ఎయిరిండియాలో విస్తారా విలీనం
ఒకప్పుడు తన గూటి నుంచి ఎగిరిపోయి, మళ్లీ ఈ ఏడాది ఆరంభంలో తన ఆధీనంలోకి వచ్చిన విమానయాన సంస్థ ఎయిరిండియాను.. ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా టాటా గ్రూపు తొలి అడుగు వేసింది.
2024 మార్చికి పూర్తయ్యే అవకాశం
విలీన సంస్థలో సింగపూర్ ఎయిర్లైన్స్కు 25.1% వాటా
కార్యకలాపాల విస్తరణకు మరిన్ని పెట్టుబడులు
టాటా గ్రూపు వెల్లడి
ఒకప్పుడు తన గూటి నుంచి ఎగిరిపోయి, మళ్లీ ఈ ఏడాది ఆరంభంలో తన ఆధీనంలోకి వచ్చిన విమానయాన సంస్థ ఎయిరిండియాను.. ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా టాటా గ్రూపు తొలి అడుగు వేసింది. సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి నిర్వహిస్తున్న పూర్తిస్థాయి సేవల సంస్థ విస్తారాను ఎయిరిండియలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది
* * * * * *
దిల్లీ: దేశీయ విమానయాన రంగంలో మరో అతిపెద్ద విలీనానికి రంగం సిద్ధమైంది. ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయనున్నట్లు టాటా గ్రూపు మంగళవారం ప్రకటించింది. విస్తారా.. టాటా గ్రూపు (51%), సింగపూర్ ఎయిర్లైన్స్ (సియా) (49%)ల సంయుక్త సంస్థ. విలీనానంతర ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్కు 25.1 శాతం వాటా ఉండనుంది. నియంత్రణ పరమైన అనుమతులు లభిస్తే.. 2024 మార్చి కల్లా విలీన ప్రక్రియ పూర్తి కావచ్చన్నది అంచనా. ‘విస్తారా, ఎయిరిండియా విలీనం అవుతాయి. ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నాం. విలీనానంతర సంస్థలో మా వాటా 25.1 శాతంగా ఉంటుంద’ని సియా తెలిపింది. 2022-23, 2023-24లలో ఎయిరిండియా కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు ఒకవేళ మరిన్ని నిధులు అవసరమైతే.. సమకూర్చేందుకు సియా, టాటాసన్స్ అంగీకరించాయి. అంటే విలీన సంస్థలో సియాకు 25.1 శాతం ఉంటుంది కనుక, ఆ వాటా మేరకు అదనంగా సమకూర్చాల్సిన మొత్తం రూ.5,020 కోట్లుగా ఉండొచ్చని అంచనా. విలీనానంతరం ఈ మొత్తం చెల్లిస్తామని సియా తెలిపింది.
‘‘విలీనానంతరం 218 విమానాలతో అంతర్జాతీయ సర్వీసుల్లో దేశీయ అగ్రగామి విమానయాన సంస్థగా, దేశీయ సర్వీసులపరంగా రెండో దిగ్గజ సంస్థగా ఎయిరిండియా అవతరిస్తుంది’’
టాటా గ్రూపు
‘‘ఎయిరిండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దే ప్రయాణంలో విస్తారా, ఎయిరిండియా విలీనం ఓ కీలక మైలురాయి.’’
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్
‘విస్తారా గత ఎనిమిదేళ్లలో అనుకున్నదాని కంటే ఎక్కువగా విజయవంతం అయ్యింది. అందువల్ల ఎయిరిండియాకు పునర్వైభవాన్ని తీసుకొచ్చే మా ప్రయత్నానికి విస్తారా విలీనం మరింత ఉత్తేజాన్ని నింపుతుంది. అంతర్జాతీయ విమానయాన సంస్థగా వేగంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది’
క్యాంప్బెల్ విల్సన్, సీఈఓ, ఎయిరిండియా
‘విలీనం పూర్తయ్యేందుకు సమయం పడుతుంది. ఈ పరిణామ క్రమంలో మా వ్యాపార కార్యకలాపాలు యథాతథంగానే కొనసాగుతాయి’
వినోద్ కన్నన్, సీఈఓ, విస్తారా
* * * * * *
టాటా గ్రూపులో ప్రస్తుతం 4 విమానయాన సంస్థలు
1) ఎయిరిండియా
2) ఎయిరిండియా ఎక్స్ప్రెస్
3) ఎయిరేషియా ఇండియా
4) విస్తారా
* ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లను ఈ ఏడాది జనవరిలో కొనుగోలు చేసింది.
* 2015లో విస్తారా (సింగపూర్ ఎయిర్లైన్స్ భాగస్వామ్యంతో) కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
* 2014 నుంచి ఎయిరేషియా ఇండియా నడుస్తోంది. (ఎయిరేషియా భాగస్వామ్యంతో ప్రారంభమైనా ఇప్పుడు 100 శాతం వాటా టాటాలకే ఉంది.)
