మార్కెట్లో భాజపా ‘గెలుపు’ లాభాలు
సూచీల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీ నాలుగు రోజుల తర్వాత లాభాలు నమోదు చేశాయి.
సమీక్ష
సూచీల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీ నాలుగు రోజుల తర్వాత లాభాలు నమోదు చేశాయి. గుజరాత్లో అధికార భాజపా రికార్డు విజయాన్ని నమోదు చేయడం సానుకూల ప్రభావం చూపింది. విదేశీ మదుపర్ల అమ్మకాలు, మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు లాభాలను పరిమితం చేశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి 9 పైసలు పెరిగి 82.38 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 77.45 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ ఉదయం 62,504.04 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్లో 62,320.18 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకి, అనంతరం పుంజుకుంది. ఒకదశలో 62,633.56 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 160 పాయింట్ల లాభంతో 62,570.68 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 48.85 పాయింట్లు పెరిగి 18,609.35 దగ్గర స్థిరపడింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 13 లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్ 2.71%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.31%, ఎల్ అండ్ టీ 2.06%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.02% రాణించాయి.
* గుజరాత్లోని సన్ఫార్మా హలోల్ ప్లాంట్ను దిగుమతి హెచ్చరిక జాబితాలో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ చేర్చింది. ఈ ప్లాంట్లో తయారైన ఉత్పత్తులను తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సన్ఫార్మా 3.57% నష్టపోయింది. పవర్గ్రిడ్ 1.56%, టీసీఎస్ 0.90%, ఎన్టీపీసీ 0.84% నష్టపోయాయి.
* సంస్థాగత మదుపర్లకు షేర్లను విక్రయించడం ద్వారా దాదాపు రూ.3500 కోట్లు సమీకరించడానికి మ్యాక్రోటెక్ డెవలపర్స్ ప్రమోటర్లు సన్నాహాలు చేస్తున్నారు. లోధా బ్రాండ్ కింద కంపెనీ ఆస్తులను విక్రయిస్తుంది.
* గత పక్షం రోజుల్లో తమ సంస్థలు దాదాపు రూ.1,500 కోట్లు సమీకరించినట్లు ఐనాక్స్ జీఎఫ్ఎల్ గ్రూప్ ప్రకటించింది.
* ధర్మాజ్ క్రాప్ గార్డ్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.237తో పోలిస్తే 12.24% లాభపడి రూ.266 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ.278.90 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు రూ.266.40 వద్ద ముగిసింది.
* ల్యాండ్మార్క్ కార్స్ ఐపీఓ 13న ప్రారంభమై 15వ తేదీన ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా ఒక్కో షేరుకు రూ.481- 506 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.552 కోట్లు సమీకరించనుంది.
* వచ్చే క్యాలెండర్ సంవత్సరంలో కల్యాణ్ జువెలర్స్ ఇండియా కొత్తగా 52 విక్రయశాలలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇందులో ఎక్కువగా దక్షిణ భారతేతర ప్రాంతంలోనే నెలకొల్పనున్నారు.
* భారత ఆర్థిక సేవల రంగంపై విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు) సానుకూలత కనబరుస్తున్నారు. బలమైన రుణాల వృద్ధి, నిరర్థక ఆస్తులు తగ్గడంతో నవంబరులో ఈ రంగంపై రూ.14,205 కోట్లు (2.1 బి.డాలర్లు) పెట్టుబడులు పెట్టడమే ఇందుకు నిదర్శనం. అక్టోబరులో లాభాల స్వీకరణ కారణంగా ఆర్థిక సేవల షేర్ల నుంచి వీరు రూ.4,686 కోట్లు ఉపసంహరించుకున్నారు.
* హిందుజా గ్రూప్ సంస్థ అశోక్ లేలాండ్ తన ఎండీ, సీఈఓగా శేణు అగర్వాల్ను నియమించింది. తక్షణం ఈ నియామకం అమల్లోకి వస్తుంది.
* ఒజివాలో మెజారిటీ వాటా(51%)ను; వెల్బీయింగ్ న్యూట్రిషన్లో 19.8 శాతం వాటాను మొత్తం మీద రూ.335 కోట్ల పెట్టుబడులతో సొంతం చేసుకున్నట్లు హెచ్యూఎల్ గురువారం ప్రకటించింది. తద్వారా ఆరోగ్య, వెల్త్బీయింగ్ విభాగంలోకి అడుగుపెట్టింది.
* త్రివేణి ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ ప్రమోటరు అయిన ధృవ్ మన్మోహన్ సానే బహిరంగ విపణిలో 7 శాతం వాటాను రూ.477 కోట్లకు విక్రయించారు.
* రూ.600 కోట్ల మూలధనాన్ని ఇవ్వాలంటూ మాతృ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ను రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కోరినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు