మే నుంచి పెరిగిన రెపో రేటు 2.25%
‘‘భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. రబీ పంట దిగుబడులు బాగున్నాయి. పట్టణ గిరాకీ ఎక్కువగా ఉండగా, గ్రామీణ పరిస్థితులూ మెరుగవుతున్నాయి. సేవలు, తయారీ రంగం పుంజుకోవడం, రుణాల్లో వృద్ధి లాంటివి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడతాయి.
తాజాగా 0.35% పెంపుతో 6.25 శాతానికి
2022-23కు వృద్ధి అంచనా 7% నుంచి 6.8 శాతానికి తగ్గింపు
2023 మార్చి కల్లా 6% దిగువకు ద్రవ్యోల్బణం
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష
‘‘భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. రబీ పంట దిగుబడులు బాగున్నాయి. పట్టణ గిరాకీ ఎక్కువగా ఉండగా, గ్రామీణ పరిస్థితులూ మెరుగవుతున్నాయి. సేవలు, తయారీ రంగం పుంజుకోవడం, రుణాల్లో వృద్ధి లాంటివి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడతాయి. ప్రపంచ దేశాల తరహాలోనే ఇక్కడా అధిక స్థాయుల్లో ఉన్న ద్రవ్యోల్బణంపై పోరాటం కొనసాగిస్తాం. కరెంటు ఖాతా లోటు నియంత్రిత స్థాయిలోనే ఉంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి క్షీణత తక్కువే.’’
శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నరు
ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రెపోరేటును మరో 35 బేసిస్ పాయింట్ల (0.35%) మేర పెంచి, 6.25 శాతానికి చేర్చింది. దీంతో గృహ, వాహన, ఇతర రుణాల నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) మరింత భారం అవుతాయి. ఈ ఏడాది మే నుంచి 5 విడతల్లో మొత్తంగా 225 బేసిస్ పాయింట్ల (2.25%) మేర రెపోరేటును ఆర్బీఐ పెంచింది. గత మూడు సందర్భాల్లో 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచగా, అయితే దూకుడును కాస్త తగ్గించింది. తద్వారా రెపోరేటు గరిష్ఠ స్థాయికి సమీపిస్తున్నదేనే సంకేతాన్ని ఇచ్చింది. 0.35% పెంపు నిర్ణయానికి పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లోని ఆరుగురు సభ్యుల్లో అయిదుగురు ఓటేశారు. సర్దుబాటు విధాన వైఖరిని ఉపసంహరించే ప్రతిపాదనకు నలుగురు మద్దతు తెలిపారు. సోమవారం నుంచి జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నరు శక్తికాంతదాస్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. ముఖ్యాంశాలివీ..
వృద్ధిరేటు అంచనాల్లో మళ్లీ కోత
దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ మరోసారి తగ్గించింది. 2022-23లో వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదు కావొచ్చని తాజాగా పేర్కొంది. వృద్ధిరేటు 7.8 శాతంగా ఉండొచ్చని ఈ ఏడాది ఫిబ్రవరిలో అంచనా వేయగా, ఏప్రిల్లో 7.2 శాతానికి, సెప్టెంబరులో 7.0 శాతానికి ఆర్బీఐ సవరించింది. ఇప్పుడు మరింత తగ్గించిది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను పెంచే విషయంలో దూకుడుగా వెళ్తుండటాన్ని పరిగణనలోకి తీసుకుని వృద్ధి అంచనాలను తగ్గించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. అయినా కూడా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దిగ్గజ ఆర్థిక వ్యవస్థ దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ చెప్పారు.
ద్రవ్యోల్బణ అంచనా యథాతథం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాల్లో మార్పు చేయకుండా 6.7 శాతంగానే ఆర్బీఐ కొనసాగించింది. 2023 మార్చి లోగా ద్రవ్యోల్బణం నియంత్రిత లక్ష్య శ్రేణిలోని గరిష్ఠమైన 6 శాతం దిగువకు వస్తుందని అంచనా వేసింది. ఈ ఏడాది జనవరి అక్టోబరు వరకు రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం పైనే నమోదవుతూ వచ్చింది. కమొడిటీ - చమురు ధరలు దిగిరావడం వల్ల క్లిష్ట పరిస్థితులు తొలగినట్లేనని పేర్కొంటూనే, అధిక ధరలపై పోరాటం కొనసాగుతుందని పేర్కొంది. వచ్చే 12 నెలల్లో ద్రవ్యోల్బణం 4 శాతం ఎగువనే కొనసాగుతుందని దాస్ తెలిపారు.
రూపాయి క్షీణత పరిమితంగానే..
అమెరికా డాలరు బలోపేతం కావడంతో, ప్రధాన దేశాల కరెన్సీలన్నీ క్షీణించాయని, వీటితో పోలిస్తే రూపాయి క్షీణత పరిమితంగానే ఉందని ఆర్బీఐ గవర్నరు చెప్పారు. 2022 ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు రూపాయి విలువ 3.2% పెరిగిందన్నారు. దేశీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక, ఫైనాన్షియల్ మార్కెట్ పరిణామాలను గమనిస్తూ రూపాయి కదలికలపై ఎప్పటికప్పుడు మదింపు చేసుకోవడం ముఖ్యమని దాస్ తెలిపారు. మార్కెట్ ఆధారంగానే రూపాయి విలువ ఉంటుందని స్పష్టం చేశారు.
9 నెలల దిగుమతులకు సరిపడా ఫారెక్స్ నిల్వలు: విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు సౌకర్యవంత స్థాయిలో ఉన్నాయని చెప్పారు. 2022 డిసెంబరు 2 నాటికి ఇవి 561.20 బిలియన్ డాలర్లకు చేరాయి. 2022-23లో తొమ్మిది నెలల దిగుమతుల విలువకు ఇవి సమానం. భారత విదేశీ రుణాల నిష్పత్తి తక్కువగానే ఉంది. 2021-22కు మించి కరెంటు ఖాతా లోటు నమోదైనా, నియంత్రిత స్థాయిగానే భావించవచ్చని దాస్ వివరించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్యలభ్యత మిగులు కొనసాగుతోంది.
* సాధారణంతో పోలిస్తే రబీ దిగుబడులు ఇప్పటివరకు 6.8 శాతం అధికంగా ఉన్నాయి.
ఇ-కేవైసీ చేస్తే మళ్లీ శాఖల్లో అడగకూడదు
వినియోగదారులు ఆన్లైన్ ద్వారా కేవైసీ (ఇ-కేవైసీ) పూర్తి చేసుకుంటే.. మళ్లీ బ్యాంకు శాఖల్లో వెరిఫికేషన్ అడగకూడదని ఆర్బీఐ తెలిపింది. సెంట్రల్ కేవైసీ (సీ-కేవైసీ) పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేసిన వినియోగదారుల విషయంలోను బ్యాంకులు వెరిఫికేషన్ అడగకూడదని సూచించింది. వినియోగదారులను ఇబ్బంది పెట్టకూడదని తరచు బ్యాంకులకు తెలియజేస్తున్నామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నరు రవి శంకర్ చెప్పారు.
పలు చెల్లింపులకు ఒకేసారి ఆదేశాలు
యూపీఐలో కొత్త సదుపాయం
యూపీఐ ప్లాట్ఫామ్ నుంచి మరో కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. ‘సింగిల్ బ్లాక్ అండ్ మల్టిపుల్ డెబిట్స్’గా వ్యవహరించే దీని ద్వారా సెక్యూరిటీస్లో పెట్టుబడులు మరింత సులభం అవుతాయని ఆర్బీఐ తెలిపింది. ఉదాహరణకు హోటల్ గది బుక్ చేసుకున్నప్పుడు, అడ్వాన్స్ కింద కొంత, మిగిలింది రోజువారీ-చివరన ఇస్తుంటాం. ఇందుకు ఎంత అవుతుందో అంచనా ఉంటుంది కనుక, ఒకేసారి ఆ మొత్తానికి అనుమతి ఇస్తే, విడతలుగా నిధులను మన ఖాతా నుంచి హోటల్ యాజమాన్యం విత్డ్రా చేసుకుంటుంది. ఇ-కామర్స్లో వస్తువులు లేదా సేవలు డెలివరీ అయ్యే వరకు మన ఖాతాలోనే డబ్బులు ఉంటాయని, అవసరమైన సమయంలో ఇవి డెబిట్ అవుతాయని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ను ఉపయోగించి ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసేందుకూ ఉపయోగపడుతుంది. యూపీఐలో ఈ కొత్త సదుపాయాన్ని చేర్చడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేక సూచనలు జారీ చేస్తామని తెలిపారు.
* పన్నులు, విద్యాసంస్థలకు ఫీజుల చెల్లింపు వంటి అన్ని రకాల చెల్లింపులకు వీలు కల్పించేలా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్స్ (బీబీపీఎస్) పరిధిని పెంచనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’