ఒక్కో వేరియంట్కు ఒక్కో టీకా: భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల
భవిష్యత్తు సన్నద్ధతలో భాగంగా వివిధ కరోనా వైరస్ రకాల(కొవిడ్ వేరియంట్స్)పై పనిచేసే టీకాలను ఆవిష్కరించడంపై భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ దృష్టి సారించింది.
కొవిడ్పై పోరుకు పరిశోధనలు కొనసాగిస్తూనే ఉంటాం
ఈనాడు, హైదరాబాద్: భవిష్యత్తు సన్నద్ధతలో భాగంగా వివిధ కరోనా వైరస్ రకాల(కొవిడ్ వేరియంట్స్)పై పనిచేసే టీకాలను ఆవిష్కరించడంపై భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ దృష్టి సారించింది. వైరస్ రకాల ఆధారంగా ప్రత్యేకంగా టీకాలు తీసుకొచ్చేందుకు వీలుగా పరిశోధనలు ప్రారంభించినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. ఈ సంస్థ తీసుకొచ్చిన చుక్కల మందు టీకా ‘ఇన్కొవాక్’ను రెండు ప్రాథమిక డోసులుగా, బూస్టర్ డోసుగా వినియోగించేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతిచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ ఎల్ల స్పందిస్తూ.. కొవిడ్ టీకాలకు గిరాకీ తగ్గినప్పటికీ పరిశోధన- అభివృద్ధి (ఆర్ఖీడీ) కార్యకలాపాలను, టీకాల ఆవిష్కరణను నిలుపుదల చేయలేదని తెలిపారు. చుక్కల మందు టీకా ఇందుకు ఓ ఉదాహరణ అని చెప్పారు. కొవిడ్పై పోరాటానికి భవిష్యత్తులోనూ తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని, ఇప్పటి వరకూ తాము అభివృద్ధి చేసిన టీకాల సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మున్ముందు ఒక్కో రకమైన కొవిడ్ వైరస్కు ఒక్కో టీకా తీసుకొస్తామని సోమవారం స్పష్టంచేశారు.
‘ఇన్కొవాక్’ ప్రత్యేకతలు..
*ప్రపంచంలోనే తొలిసారిగా అనుమతి పొందిన చుక్కల మందు కరోనా టీకా ఇదే.
* దీన్ని ప్రాథమిక డోసులుగానూ, బూస్టర్ డోసుగానూ వినియోగించేందుకు అనుమతి లభించింది.
* ప్రాథమిక డోసుగా వేరే టీకా తీసుకున్నప్పటికీ ‘ఇన్కొవాక్’ను బూస్టర్ డోసుగా వినియోగించవచ్చు.
* దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో 3,100 మంది వాలంటీర్లపై ఈ టీకా ప్రయోగాలు నిర్వహించారు. ప్రాథమిక డోసు కింద వేరే టీకా తీసుకున్న 875 మందికి చుక్కల మందు టీకాను బూస్టర్ డోసుగా ఇచ్చి ఫలితాలను విశ్లేషించారు.
*ఈ టీకా ఇవ్వడం, నిల్వ, రవాణా ఎంతో సులువని భారత్ బయోటెక్ పేర్కొంది.
* యూఎస్లోని వాషింగ్టన్ యూనివర్సిటీ- సెయింట్ లూయీస్ భాగస్వామ్యంతో ఈ టీకాను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది.
బయోటెక్ ఆవిష్కరణలకు ప్రోత్సాహం: మనదేశంలో బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేష్ ఎస్.గోఖలే తెలిపారు. ‘ఇన్కొవాక్’ చుక్కల మందు టీకాను వినూత్నమైన ఆవిష్కరణగా పేర్కొన్నారు. దీనివల్ల కొవిడ్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవకాశం లభించిందన్నారు. చుక్కల మందుతో ఎక్కువ మంది ప్రజలకు టీకా అందుబాటులోకి వస్తుందని వాషింగ్టన్ యూనివర్సిటీ- సెయింట్ లూయీస్కు చెందిన డాక్టర్ మైఖేల్ ఎస్. డైమండ్ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!