సిమెంట్ వ్యాపారం నుంచి జేపీ గ్రూప్ నిష్క్రమణ
సిమెంట్ వ్యాపారం నుంచి జేపీ గ్రూప్ నిష్క్రమించింది.
దాల్మియా సిమెంట్కు 9.4 మి.ట. ప్లాంట్ల విక్రయం
లావాదేవీ విలువ రూ.5,666 కోట్లు
దిల్లీ: సిమెంట్ వ్యాపారం నుంచి జేపీ గ్రూప్ నిష్క్రమించింది. 20 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్లను 2014-17 మధ్య ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్కు విక్రయించగా, మిగిలిన 9.4 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన సిమెంట్ ప్లాంట్లను దాల్మియా భారత్కు విక్రయిస్తున్నట్లు జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్), గ్రూప్ సంస్థలు సోమవారం ప్రకటించాయి. ఈ లావాదేవీ ఎంటర్ప్రైజ్ విలువ రూ.5,666 కోట్లు. రుణభారం తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే సిమెంట్ రంగం నుంచి జేపీ గ్రూప్ వైదొలిగింది.
దాల్మియా సిమెంట్ సామర్థ్యం 45.3 మి.ట.కు: పలు రాష్ట్రాల్లో జేపీ గ్రూప్ ప్రధాన సంస్థ జేఏఎల్, అనుబంధ సంస్థల నుంచి 9.4 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన సిమెంట్ ప్లాంట్లతో పాటు థర్మల్ ప్లాంట్ను దాల్మియా భారత్ కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోలుతో దాల్మియా భారత్ వార్షిక సిమెంట్ తయారీ సామర్థ్యం 35.9 మిలియన్ టన్నుల నుంచి 45.3 మిలియన్ టన్నులకు చేరుతుంది. దేశంమొత్తం కార్యకలాపాలు సాగించే కంపెనీగా ఎదగాలనుకుంటున్న దాల్మియా భారత్కు ఈ లావాదేవీ దోహదపడుతుంది. జేఏఎల్, అనుబంధ కంపెనీల నుంచి క్లింకర్, సిమెంట్, విద్యుత్ ప్లాంట్ల కొనుగోలుకు అనుబంధ సంస్థ దాల్మియా భారత్ సిమెంట్ బైండింగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు దాల్మియా భారత్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఈ లావాదేవీలో 9.4 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ కేంద్రాలు, 6.7 మిలియన్ టన్నుల క్లింకర్, 280 మెగావాట్ థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా భాగమే.
* ఈ కొనుగోలుతో దేశ మధ్య ప్రాంతంలోనూ దాల్మియా విస్తరించనుంది. జేఏఎల్ ఆస్తులు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్గఢ్ల్లో ఉన్నాయి. 2026-27కు 75 మిలియన్ టన్నులు, 2030-31కు 110-130 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యానికి విస్తరించాలన్న కంపెనీ లక్ష్యానికి దోహదపడనుంది.
* ప్రస్తుతం దేశంలో అల్ట్రాటెక్, అదానీ సిమెంట్ (ఏసీసీ, అంబుజా సిమెంట్ కొనుగోలు తర్వాత), శ్రీ సిమెంట్ తర్వాత నాలుగో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థగా దాల్మియా సిమెంట్ ఉంది.
రుణాలు తగ్గించుకునేందుకే రుణ భారాన్ని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా 2014-17 మధ్య 20 మిలియన్ టన్నులకు పైగా తయారీ సామర్థ్యం కలిగిన ప్లాంట్లను అల్ట్రాటెక్ సిమెంట్కు జేఏఎల్ విక్రయించింది. 2015లో 2 మిలియన్ టన్నులకు పైగా సామర్థ్యం కలిగిన ప్లాంట్లలో నియంత్రణ వాటాను దాల్మియా గ్రూప్నకు జేపీ గ్రూప్ అమ్మేసింది.
* 2018 సెప్టెంబరులో జేఏఎల్పై ఐసీఐసీఐ బ్యాంక్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి రూ.6893.15 కోట్లు వసూలు కావాల్సి ఉన్నందున, జేఏఎల్పై ఎన్సీఎల్టీలో ఎస్బీఐ కూడా ఫిర్యాదు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?