దాతృత్వ హీరోలు అదానీ, నాడార్, అశోక్
ఆసియాలో దాతృత్వంలో ముందున్న వారిలో భారత కుబేరుడు గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నారు. ఈయనతో పాటు శివ్ నాడార్, అశోక్ సూతా, మలేషియన్-ఇండియన్ వ్యాపారవేత్త బ్రహ్మల్ వాసుదేవన్, ఆయన భార్య శాంతి కండియాలు సైతం ‘ఫోర్బ్స్ ఆసియాస్ హీరోస్ ఆఫ్ ఫిలాంత్రపీ’లో చోటు దక్కించుకున్నారు.
సింగపూర్: ఆసియాలో దాతృత్వంలో ముందున్న వారిలో భారత కుబేరుడు గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నారు. ఈయనతో పాటు శివ్ నాడార్, అశోక్ సూతా, మలేషియన్-ఇండియన్ వ్యాపారవేత్త బ్రహ్మల్ వాసుదేవన్, ఆయన భార్య శాంతి కండియాలు సైతం ‘ఫోర్బ్స్ ఆసియాస్ హీరోస్ ఆఫ్ ఫిలాంత్రపీ’లో చోటు దక్కించుకున్నారు. మంగళవారం ఈ జాబితా 16వ ఎడిషన్ను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఎటువంటి ర్యాంకులూ లేని ఈ జాబితాను ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో బలమైన దాతృత్వ కారణాలకు వ్యక్తిగతంగా దన్నుగా నిలబడిన దిగ్గజ వ్యక్తులతో రూపొందించినట్లు ఫోర్బ్స్ తెలిపింది.
ఏటా 37 లక్షల మందికి: ఈ ఏడాది జూన్లో తన 60వ పుట్టిన రోజు సందర్భంగా రూ.60,000 కోట్లను దానం చేస్తున్నట్లు అదానీ ప్రకటించిన విషయాన్ని ఫోర్బ్స్ గుర్తు చేసింది. ఈ డబ్బును అదానీ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితరాలకు వినియోగించనున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఏటా దేశవ్యాప్తంగా 37 లక్షల మందికి సహాయం అందిస్తూ వస్తున్నారని తెలిపింది.
పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటు: స్వయం కృషితో కుబేర స్థాయికి చేరిన హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు శివ్ నాడార్.. దేశంలోని అగ్రగామి దాతల్లో ఒకరుగా ఉంటారు. శివ్నాడార్ ఫౌండేషన్ ద్వారా ఈయన కొద్ది దశాబ్దాలుగా 100 డాలర్ల (సుమారు రూ.8100 కోట్ల) మేర విరాళాలు ఇచ్చారు. ఈ ఏడాది రూ.1,160 కోట్ల మేర ఫౌండేషన్కు విరాళమిచ్చారు. విద్య ద్వారా సమాజంలో సమానత్వాన్ని సాధించడం కోసం దీనిని వెచ్చిస్తారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను సైతం ఈయన ఏర్పాటు చేస్తున్నారు.
వైద్య పరిశోధనకు రూ.600 కోట్లు: సాంకేతిక దిగ్గజం, హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అయిన అశోక్ సూతా గతేడాది ఏప్రిల్లో ఒక వైద్య పరిశోధనా ట్రస్టు ఏర్పాటు చేసి.. రూ.600 కోట్ల మేర ఇస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే పదేళ్లలో ఈ డబ్బును వెచ్చించనున్నారు. హ్యాప్పియెస్ట్ మైండ్స్ టెక్నాలజీలో మెజారిటీ వాటా కలిగిన ఆయన, దాని నుంచి సంపద పొందుతున్నారు. ఇప్పటికే స్కాన్ (సైంటిఫిక్ నాలెడ్జ్ ఫర్ ఏజింగ్ అండ్ న్యూరోలాజికల్ ఎయిల్మెంట్స్) పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టు, గతేడాది పలు ప్రాజెక్టులకు రూ.20 కోట్ల నిధులిచ్చింది.
కాలుష్యం లేని విమానాల కోసం: మలేషియాలో స్థిరపడిన భారతీయులైన బ్రహ్మల్ వాసుదేవన్, క్రెడార్ అనే ప్రైవేటు ఈక్విటీ సంస్థను స్థాపించి, సీఈఓగా ఉన్నారు. ఆయన భార్య, న్యాయవాది శాంతి కండియాతో కలిసి మలేషియా, భారత్లో క్రెడార్ ఫౌండేషన్ ద్వారా స్థానిక ప్రజలకు మద్దతుగా నిలబడ్డారు. మలేషియాలో ఒక బోధనాసుపత్రికి 11 మి. డాలర్లను ఇవ్వనున్నట్లు ఈ ఏడాది మేలో ప్రకటించారు. అదే నెలలో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్కు 30 మి. డాలర్లను ఇచ్చారు. విమానయాన పరిశ్రమలో కాలుష్యంలేని సాంకేతికతను అభివృద్ధి చేసే ఒక సంస్థను ఏర్పాటు చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
టెలికాం మార్కెట్లో తిరిగి పుంజుకుంటామని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పారు. వీఐ 2.0 ప్రస్థానం ప్రారంభం కాబోతోందన్నారు. -
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
Tech Mahindra: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా మార్చితో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. లాభంలో భారీ క్షీణతను నమోదు చేసుకుంది. -
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
Credit card: క్రెడిట్ కార్డు ద్వారా జరుపుతున్న లావాదేవీలు 2024 మార్చిలో సరికొత్త మైలురాయిని చేరాయి. -
15 లక్షల వాహనాల ఉత్పత్తే టార్గెట్.. హ్యుందాయ్ మోటార్ గ్రూప్
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?