సంక్షిప్త వార్తలు (7)
మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను జనవరి నుంచి పెంచాలనుకుంటున్నట్లు ఎక్స్ఛేంజీలకు శుక్రవారం పేర్కొంది.
మారుతీ కార్ల ధరల పెంపు
దిల్లీ: మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను జనవరి నుంచి పెంచాలనుకుంటున్నట్లు ఎక్స్ఛేంజీలకు శుక్రవారం పేర్కొంది. ముడి పదార్థాల వ్యయాలు పెరిగినందున ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు, ఏప్రిల్ 2023 నుంచి కఠిన ఉద్గార బీఎస్-6 ప్రమాణాలను చేరుకునేందుకు ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీ తెలిపింది. అన్ని మోడళ్లపై ధరలు పెరుగుతాయని ప్రకటించినా, పెంపు ఏ మేరకు ఉంటుందనేది వెల్లడించలేదు.
* నవంబరు నెలలో వాహనాల ఉత్పత్తి 5 శాతం మేర పెరిగి 1,52,786కు చేరినట్లు మారుతీ తెలిపింది. ఏడాది క్రితం ఇదే నెలలో వాహనాల ఉత్పత్తి 1,45,560గా నమోదైందని పేర్కొంది.
మహీంద్రా.. 19,000 వాహనాలు వెనక్కి
దిల్లీ: ఎక్స్యూవీ700, స్కార్పియో-ఎన్ వాహనాల్లో బెల్ హౌసింగ్లోని రబ్బర్ విడిభాగాన్ని సవరించేందుకు సుమారు 19,000 వాహనాలను వెనక్కి రప్పిస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. ఈ ఏడాది జులై 1 నుంచి నవంబరు 11 మధ్య అసెంబుల్ చేసిన 12,566 ఎక్స్యూవీ700, 6,618 స్కార్పియో-ఎన్ వాహనాల్లో లోపాన్ని సరిదిద్దాల్సి ఉందని పేర్కొంది. సంబంధిత వినియోగదార్లకు వ్యక్తిగతంగా సమాచారం ఇస్తామని కంపెనీ తెలిపింది.
రూ.300 కోట్లతో ఉత్పత్తి సామర్థ్య పెంపులో టీజీవీ శ్రాక్
ఈనాడు, హైదరాబాద్: పలు రకాలైన ప్రత్యేక రసాయనాలను ఉత్పత్తి చేసే సంస్థ టీజీవీ శ్రాక్ లిమిటెడ్ (గతంలో శ్రీ రాయలసీమ అల్కలీస్ అండ్ అలైడ్ కెమికల్స్ లిమిటెడ్) రూ.300 కోట్ల పెట్టుబడితో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించిన విస్తరణ ప్రణాళిక ప్రకారం కాస్టిక్ సోడా ఉత్పత్తి సామర్థ్యం 270 టన్నుల మేరకు పెరుగుతుంది. అదేవిధంగా క్లోరోమీథేన్ ఉత్పత్తుల సామర్థ్యాన్ని మరో 100 టన్నుల వరకూ పెంచుతారు. ఈ విస్తరణకు అవసరమైన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకోవాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది.
ఎస్బీఐ రూ.10,000 కోట్ల సమీకరణ
ముంబయి: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన మొట్టమొదటి మౌలిక బాండ్ల జారీ ద్వారా శుక్రవారం రూ.10,000 కోట్లు సమీకరించింది. దేశీయ బ్యాంక్ చేపట్టిన అతిపెద్ద మౌలిక బాండ్ల విక్రయం ఇదే కావడం విశేషం. మౌలిక రంగ, అందుబాటు గృహ విభాగంలో రుణాలకు ఈ నిధులు వినియోగించనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ మౌలిక బాండ్ల ఇష్యూకు 3.27 రెట్ల స్పందన వచ్చిందని, దాదాపు రూ.16,366 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయని, పెట్టుబడిదార్ల విశ్వాసాన్ని ఇది సూచిస్తోందని ఎస్బీఐ వెల్లడించింది. 10 ఏళ్ల గడువు ఉండే ఈ బాండ్లకు 7.51 శాతం వార్షిక వడ్డీని ఎస్బీఐ చెల్లించనుంది. దేశానికి, ఎస్బీఐకు మౌలిక రంగ అభివృద్ధి చాలా కీలకమైన అంశమని, తాజా బాండ్ల విక్రయం ఇందుకు దోహదపడుతుందని ఎస్బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖరా పేర్కొన్నారు.
