సంక్షిప్త వార్తలు (7)
ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) పథకం కింద ప్రత్యేక ఉక్కు(స్పెషాలిటీ స్టీల్) విభాగంలో మొత్తం మీద 30 కంపెనీల నుంచి 67 దరఖాస్తులను ఎంపిక చేశామని ఉక్కు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ప్రత్యేక ఉక్కు పీఎల్ఐకి 67 సంస్థల ఎంపిక
రూ.42,500 కోట్ల పెట్టుబడులు
దిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) పథకం కింద ప్రత్యేక ఉక్కు(స్పెషాలిటీ స్టీల్) విభాగంలో మొత్తం మీద 30 కంపెనీల నుంచి 67 దరఖాస్తులను ఎంపిక చేశామని ఉక్కు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇవి రూ.42,500 కోట్ల పెట్టుబడులు పెడతాయని, తద్వారా కొత్తగా 70,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసింది. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, జేఎస్పీఎల్, ఏఎమ్ఎన్ఎస్ ఇండియా, సెయిల్ వంటి దిగ్గజ ఉక్కు కంపెనీల నుంచి దరఖాస్తులు వచ్చాయని అంతక్రితం ఒక సీనియర్ అధికారి తెలిపారు. అదే సమయంలో దేశంలో స్పెషాలిటీ స్టీల్ సామర్థ్యం అదనంగా 26 మిలియన్ టన్నులకు చేరుతుందని చెబుతున్నారు. రూ.46,000 కోట్ల పెట్టుబడులు పెట్టి 2030 కల్లా 28 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేపడతామంటూ 35 చిన్న, పెద్ద ఉక్కు తయారీ కంపెనీల నుంచి 79 దరఖాస్తులు వచ్చాయని ఉక్కు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సెజ్ ఐటీ యూనిట్లకు మేలు
2023 డిసెంబరు వరకు
‘ఇంటి నుంచి పని’కి అనుమతిపై నాస్కామ్
దిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్ఈజడ్/ సెజ్)లోని ఐటీ కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచి పని (డబ్ల్యూఎఫ్హెచ్) చేసేందుకు నిబంధనలను సరళీకరిస్తూ, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల వల్ల సులభతర వాణిజ్యానికి ప్రధాన అడుగు వేసినట్లయిందని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ శుక్రవారం పేర్కొంది. సెజ్లలో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలు, ఒక బలమైన హైబ్రిడ్ పని విధానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వీలవుతుందని పేర్కొంది. సెజ్లలోని ఐటీ కంపెనీల ఉద్యోగులకు 2023 డిసెంబరు వరకు పూర్తిగా ‘ఇంటి నుంచి పని’ విధానాన్ని ఎంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సెజ్ నిబంధనలను కేంద్రం సవరించింది. ఈ అనుమతులు తక్షణం అమల్లోకి వస్తాయని, ప్రత్యేకంగా ఎటువంటి దరఖాస్తు చేయనక్కర్లేదని నాస్కామ్ వివరించింది. ఆయా యూనిట్లు అవసరమైతే మొత్తం ఉద్యోగులందరినీ హైబ్రిడ్/రిమోట్ పద్ధతిలో పనిచేయించుకోవచ్చని, ఇది వచ్చే ఏడాది డిసెంబరు 31 వరకు అందుబాటులో ఉంటుందని వివరించింది. అయితే స్థానిక డెవలప్మెంట్ కమిషనర్కు ఈ యూనిట్లు ఇ-మెయిల్ ద్వారా సమాచారం అందించాల్సి ఉంటుంది.
కాంకర్కు.. జనవరిలో
కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) ప్రైవేటీకరణలో భాగంగా ప్రభుత్వం విక్రయించే వాటాకు జనవరిలో ప్రాథమిక బిడ్లను ఆహ్వానించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. కాంకర్లోనూ యాజమాన్య బదిలీతో పాటు తనకున్న 54.80 శాతం వాటాలో 30.8 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనుంది. మార్చితో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇతర వ్యూహాత్మక వాటా విక్రయాలు చేపట్టే అవకాశం లేనందున, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని సాధించేందుకు మైనార్టీ వాటా విక్రయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది. ‘లక్ష్యాన్ని కచ్చితంగా అందుకోవాలని మేం పరిగెత్తడం లేదు. ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ వాటాను విక్రయించాలని చూస్తున్నామ’ని ఆ అధికారి తెలిపారు.
ఎస్సీఐకు.. మార్చి- ఏప్రిల్లో
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు (ఎస్సీఐ) చెందిన స్థలాలు, ప్రధానేతర ఆస్తుల విభజనకు ఈ నెలలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చే అవకాశం ఉండటంతో, ఎస్సీఐకు మార్చి లేదా ఏప్రిల్లో ఆర్థిక బిడ్లను ప్రభుత్వం ఆహ్వానిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. షిప్పింగ్ కార్పొరేషన్ యాజమాన్య బదిలీతో పాటు అందులో 63.75 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం అనుకుంటోంది.
ఆర్ఐఎన్ఎల్లో వాటా విక్రయంపై కసరత్తు
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) లేదా వైజాగ్ స్టీల్లో వ్యూహాత్మక వాటా విక్రయ లావాదేవీ విధానంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్ఐఎన్ఎల్లో 100 శాతం వాటా విక్రయానికి 2021 జనవరిలో ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రి వర్గం కమిటీ సూత్రప్రాయ అనుమతులు ఇచ్చింది. ‘సూత్రప్రాయ అనుమతులు వచ్చాయి. ఈ లావాదేవీ విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారించామ’ని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు.
స్నాప్డీల్ పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదన వాయిదా
దిల్లీ: పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలనే ప్రతిపాదనను ఇ-కామర్స్ సంస్థ స్నాప్డీల్ వాయిదా వేసుకుంది. దీంతో ఈ ఏడాది ఐపీఓ ప్రణాళికలను వాయిదా వేసుకున్న బోట్, ఫార్మ్ఈజీ, డ్రూమ్ తదితర అంకురాల జాబితాలో మరో సంస్థ చేరినట్లయ్యింది. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా రూ.1,250 కోట్లు సమీకరించాలని స్నాప్డీల్ భావించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం గతేడాది డిసెంబరులో ముసాయిదా పత్రాలను సమర్పించింది. దీనికి సెబీ ఇప్పటివరకు ఆమోదం తెలపలేదు. ‘మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐపీఓ ప్రతిపాదనను వాయిదా వేయాలని నిర్ణయించాం. మూలధన అవసరాలు, మార్కెట్లో సానుకూల పరిస్థితులు చోటుచేసుకుంటే తిరిగి ఐపీఓకు వెళ్లాలనే అంశాన్ని పరిశీలిస్తామ’ని స్నాప్డీల్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే ఎప్పుడు మళ్లీ ఐపీఓకు వెళ్తారనే విషయాలపై స్పష్టత ఇవ్వలేదు.
రూ.400 కోట్లు సమీకరించనున్న ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రోడక్ట్స్
ఈనాడు, హైదరాబాద్: రక్షణ, అంతరిక్ష రంగాలకు పలు రకాల ఎలక్ట్రానిక్ విడిభాగాలు అందించే సంస్థ ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రోడక్ట్స్ రూ.400 కోట్లు సమీకరించనునంది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్, క్యూఐపీ లేదా ఇతర మార్గాల్లో ఈ నిధులు సమీకరిస్తారు. వాటాదార్ల నుంచి అనుమతి తీసుకున్నాకే, నిధుల సమీకరణ యత్నాలు మొదలుపెడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
March 31 Deadline: ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, ఆదాయ పన్ను విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. -
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
Afcons Infra IPO: ఐదేళ్ల తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ వస్తోంది. నిర్మాణ రంగ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!