మెర్సిడెస్‌-బెంజ్‌ నుంచి 7 సీట్ల ఎస్‌యూవీలు

విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ మన దేశంలో 7 సీట్ల స్పోర్ట్స్‌ వినియోగ వాహనాలైన (ఎస్‌యూవీలు) జీఎల్‌బీ, ఈక్యూబీ మోడళ్లను విడుదల చేసింది.  

Updated : 03 Dec 2022 01:35 IST

ధరల శ్రేణి రూ.63.8-74.5 లక్షలు

దిల్లీ: విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ మన దేశంలో 7 సీట్ల స్పోర్ట్స్‌ వినియోగ వాహనాలైన (ఎస్‌యూవీలు) జీఎల్‌బీ, ఈక్యూబీ మోడళ్లను విడుదల చేసింది.  వీటి ధరల శ్రేణి  రూ.63.8-74.5 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). జీఎల్‌బీ శ్రేణిలోని 3 వేరియంట్ల ధరలు వరుసగా రూ.63.8 లక్షలు, రూ.66.8 లక్షలు, రూ.69.8 లక్షలు. పూర్తిస్థాయి విద్యుత్‌ ఈక్యూబీ 300 4మేటిక్‌ ధర రూ.74.5 లక్షలు. ‘ఈ ఎస్‌యూవీలు పెద్ద కుటుంబాలకు అవసరమైన అధిక స్థలాన్ని అందిస్తాయి. సీట్లు సౌకర్యంగా ఉండటంతో పాటు చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు రెండు సీట్లు అదనంగా ఉంటాయ’ని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈఓ మార్టిన్‌ ష్వెంక్‌ వెల్లడించారు. తొలిసారిగా కంపెనీ మూడు పవర్‌ట్రెయిన్‌లలో (పెట్రోల్‌, డీజిల్‌, విద్యుత్‌) వాహనాలను అందిస్తోందని తెలిపారు. దేశ వ్యాప్తంగా 30 అల్ట్రా-ఫాస్ట్‌ (అత్యంత వేగవంతమైన) ఛార్జర్లను ఏర్పాటు చేశామని, ఈ ఏడాది ఆఖరుకు మరో 10 ఛార్జర్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు