1 నుంచి రిటైల్ డిజిటల్ రూపాయి
రిటైల్ డిజిటల్ రూపాయి(ఇRs-ఆర్) ప్రయోగాత్మక ప్రాజెక్టును డిసెంబరు 1 నుంచి ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం ప్రకటించింది.
ఆర్బీఐ ప్రయోగాత్మక ప్రాజెక్టు
నాలుగు బ్యాంకులకు అనుమతులు
తొలుత దిల్లీ, ముంబయి, బెంగళూరు, భువనేశ్వర్లలో
తదుపరి హైదరాబాద్ సహా 9 నగరాలకు
ముంబయి: రిటైల్ డిజిటల్ రూపాయి(ఇRs-ఆర్) ప్రయోగాత్మక ప్రాజెక్టును డిసెంబరు 1 నుంచి ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం ప్రకటించింది. తొలుత 4 నగరాల్లో ప్రారంభించి, తదుపరి మరో 9 నగరాల్లో ఈ సేవలను విస్తరిస్తారు. ప్రస్తుతానికి స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లు ఈ లావాదేవీల్లో పాల్గొంటాయి. డిజిటల్ రూపాయిని టోకు విభాగంలో నవంబరు 1న ఆర్బీఐ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) లేదా డిజిటల్ రూపాయి అనేది డిజిటల్ రూపంలో ఆర్బీఐ జారీ చేసే అధీకృ కరెన్సీ. వీటిని బ్యాంకుల ద్వారా పంపిణీ చేస్తారు. ‘ఇRs-ఆర్ అనేది డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుంది. చట్టబద్ధంగా ఇది చెల్లుతుంది. ప్రస్తుతం జారీ అవుతున్న పేపరు కరెన్సీ, నాణేల విలువల (డినామినేషన్స్)లోనే ఇది కూడా జారీ అవుతుంద’ని ఆర్బీఐ పేర్కొంది.
* టోకు డిజిటల్ రూపాయి తరహాలోనే రిటైల్ డిజిటల్ రూపాయిని కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో, ఎంపిక చేసిన వినియోగదార్లు, వ్యాపారులతో కూడిన బృందాల (సీయూజీ)కు మాత్రమే అందుబాటులోకి తెస్తారు.
* బ్యాంకుల ద్వారా జారీ అయ్యే డిజిటల్ రూపాయి(రిటైల్)ని.. బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్ రూపంలో మొబైల్ ఫోన్లు/ఇతర పరికరాల్లో దాచుకోవచ్చు.
* వీటి సాయంతో వ్యక్తి నుంచి వ్యక్తి(పీ2పీ)కి; వ్యక్తి నుంచి వ్యాపారులకు(పీ2ఎమ్) లావాదేవీలు జరపొచ్చు. మర్చంట్ల వద్ద ఉండే క్యూఆర్ కోడ్లను ఉపయోగించి వారికి చెల్లింపులు చేయవచ్చు.
* భౌతిక నగదు తరహాలోనే ఇRs-ఆర్ సైతం భద్రత, సెటిల్మెంట్ను అందిస్తుంది. ఈ రూపంలో నగదు మన వాలెట్లలో ఉంటే వడ్డీ లభించదు. కేవలం బ్యాంకుల వద్ద డిపాజిట్ల రూపంలో ఉంచితేనే వడ్డీ లభిస్తుంది.
* ప్రాథమికంగా ముంబయి, దిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్.. నగరాల్లో ఈ ప్రయోగాత్మక లావాదేవీలు అమలవుతాయి. తదుపరి హైదరాబాద్, అహ్మదాబాద్, సిమ్లా, ఇండోర్, కోచి, గాంగ్టక్, లఖ్నవూ, గువహటి వంటి 9 నగరాలకు విస్తరిస్తారు.
* క్రమంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్లకు; ఇతర వినియోగదార్లు, ప్రాంతాలకు కూడా డిజిటల్ రూపీ సేవలను విస్తరిస్తారు.
* ఇRs-ఆర్ టోకెన్కు సంబంధించిన వివిధ ఫీచర్లు, ఉపయోగాలను భవిష్యత్తు ప్రయోగాత్మక ప్రాజెక్టుల్లో పరీక్షిస్తారు.
* ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా కేంద్ర బ్యాంకులు సీబీడీసీలపై ఆసక్తి వ్యక్తం చేశాయి. కొన్ని ఇప్పటికే రిటైల్, టోకు విభాగాల్లో ప్రయోగాత్మకంగా మొదలుపెడితే.. చాలా వరకు పరిశోధన, పరీక్షలు, సొంత సీబీడీసీ వ్యవస్థలపై పనిచేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా