2023లోనూ విదేశీ పెట్టుబడులు మనకే
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ, కొత్త ఏడాదిలో విదేశీ మదుపర్లు భారత్పైనే మక్కువ చూపే అవకాశం ఉందని ‘అంతర్జాతీయ పెట్టుబడులను పరిశీలించే యూఎన్సీటీఏడీ నివేదిక’ అంచనా వేసింది.
ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ విధానాల వల్లే
యూఎన్సీటీఏడీ నివేదిక అంచనా
దిల్లీ: అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ, కొత్త ఏడాదిలో విదేశీ మదుపర్లు భారత్పైనే మక్కువ చూపే అవకాశం ఉందని ‘అంతర్జాతీయ పెట్టుబడులను పరిశీలించే యూఎన్సీటీఏడీ నివేదిక’ అంచనా వేసింది. ప్రస్తుత ఏడాది తరహాలోనే 2023లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) భారత్కు కొనసాగుతాయని ఆ నివేదికలో నిపుణులు అంచనా వేశారు. అమెరికాలో ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు కఠినంగా ఉన్నా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నా కూడా.. భారత్లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలు, ఆరోగ్యకర ఆర్థిక వృద్ధి రేటు అంచనాల వంటివి ఎఫ్డీఐలను ఆకర్షిస్తాయని నివేదిక పేర్కొంది.
* సులభతర వ్యాపార నిర్వహణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు, పుష్కలమైన సహజ వనరులు, సరళతర ఎఫ్డీఐ విధానాలు, భారీ దేశీయ విపణి, ఆరోగ్యకర జీడీపీ వృద్ధి వంటి సానుకూల అంశాలు విదేశీ పెట్టుబడులను 2023లో ఆకర్షిస్తాయని విశ్లేషించింది. ‘ఒప్పందాల అమలులో జాప్యం, గజిబిజి విధానాలు, అధిక వడ్డీ రేట్ల వంటివి’ మాత్రం ఇప్పటికీ ఇబ్బందికర అంశాలేనని తెలిపింది.
* కొవిడ్ పరిణామాల అనంతరమూ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ‘సరికొత్త పెట్టుబడుల పునరుద్ధరణ’ మాత్రం ఇప్పటికీ బలహీనంగానే ఉందని యూఎన్సీటీఏడీ 2022 నివేదిక వెల్లడించింది.
* ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ఆహారం, ఇంధనం, ఆర్థిక సంక్షోభాలు రావడం, మళ్లీ హడలెత్తిస్తున్న కొవిడ్-19 మహమ్మారి, వాతావారణ మార్పులు అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒత్తిడి పెంచుతున్నాయి.
జనవరి-సెప్టెంబరులో 42.5 బి.డాలర్లు
2022 జనవరి-సెప్టెంబరు మధ్య కాలంలో 42.5 బి.డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) మన దేశంలోకి వచ్చాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2021లో ఇవి 51.3 బి.డాలర్లుగా నమోదయ్యాయి. 2021-22లో మన దేశం అత్యధిక మొత్తంలో 84.84 బి.డాలర్ల ఎఫ్డీఐలను ఆకర్షించింది.
* ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం (ఏప్రిల్-సెప్టెంబరు)లో ఈక్విటీల్లోకి ఎఫ్డీఐ పెట్టుబడులు 14 శాతం తగ్గి 26.9 బి.డాలర్లకు పరిమితమయ్యాయి. ఈక్విటీ పెట్టుబడులు, రీఇన్వెస్టెడ్ ప్రతిఫలాలు, ఇతర మూలధనంతో కలిపి మొత్తం ఎఫ్డీఐలు 39 బి.డాలర్లుగా నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో ఈ మొత్తం 42.86 బి.డాలర్లు కావడం గమనార్హం.
* ప్రభుత్వం తీసుకుంటున్న సరళతర ఎఫ్డీఐ విధానాలు, సులభతర వ్యాపార నిర్వహణకు అవలంబిస్తున్న పద్ధతులు, నిబంధనల భారం తగ్గించడం, పీఎల్ఐ పథకాలు, సమ్మిళిత మౌలిక సదుపాయాల కోసం తీసుకొచ్చిన పీఎం గతిశక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక.. వంటివి మన దేశంలోకి విదేశీ పెట్టుబడులు తరలిరావడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయని పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి అనురాగ్ జైన్ వెల్లడించారు.
* 2000 ఏప్రిల్-2022 సెప్టెంబరు మధ్య మన దేశంలోకి 887.76 బి.డాలర్ల ఎఫ్డీఐలు తరలివచ్చాయి. సుమారు 26 శాతం ఎఫ్డీఐలు మారిషస్ మార్గంలో భారత్కు తరలివచ్చాయి. సింగపూర్ (23 శాతం), అమెరికా (9 శాతం), నెదర్లాండ్స్ (7 శాతం), జపాన్ (6 శాతం), యూకే (5 శాతం), యూఏఈ, జర్మనీ, సైప్రస్, కేమ్యాన్ ఐలాండ్ నుంచి 2 శాతం మేర ఎఫ్డీఐలు దేశంలోకి వచ్చాయి.
ఈ రంగాల్లోకి అధికం
సేవలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, నిర్మాణరంగం, వాహన, రసాయనాలు, ఔషధ రంగాల్లోకి అత్యధికంగా ఎఫ్డీఐలు వచ్చాయి. ఆటోమేటిక్ పద్ధతిలో అధిక శాతం రంగాల్లోకి ఎఫ్డీఐలకు అనుమతి ఉన్నా.. టెలికాం, మీడియా, ఔషధ, బీమా రంగాల్లోకి విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా