నిఫ్టీ-500 సంస్థల్లో 18% నారీశక్తి: ఐఐఏఎస్
కంపెనీల బోర్డుల్లో లింగ వైవిధ్యం నెమ్మదిగా పెరుగుతోందని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (ఐఐఏఎస్) నివేదిక వెల్లడించింది.
దిల్లీ: కంపెనీల బోర్డుల్లో లింగ వైవిధ్యం నెమ్మదిగా పెరుగుతోందని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (ఐఐఏఎస్) నివేదిక వెల్లడించింది. ఎన్ఎస్ఈలో నమోదైన అగ్రశ్రేణి 500 కంపెనీల బోర్డుల్లో ఈ ఏడాది మార్చి నాటికి మహిళా డైరెక్టర్ల సంఖ్య 18 శాతానికి చేరినట్లు వెల్లడించింది. ‘కార్పొరేట్ ఇండియా: వుమెన్ ఆన్ బోర్డ్స్’ పేరుతో ఐఐఏఎస్ చేసిన అధ్యయనంలోని అంశాలు ఇలా..
* అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్ బోర్డు రూముల్లో మహిళా ప్రాతినిధ్యం సరాసరిన 24 శాతానికి చేరింది. భారత్లోనూ కంపెనీ బోర్డుల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోంది.
* భారత్లో 2014లో చూస్తే బోర్డుల్లో మహిళా డైరెక్టర్లు 6 శాతమే. 2019కి 14 శాతానికి చేరింది. ప్రస్తుతం నిఫ్టీ-500 కంపెనీల్లో మహిళా డైరెక్టర్ల వాటా 17.6 శాతానికి చేరింది.
* మహిళా డైరెక్టర్లు పెరుగుతున్నా, కొత్త నియామకాలు గత మూడేళ్ల నుంచి 1 శాతమే వృద్ధి చెందాయి. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే భారత్లో లింగ వైవిధ్యం 30 శాతం లక్ష్యానికి చేరడానికి 2058 వరకు వేచి చూడాల్సి ఉంటుంది.
* ఈ ఏడాది మార్చి ఆఖరుకు నిఫ్టీ-500 కంపెనీల్లో 4,694 మంది డైరెక్టర్లు ఉండగా, అందులో 827 మంది (17.6 శాతం) మహిళలు ఉన్నారు.
* అంతర్జాతీయ సరాసరి కంటే మెరుగ్గా ఐరోపా, ఉత్తర అమెరికాల్లో 34.4 శాతం, 28.6 శాతం చొప్పున మహిళా డైరెక్టర్లున్నారు. దేశం వారీగా చూస్తే ఫ్రాన్స్ 2021లో ఏకంగా 44.5 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది.
* 2022 మార్చి 31 నాటికి నిఫ్టీ-500 కంపెనీల బోర్డుల్లో ఇద్దరు లేదా ముగ్గురు మహిళా డైరెక్టర్లు ఉన్న కంపెనీలు 48.6 శాతం ఉన్నాయి. 2021 మార్చి 31 నాటికి 45 శాతంగానే ఉన్నాయి. 2020 మార్చి 31 నాటికి 44 శాతంగా ఉన్నాయి.
* 159 కంపెనీల బోర్డుల్లో ఏకంగా 20 శాతం పైనే మహిళా డైరెక్టర్ల వాటా ఉంది. 2021లో ఈ సంఖ్య 146గా ఉంది.
* బోర్డుల్లో మహిళల సగటు వయసు 58.7 సంవత్సరాలుగా ఉంది. 2020లో సగటు వయసు 56 ఏళ్లు. పురుషుల సగటు వయసు 62.3 ఏళ్లు (2020లో వీరి సగటు వయసు 61 ఏళ్లు).
* బోర్డుల్లో మహిళలే ఛైర్పర్సన్లుగా ఉన్న నిఫ్టీ-500 కంపెనీలు 22. సీఈఓలుగా 25 మంది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల హోదాలో 62 మంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?