సరైన వ్యక్తి దొరికాక ట్విటర్ సీఈఓగా వైదొలుగుతా
సామాజిక మాధ్యమం ట్విటర్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పదవికి సరైన వ్యక్తి దొరికితే, ఆ బాధ్యతల నుంచి తాను వైదొలుగుతానని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు.
న్యూయార్క్: సామాజిక మాధ్యమం ట్విటర్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పదవికి సరైన వ్యక్తి దొరికితే, ఆ బాధ్యతల నుంచి తాను వైదొలుగుతానని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ‘ట్విటర్ సీఈఓగా కొనసాగనా? వద్దా?’ అంటూ ఆయనే ట్విటర్లో ఓ పోల్ నిర్వహించగా, ఓటు వేసిన వారిలో 57.5 శాతం మంది మస్క్ ఆ బాధ్యతల నుంచి వైదొలగాలని కోరారు. ఆ ఫలితాన్ని గౌరవిస్తానని చెప్పిన మస్క్, తాజాగా ఇలా ప్రకటించారు. ‘ట్విటర్ సీఈఓ బాధ్యతలను చేపట్టేందుకు ఎవరైనా ఒక తెలివి తక్కువ వ్యక్తి దొరికితే, నేను సీఈఓ పదవికి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత నుంచి కేవలం ట్విటర్ సాఫ్ట్వేర్, సర్వర్ బృందాలను పర్యవేక్షించే బాధ్యతలకు పరిమితం అవుతాన’ని మస్క్ ట్వీట్ చేశారు.
* గత ఆదివారం సాయంత్రం ప్రారంభమై సోమవారం ఉదయం వరకు జరిగిన ట్విటర్ పోల్లో 1.7 కోట్ల మంది ఓటేసినట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనం ఆధారంగా తెలుస్తోంది. ఇందులో ఎక్కువ మంది ఆయన వైదొలగాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫలితంపై మస్క్ వెంటనే స్పందించకుండా, మంగళవారం ట్వీట్ చేశారు. గతంలోనూ ఆయన ట్విటర్ పోల్ ఫలితాలకు కట్టుబడి ఉండేవారు. ప్రజల అభిప్రాయమే దైవ అభిప్రాయమంటూ ఆయన లాటిన్ భాషలో తరచూ చెబుతుండేవారు.
* ఈ ఏడాది అక్టోబరు చివర్లో ట్విటర్ను కొనుగోలు చేశాక... మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. అందుకే ట్విటర్ సీఈఓగా తాను కొనసాగాలా? వద్దా? అంటూ పోల్ నిర్వహించారు. ట్విటర్కు సంబంధించి మున్ముందూ ఏదేని కీలక విధాన మార్పులు చేయదలిస్తే, ట్విటర్లో పోల్ ద్వారానే నిర్ణయం తీసుకుంటామని మస్క్ ప్రకటించారు. ఇతర సామాజిక మాధ్యమాలకు ప్రచారం కల్పించే ఉద్దేశంతో తెరిచిన ఖాతాలన్నింటనీ మూసేయనున్నట్లు ట్విటర్ తెలిపింది. ‘మా వినియోగదార్లలో చాలా మంది ఇతర సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉన్నట్లు మేం గుర్తించాం. ట్విటర్ ప్లాట్ఫామ్ ద్వారా ఆ సామాజిక మాధ్యమాలకు ఉచితంగా ప్రచారం చేయడాన్ని మేం అనుమతించబోమ’ని ట్విటర్ పేర్కొంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మాస్టోడాన్, ట్రూత్ సోషల్, ట్రైబల్, నోస్టర్, పోస్ట్ లాంటి ప్లాట్ఫామ్ల యూజర్ నేమ్లు, లింక్ల కంటెంట్ ఉన్న ఖాతాలను మేం తొలిగిస్తున్నట్లు వివరించింది.
రెండేళ్ల కనిష్ఠానికి ఎలాన్ మస్క్ నికర సంపద
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నికర సంపద రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. మంగళవారం టెస్లా షేరు భారీ నష్టాలను చవిచూడటంతో.. ఒక్కరోజే ఆయన సంపద 7.7 బిలియన్ డాలర్ల మేర ఆవిరయ్యింది. ఒక్క రోజులో మస్క్ నికర సంపద ఇంత గణనీయంగా తగ్గడం అక్టోబరు తర్వాత మళ్లీ ఇప్పుడే. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. ప్రస్తుతం మస్క్ నికర సంపద 148 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాదిలోనే ఆయన నికర సంపద 122.60 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. 2021లో ఆయన పెంచుకున్న సంపద కంటే కూడా ఇదే ఎక్కువే. ఫలితంగా ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానాన్ని మస్క్ కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
Resume Tips: రెజ్యూమె ప్రిపేర్ చేసే సమయంలో చేయకూడని మూడు తప్పుల గురించి మాట్లాడారు గూగుల్ మాజీ రిక్రూటర్ నోలన్ చర్చ్. -
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
కోటక్ మహీంద్రా బ్యాంక్పై ఆర్బీఐ పలు ఆంక్షలు విధించింది. ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో లోపాలు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. -
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
తమ బ్రాండ్ పేరు, లోగోతో కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తున్నారని, వీటితో అప్రమత్తంగా ఉండాలని ఎల్ఐసీ సూచించింది. -
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు, నిఫ్టీ 34 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్కు దీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు ఎలాన్ మస్క్కు చెందిన ‘ఎక్స్’ సిద్ధమవుతోంది. -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
Tesla: భారత్లోకి టెస్లా ప్రవేశం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. మంగళవారం చేసిన ఓ కీలక ప్రకటనే అందుకు కారణం. ఆ ప్రకటనేంటి? దానికీ.. కంపెనీ భారత ప్రణాళికలకు సంబంధం ఏంటో చూద్దాం! -
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
Anil Agarwal: తన దినచర్యను తెలపడంతో పాటు యువతకు ఆరోగ్య సూత్రాలను పంచుకున్నారు వేదాంత అధిపతి అనిల్ అగర్వాల్. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 73,898 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 22,412 దగ్గర కొనసాగుతోంది. -
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది.