ముఖ్య ఆర్థికవేత్త రిధమ్ దేశాయ్, ఆయన బృందం రూపొందించిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. ‘కంపెనీల లాభాదాయకత పెరుగుతోంది. 2023 మొదటి త్రైమాసికంలో వడ్డీ రేట్లు గరిష్ఠానికి చేరొచ్చు. 2022తో పోలిస్తే అంతర్జాతీయ ప్రతికూలతలు కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో భారత ఈక్విటీలు పరుగులు తీయొచ్చు. 2023లో కొంత జోరు తగ్గడానికి కూడా అవకాశం ఉంది’ అని నివేదిక పేర్కొంది.
* గత రెండేళ్లలో ప్రభుత్వ విధానాలు, దేశీయంగా పెట్టుబడులు పెరగడం, జీడీపీలో కార్పొరేట్ లాభాల వాటా అధికం కావడం, ఎఫ్డీఐ పెట్టుబడులు, అమెరికా వృద్ధి, చమురు ధరలకు ధీటుగా నిలవడం వంటి మార్కెట్ జోరుకు కారణమయ్యాయి.
* ప్రపంచ వృద్ధి బలహీనంగా ఉండటంతో వర్థమాన దేశాల మార్కెట్లు లబ్ధి పొందే అవకాశం ఉంది. అధిక విలువల కారణంగా 2023 ప్రథమార్థంలో మార్కెట్ జోరుకు విరామం రావొచ్చు.
కొనసాగిన రికార్డుల జోరు
మదుపర్ల కొనుగోళ్ల జోరుతో సూచీలు తాజా జీవనకాల గరిష్ఠాలను అధిరోహించాయి. ముడిచమురు ధరలు తగ్గడం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు పరుగులు తీయడం కలిసొచ్చింది. సెన్సెక్స్ చివరకు 211.16 పాయింట్ల లాభంతో 62,504.80 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 50 పాయింట్లు పెరిగి 18,562.75 దగ్గర స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి 3 పైసలు పెరిగి 81.68 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడి చమురు 3.11 శాతం నష్టపోయి 81.03 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
* బీఎస్ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రికార్డు గరిష్ఠమైన 285.89 లక్షల కోట్లుగా నమోదైంది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 17 లాభాలు నమోదు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.48%, నెస్లే 1.50%, ఏషియన్ పెయింట్స్ 1.44%, బజాజ్ ఫిన్సర్వ్ 1.22%, ఇండస్ఇండ్ బ్యాంక్ 0.83%, విప్రో 0.76%, ఐసీఐసీఐ బ్యాంక్ 0.72% రాణించాయి.
* ధర్మాజ్ క్రాప్ గార్డ్ ఐపీఓ మొదటి రోజున 1.79 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 80,12,990 షేర్లు జారీ చేయగా.. 1,43,79,060 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
* బీఎస్ఈలో లిక్విడిటీ లేని స్టాక్ ఆప్షన్స్ కేసుల్లో చర్యలు ఎదుర్కొంటున్న స్టాక్ బ్రోకర్ల కోసం సెబీ కొత్త సెటిల్మెంట్ పథకాన్ని తీసుకురానుంది. ఈ పథకం డిసెంబరు 19న ప్రారంభమై.. 2023 జనవరి 19న ముగియనుంది.
* థైరాయిడ్ హార్మోన్ లోపం చికిత్సలో వినియోగించే జైడస్ లైఫ్సైన్సెస్ లెవోథైరాక్సిన్ సోడియం ఇంజెక్షన్కు యూఎస్ఎఫ్డీఏ అనుమతి ఇచ్చింది.
* ఆయుర్వేద, హెర్బల్ ఉత్పత్తులను విక్రయించే ఉపకర్మ ఆయుర్వేదలో మెజారిటీ వాటాను బయటకు వెల్లడించని మొత్తానికి మ్యాన్కైండ్ ఫార్మా కొనుగోలు చేసింది.
* రూ.1,000 కోట్ల వరకు సమీకరించే నిమిత్తం స్థిరాస్తి సంస్థ సిగ్నేచర్ గ్లోబల్(ఇండియా) ప్రతిపాదించిన పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కు సెబీ అనుమతులు ఇచ్చింది.
* ప్రాపర్టీ టెక్ అకుంరం హోమ్స్ఫై రియాల్టీ.. పబ్లిక్ ఇష్యూ వచ్చేందు కోసం ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్