దూసుకెళ్లనున్న వ్యాపార ప్రకటనల పరిశ్రమ
భారత్లో వ్యాపార ప్రకటనల పరిశ్రమ ఆదాయ వృద్ధి ఈ ఏడాది 16.8 శాతం మేర నమోదు కావొచ్చని గ్రూప్ ఎమ్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది.
2023లో ఆదాయాల్లో 16.8% వృద్ధి
గ్రూప్ ఎమ్ అంచనా
ముంబయి: భారత్లో వ్యాపార ప్రకటనల పరిశ్రమ ఆదాయ వృద్ధి ఈ ఏడాది 16.8 శాతం మేర నమోదు కావొచ్చని గ్రూప్ ఎమ్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో వ్యాపార ప్రకటనల పరిశ్రమ బలంగా కనిపిస్తోందని.. 2022లో ఇది 15.8% వృద్ధితో 14.9 బిలియన్ డాలర్లకు చేరొచ్చని ఆ సంస్థ అంచనా వేసింది. ఇక వచ్చే ఏడాదిలో డిజిటల్ వ్యాపార ప్రకటనలకు 48.4 శాతం మేర వాటా దక్కవచ్చని పేర్కొంది. ఇంకా ఆ నివేదిక ఏమంటోందంటే..
* 2022లో రిటైల్ మీడియా పరిమాణం 551 మి. డాలర్లుగా నమోదు కావొచ్చు. 2027 కల్లా రెట్టింపునకు చేరొచ్చు.
* మొత్తం వ్యాపార ప్రకటనల్లో 36% వాటా ఉన్న టీవీ వ్యాపార ప్రకటనలు ఈ ఏడాది 10.8 శాతం వృద్ధి చెందొచ్చు. సంప్రదాయ, కనెక్టెడ్ టీవీల్లో బలమైన వృద్ధిని ఇది సాధించవచ్చు.
* చైనాలో కరోనా ఆంక్షల నేపథ్యంలో వ్యాపార ప్రకటనల ఆదాయాలు 2022లో 137.8 బిలియన్ డాలర్లకు చేరొచ్చు. గతేడాదితో పోలిస్తే ఇది 0.6% తక్కువ. 2023లో మాత్రం 6.3% మేర రాణించొచ్చు.
* అంతర్జాతీయంగా చూస్తే వ్యాపార ప్రకటనల వృద్ధి వచ్చే ఏడాది 5.9 శాతానికి పరిమితం కావొచ్చు. ఈ ఏడాది 6.5 శాతం వృద్ధి చెందొచ్చని అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.