8 రోజుల్లో రూ.9 లక్షల కోట్ల లాభం
వరుసగా ఎనిమిదో రోజూ సూచీల రికార్డుల పరుగు కొనసాగింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో పాటు విదేశీ మదుపర్ల కొనుగోళ్లు తోడవ్వడంతో నిఫ్టీ 18,800 పాయింట్ల ఎగువన ముగిసింది.
18,800 ఎగువకు నిఫ్టీ
సమీక్ష
వరుసగా ఎనిమిదో రోజూ సూచీల రికార్డుల పరుగు కొనసాగింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో పాటు విదేశీ మదుపర్ల కొనుగోళ్లు తోడవ్వడంతో నిఫ్టీ 18,800 పాయింట్ల ఎగువన ముగిసింది. నవంబరులో తయారీ పీఎంఐ 55.7 పాయింట్లకు చేరడం, ఐటీ షేర్లు రాణించడమూ కలిసొచ్చింది. డాలర్తో పోలిస్తే రూపాయి 4 పైసలు బలపడి 81.26 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.40 శాతం పెరిగి 87.32 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభపడగా, ఐరోపా సూచీలు పరుగులు తీశాయి.
* మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ జీవనకాల గరిష్ఠమైన రూ.289.88 లక్షల కోట్లకు చేరింది. గత 8 ట్రేడింగ్ రోజుల్లో సెన్సెక్స్ 2139.35 పాయింట్లు దూసుకెళ్లగా, మదుపర్ల సంపద రూ.8.96 లక్షల కోట్లు పెరిగింది.
* సెన్సెక్స్ ఉదయం 63,357.99 పాయింట్ల వద్ద దూకుడుగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 63,583.07 పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకిన సూచీ.. అనంతరం లాభాల స్వీకరణ ఎదుర్కొంది. చివరకు 184.54 పాయింట్ల లాభంతో 63,284.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 18,887.60 వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసి, చివరకు 54.15 పాయింట్లు పెరిగి 18,812.50 దగ్గర స్థిరపడింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 16 మెరిశాయి. అల్ట్రాటెక్ 2.86%, టాటా స్టీల్ 2.79%, టీసీఎస్ 2.44%, టెక్ మహీంద్రా 2.27%, విప్రో 1.63%, ఇన్ఫోసిస్ 1.54%, హెచ్సీఎల్ టెక్ 1.37%, ఎల్ అండ్ టీ 1.27%, ఎస్బీఐ 0.92% రాణించాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 1.41%, ఎం అండ్ ఎం 1.06%, పవర్గ్రిడ్ 0.94%, హెచ్యూఎల్ 0.65% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. ఐటీ 2.03%, స్థిరాస్తి 1.94%, టెక్ 1.58%, కమొడిటీస్ 1.24%, పరిశ్రమలు 0.74% పెరిగాయి. విద్యుత్, చమురు-గ్యాస్, ఇంధన, ఎఫ్ఎమ్సీజీ పడ్డాయి. బీఎస్ఈలో 2033 షేర్లు లాభాల్లో ముగియగా, 1463 స్క్రిప్లు నష్టపోయాయి. 140 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
* యాక్సిస్-సిటీ లావాదేవీ మరింత ఆలస్యం: సిటీ ఇండియా వినియోగదారు కార్యకలాపాల వ్యాపారం కొనుగోలు లావాదేవీ మరింత ఆలస్యం కావొచ్చని, 2023 మే నెలకు పూర్తి కావొచ్చని యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ అమితాబ్ ఛౌద్రీ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 30న సిటీ బ్యాంక్ వినియోగదారు కార్యకలాపాలను రూ.12,300 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది.
* గుజరాత్ హజీరాలోని ఆర్సెలార్మిత్తల్ నిప్పన్ స్టీల్ (ఏఎంఎన్ఎస్) విస్తరణ ప్రాజెక్ట్కు 1800 టన్నుల స్ట్రక్చరల్ ఉక్కును ఆర్ఐఎన్ఎల్ (విశాఖ ఉక్కు) సరఫరా చేసింది.
* యెస్ బ్యాంక్లో 9.99 శాతం వాటా కొనుగోలుకు ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజ సంస్థలు కార్లైల్ గ్రూప్, అడ్వెంట్లకు ఆర్బీఐ అనుమతి లభించింది. ఈ ఏడాది జులైలో యెస్ బ్యాంక్లో రూ.8000 కోట్లకు పైగా పెట్టుబడులను ఈ సంస్థలు ప్రకటించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మస్క్(Elon Musk) భారత్ పర్యటన మరింత ఆలస్యం కానుంది. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్