రేట్ల పెంపు తగ్గించాలి
ఆర్బీఐని కోరిన అసోచామ్
దిల్లీ: ఈ ఏడాది మే నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 190 బేసిస్ పాయింట్ల మేర కీలక వడ్డీ రేటును పెంచింది. ఇకపై రేట్ల పెంపును తగ్గించాలని పరిశ్రమ సమాఖ్య ఆర్బీఐని కోరింది. లేదంటే ఆర్థిక వ్యవస్థ రికవరీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) 3 రోజుల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమై నిర్ణయాలు బుధవారం(7న) వెలువడనున్నాయి. కొత్త రేటు పెంపు గరిష్ఠంగా 25-35 బేసిస్ పాయింట్ల మేర ఉండేలా చూడాలని ఆర్బీఐ గవర్నర్కు అసోచామ్ లేఖ రాసింది. పరిశ్రమ ముందున్న పలు సవాళ్లను కూడా అందులో ప్రస్తావించినట్లు సమాచారం.
* విద్యుత్ వాహనాల కొనుగోలుకు తీసుకునే రిటైల్ రుణాలను ప్రాధాన్య రంగ రుణాలుగా గుర్తించి తక్కువ వడ్డీ రేటుకే వాటిని అందించేలా చూడాలని అసోచామ్ సూచించింది. సెప్టెంబరు 30న చివరిసారిగా ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ కీలక రేట్లను పెంచుతున్నా.. లక్ష్యిత 2-6 శాతం శ్రేణికి ఎగువనే ఇంకా నమోదవుతుండటం గమనార్హం.
గూగుల్ పే, ఫోన్ పేలకు ఊరట
30% పరిమితి నిబంధన గడువు పెంపు
దిల్లీ: డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో 30 శాతం పరిమాణ పరిమితిని (వాల్యూమ్ క్యాప్) పాటించేందుకు డిసెంబరు 31, 2024 వరకు అంటే రెండేళ్లపాటు గడువును పొడిగిస్తున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) శుక్రవారం వెల్లడించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలలో భారీ వాటా(30 శాతానికి మించి)ను కలిగి ఉన్న గూగుల్ పే, ఫోన్ పే వంటి థర్డ్పార్టీ యూపీఐ యాప్లకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించవచ్చు. మొత్తం యూపీఐ లావాదేవీల పరిమాణంలో 30 శాతానికి మించి ఒక థర్డ్ పార్టీ యాప్ కలిగి ఉండరాదని 2020 నవంబరులో ఎన్పీసీఐ పరిమితి విధించిన సంగతి విదితమే. 2021 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రావాల్సి ఉండగా, రెండేళ్లపాటు పొడిగించారు. తాజాగా మళ్లీ రెండేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ఎన్పీసీఐ తన తాజా సర్క్యులర్లో పేర్కొంది.
సీసీఎల్ ప్రోడక్ట్స్ బోర్డులో అమూల్ మాజీ ఎండీ
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీసీఎల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్లో అమూల్ మాజీ ఎండీ భరత్కుమార్ మహేంద్రభాయ్ వ్యాస్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని సీసీఎల్ ప్రోడక్ట్స్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. సీసీఎల్ ప్రోడక్ట్స్ ఇన్స్టంట్ కాఫీ ఉత్పత్తి, ఎగుమతి కార్యకలాపాల్లో నిమగ్నమైన విషయం తెలిసిందే. భరత్ కుమార్ దాదాపు 39 ఏళ్ల పాటు అమూల్లో పనిచేశారు. ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు)లో డైరెక్టర్గానూ వ్యవహరించారు. ఆయనకు ఉన్న విశేష అనుభవం, నాయకత్వ లక్షణాల దృష్ట్యా తమ బోర్డులోకి డైరెక్టర్గా తీసుకున్నట్లు సీసీఎల్ ప్రోడక్ట్స్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్.. తన కంపెనీలో పని చేస్తున్న సగానికి పైగా ఉద్యోగులకు ఏఐలో శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించింది. -
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
March 31 Deadline: ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, ఆదాయ పన్ను విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. -
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
Afcons Infra IPO: ఐదేళ్ల తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ వస్తోంది. నిర్మాణ రంగ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