SBI: డిజిటల్ లావాదేవీలకు ఇ-మెయిల్ ఓటీపీ: ఎస్బీఐ
సైబర్ నేరాలను నియంత్రించేందుకు బ్యాంకులు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఇ-మెయిల్ ఓటీపీని ప్రవేశ పెట్టింది.
ఈనాడు, హైదరాబాద్: సైబర్ నేరాలను నియంత్రించేందుకు బ్యాంకులు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఇ-మెయిల్ ఓటీపీని ప్రవేశ పెట్టింది. ఖాతాదారులు డిజిటల్ లావాదేవీలు చేసినప్పుడు అధీకృత ఇ-మెయిల్కు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేస్తేనే లావాదేవీ పూర్తవుతుంది. ‘మీ డిజిటల్ లావాదేవీలను మరింత సురక్షితంగా నిర్వహించండి. దీనికోసం ఇ-మెయిల్ ఓటీపీ నోటిఫికేషన్ అందుకునేందుకు, వెంటనే సదుపాయాన్ని యాక్టివేట్ చేసుకోండి’ అని ఎస్బీఐ ట్విటర్లో వెల్లడించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించే ఖాతాదారులందరూ ప్రొఫైల్ విభాగంలో, హైసెక్యూరిటీ అవకాశాల నుంచి ఈ సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఓటీపీలు, పాస్వర్డ్లు చెప్పాల్సిందిగా బ్యాంకు నుంచి ఎలాంటి ఫోన్లూ రావని, వినియోగదారులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
పీఎన్బీ: ఏటీఎంలో నుంచి నగదు తీసుకోవాలనుకున్న ప్రతిసారీ ఖాతాకు అనుసంధానంగా ఉన్న మొబైల్ నెంబరుకు వచ్చే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ)ని నమోదు చేయాల్సి ఉంటుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తెలిపింది. ఖాతాదారులు తమ డెబిట్ కార్డుతో నగదు తీసుకోవాలంటే.. పిన్తో పాటు, ఓటీపీ కూడా నమోదు చేయాల్సిందే. డిసెంబరు 1 నుంచే ఇది అమల్లోకి రానుంది. ఇప్పటికే ఎస్బీఐ కూడా తమ ఖాతాదార్లు ఏటీఎం నుంచి రూ.10వేలకు మించి నగదు తీయాలనుకుంటే ఓటీపీ నమోదును తప్పనిసరి చేసింది.
డిజిటల్ రుణాలకు కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి :ఆర్బీఐ
ఆన్లైన్లో రుణాలు తీసుకునే ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలు డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. వడ్డీ రేట్లను నిర్ణయించడం మొదలు, రుణాల వసూలు విషయంలో రికవరీ ఏజెంట్లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడకుండా చూసే అంశాలు ఇందులో ఉన్నాయి. రుణ మొత్తాన్ని జమ చేసినప్పుడు, వాటిని తిరిగి చెల్లించేటప్పుడు ఖాతాదారుడి ఖాతా, నియంత్రణ పరిధిలోని సంస్థల (బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ) మధ్యే నేరుగా లావాదేవీలు జరగాలి. రుణ సేవలను అందించే సంస్థల (ఎల్ఎస్పీ) పూల్ ఖాతా నుంచి నిర్వహించకూడదని పేర్కొంది. ఎల్ఎస్పీలకు బ్యాంకులు/ఎన్బీఎఫ్సీలే రుసుములు చెల్లించాలని, రుణగ్రహీతకు వీటితో సంబంధం లేదని తెలిపింది. ఈ మేరకు ఆగస్టులో ఇచ్చిన మార్గదర్శకాలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. -
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
అంబానీ, అదానీ తొలిసారి చేతులు కలిపారు. ఓ పవర్ ప్రాజెక్ట్ విషయంలో వీరి మధ్య భాగస్వామ్యం కుదిరింది. -
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది. -
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. సోషల్మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రీమియం, ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!