వడ్డీ రేట్లు.. వృద్ధి భయాలు పడేశాయ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటును 35 బేసిస్ పాయింట్ల మేర పెంచడం, ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు అంచనాను తగ్గించడంతో సూచీల నష్టాలు నాలుగో రోజూ కొనసాగాయి.
సమీక్ష
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటును 35 బేసిస్ పాయింట్ల మేర పెంచడం, ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు అంచనాను తగ్గించడంతో సూచీల నష్టాలు నాలుగో రోజూ కొనసాగాయి. డాలర్తో పోలిస్తే రూపాయి స్వల్పంగా బలపడి 82.47 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.56 శాతం తగ్గి 78.11 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు రాణించాయి.
సెన్సెక్స్ ఉదయం 62,615.52 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. ఆర్బీఐ నిర్ణయాల తర్వాత లాభాల్లోకి వచ్చిన సూచీ 62,759.97 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మళ్లీ నష్టాల్లోకి జారుకుని ఒకదశలో 62,316.65 పాయింట్లకు పడిపోయింది. చివరకు 215.68 పాయింట్ల నష్టంతో 62,410.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 82.25 పాయింట్లు కోల్పోయి 18,560.50 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,528.40- 18,668.30 పాయింట్ల మధ్య కదలాడింది.
* వడ్డీ రేట్ల ఆధారిత షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లలో ఫెడరల్ బ్యాంక్ 1.93%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.64%, కోటక్ బ్యాంక్ 1.24% నష్టపోయాయి. వాహన షేర్లలో టాటా మోటార్స్, బజాజ్ ఆటో 1.54%, టీవీఎస్ 1.38%, హీరో మోటో 1.35%, ఐషర్ 1.01% వరకు డీలాపడ్డాయి. స్థిరాస్తి షేర్లలో శోభా 5.59%, ఒబెరాయ్ రియాల్టీ 3.66%, గోద్రేజ్ ప్రోపర్టీస్ 2.35%, డీఎల్ఎఫ్ 1.28% నీరసపడ్డాయి.
* సెన్సెక్స్ 30 షేర్లలో 21 డీలాపడ్డాయి. ఎన్టీపీసీ 2%, బజాజ్ ఫిన్సర్వ్ 1.73%, సన్ఫార్మా 1.55%, టాటా స్టీల్ 1.46%, రిలయన్స్ 1.43%, హెచ్సీఎల్ టెక్ 1.38%, విప్రో 1.16%, అల్ట్రాటెక్ 1.12% చొప్పున నష్టపోయాయి. ఏషియన్ పెయింట్స్ 2.10%, హెచ్యూఎల్ 2.01%, ఎల్ అండ్ టీ 1.42%, యాక్సిస్ బ్యాంక్ 1.12%, ఐటీసీ 0.82% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి, మన్నికైన వినిమయ వస్తువులు, వాహన 1.11% పడ్డాయి. బీఎస్ఈలో 2038 షేర్లు నష్టాల్లో ముగియగా, 1478 స్క్రిప్లు లాభపడ్డాయి. 125 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
* అగ్రగామి వైన్ తయారీ సంస్థ సులా వైన్యార్డ్స్ ఐపీఓ ఈనెల 12న మొదలై 14న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా ఒక్కో షేరుకు రూ.340- 357గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.960.35 కోట్లు సమీకరించనుంది.
* హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రమోటర్ సంస్థల్లో ఒకటైన ఏబీఆర్డీఎన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ తమకున్న మొత్తం 10.21 శాతం వాటాను విక్రయించడానికి చూస్తోంది. ఈ ప్రతిపాదిత వాటా విక్రయం తర్వాత ఏబీఆర్డీఎన్ కో-స్పాన్సర్గా మారుతుంది.
* ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఆన్లైన్ రిటైల్ ట్రేడింగ్ వ్యాపారాన్ని విలీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు 5పైసా క్యాపిటల్ వెల్లడించింది.
* ఆర్సెలార్మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా నుంచి తమ నిర్మాణ సంస్థ ‘మెగా’ ఆర్డరు అందుకున్నట్లు ఎల్ అండ్ టీ ప్రకటించింది. కంపెనీ రూ.7000 కోట్లకు పైగా విలువ కలిగిన వాటిని ‘మెగా’ ఆర్డర్లుగా పరిగణిస్తుంది. ఆర్డరులో భాగంగా ఆర్సెలార్మిత్తల్ గుజరాత్, ఒడిశా విస్తరణ ప్రాజెక్టులను ఎల్ అండ్ టీ చేపట్టనుంది.
* ఓఎన్జీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా బీపీసీఎల్ మాజీ ఛైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. మహారత్న ప్రభుత్వ రంగ సంస్థకు అధిపతిగా పదవీ విరమణ పొందిన వ్యక్తిని నియమించడం ఇదే తొలిసారి. బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
IndiGo: విమాన ప్రయాణంలో వినోదాన్ని అందించే సేవల్ని మే1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో పేర్కొంది. -
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
Gold price: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా గిరాకీ తగ్గడంతో అంతర్జాతీయంగా వీటి ధరలు దిగివచ్చాయి. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో భారీ పెట్టుబడులు
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ.. వాటి విడిభాగాల ఉత్పత్తి నిమిత్తం రూ.25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది. -
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
OTP frauds: ఓటీపీ స్కామ్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందులోభాగంగానే టెలికాం, ఎస్బీఐ కార్డ్స్తో కలిసి పనిచేస్తోంది. -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 89 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
విమానాల్లో తల్లిదండ్రులకు పక్కనే చిన్నారులకు సీటు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. -
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్