మార్కెట్ వాటాలో రెండో స్థానం
అక్టోబరులో ప్రయాణికులను చేరవేయడంలో, దేశీయంగా ఇండిగో 56.7% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంటే, విస్తారా (9.2%) రెండో స్థానంలో ఉంది. ఎయిరిండియా, ఎయిరేషియా ఇండియా మార్కెట్ వాటాలు 9.1%, 7.6 శాతంగా ఉన్నాయి. విస్తారా విలీన ఫలితంగా ఎయిరిండియా మార్కెట్ వాటా 18.3 శాతానికి చేరుతుంది.
కొనేళ్ల కల.. విస్తారా
భారత్లో సంయుక్త విమానయాన సంస్థను నెలకొల్పేందుకు టాటా గ్రూపు, సింగపూర్ ఎయిర్లైన్స్ సంస్థలు 1994లో ప్రయత్నించాయి. మళ్లీ 2000 సంవత్సరంలో ఎయిరిండియాలో వాటాల కొనుగోలుకు చూసినా, సఫలం కాలేదు. విమానయాన రంగంలో విదేశీ సంస్థల పెట్టుబడులపై ఆంక్షలను భారత ప్రభుత్వం 2012లో ఎత్తివేయడంతో.. టాటా, సియా మళ్లీ జట్టుకట్టి, 2013లో అనుమతులు పొందాయి. 2013లో ఇరు సంస్థలు ‘టాటా సియా ఎయిర్లైన్స్ లిమిటెడ్’ అనే సంయుక్త సంస్థను ఏర్పాటు చేశాయి. ఈ సంస్థ ద్వారానే 2015లో ‘విస్తారా’ విమానాలు కార్యకలాపాలు ప్రారంభించాయి. ‘అపరిమిత విస్తరణ’ అని అర్థ్ధం వచ్చే ‘విస్తార్’ అనే సంస్కృతి పదం ఆధారంగా.. ‘విస్తారా’ పేరు పెట్టాయి.
* ప్రస్తుతం విస్తారా 43 దేశీయ, విదేశీ గమ్యస్థానాలకు రోజూ 260కి పైగా విమాన సర్వీసులు నడుపుతోంది. విస్తారా వద్ద 54 విమానాలు, 4,500 మందికి పైగా సిబ్బంది ఉన్నారు.
దేశీయ విపణిపై 2 సంస్థల ఆధిపత్యం
ఎయిరిండియా, విస్తారాల విలీనం అనంతరం.. దేశీయ విమానయాన విపణిలో ద్వంద్వ (రెండు సంస్థల చేతిలో) ఆధిపత్య ధోరణి నెలకొంటుందని విమానయాన కన్సల్టెన్సీ, పరిశోధనా సంస్థ కాపా ఇండియా తెలిపింది. ఎయిరిండియా, ఇండిగోల మధకచ తీవ్ర పోటీ నెలకొంటుందని.. ఈ రెండు సంస్థల మొత్తం మార్కెట్ వాటా 75- 80 శాతానికి చేరుతుందని వెల్లడించింది. ఈ విలీనం విమానయాన రంగాన్ని బలోపేతం చేస్తుందని.. పూర్తి వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని వెల్లడించింది.
విలీనానంతరం..
* అక్టోబరు విమాన ప్రయాణికుల్లో వాటా పరంగా చూస్తే విస్తారా (9.2%), ఎయిరిండియా (9.1%)కు.. ఎయిరేషియా ఇండియా (7.3%) మార్కెట్ వాటా కలిపితే మొత్తం టాటా గ్రూప్ మార్కెట్ వాటా 25.9 శాతానికి చేరుతుంది. ఇండిగో 57.3% తో మొదటిస్థానంలోనే ఉంటుంది.
* ఎయిరిండియాకు 165 విమానాలు, విస్తారాకు 53 విమానాలు ఉన్నాయి. విలీనానంతరం ఈ సంఖ్య 218కు చేరుతుంది.
* సెప్టెంబరు చివరినాటికి అంతర్జాతీయ సర్వీసుల్లో ఎయిరిండియా, విస్తారాల మార్కెట్ వాటా 24 శాతంగా ఉంది. రాబోయే ఐదేళ్లలో ఈ వాటాను 30 శాతానికి పెంచుకోవాలన్నది ఎయిరిండియా లక్ష్యం.
* విలీనానంతర సంస్థకు సంబంధించి బ్రాండింగ్, యూనిఫార్మ్, సర్వీసుల వివరాలను టాటా గ్రూపు వెల్లడించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
March 31 Deadline: ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, ఆదాయ పన్ను విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. -
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
Afcons Infra IPO: ఐదేళ్ల తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ వస్తోంది. నిర్మాణ రంగ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి.
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM