Forbes List: అత్యంత శక్తిమంతుల్లో నిర్మలా సీతారామన్
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మంది మహిళల్లో మనదేశం నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు మరో అయిదుగురికి చోటు దక్కింది.
కిరణ్ మజుందార్ షా, ఫల్గుణి, రోష్ని, మాధబి, సోమామండల్కూ చోటు
ఫోర్బ్స్ జాబితా
న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మంది మహిళల్లో మనదేశం నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు మరో అయిదుగురికి చోటు దక్కింది. ఫోర్బ్స్ ప్రకటించిన ‘ద వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్’ వార్షిక జాబితాలో బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్, హెచ్సీఎల్ ఛైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా, సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్, సెయిల్ ఛైర్ పర్సన్ సోమా మండల్ కూడా చోటు దక్కించుకున్నారు.
* సీతారామన్ వరుసగా నాలుగో సారి ఈ జాబితాలో చోటుచేసుకున్నారు. 2019లో 34; 2020లో 41; 2021లో 37 ర్యాంకు సాధించిన ఈమె తాజాగా 36వ స్థానంలో నిలిచారు.
* జాబితాలో 39 మంది సీఈఓలు; 10 మంది ప్రభుత్వ శాఖల అధిపతులు; 11 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి మొత్తం సంపద 115 బిలియన్ డాలర్లుగా ఉంది.
* ఉక్రెయిన్ యుద్ధ సమయంలో నాయకత్వం వహించడం; కరోనా మహమ్మారి అదుపునకు చర్యలు తీసుకోవడం వంటి కారణాల రీత్యా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డే రెండో స్థానంలో; అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ జాబితాలో మూడో స్థానం పొందారు.
* 100వ ర్యాంకులో ఇరాన్కు చెందిన జినా ‘మహ్సా’ ఆమిని నిలిచారు. మహిళా హక్కుల కోసం పోరాడిన ఈమె సెప్టెంబరులో మరణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్