లక్ష్యం.. విజయం.. అదే మన గమ్యం
దేశవ్యాప్తంగా 5జీ మొబైల్ సేవలను 2023 చివరికల్లా విస్తరించాలని ప్రణాళిక రూపొందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ.. రిటైల్ వ్యాపార విభాగానికీ లక్ష్యాలు సూచించారు.
మెస్సి ఆదర్శంగా బృందస్ఫూర్తితో సాగాలి
జియో, రిటైల్తో దేశాభివృద్ధికి ఊతమివ్వాలి
పర్యావరణహిత కంపెనీగా రిలయన్స్
వారసులకు ముకేశ్ దిశానిర్దేశం
రిలయన్స్ ఫ్యామిలీ డే
దిల్లీ
దేశవ్యాప్తంగా 5జీ మొబైల్ సేవలను 2023 చివరికల్లా విస్తరించాలని ప్రణాళిక రూపొందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ.. రిటైల్ వ్యాపార విభాగానికీ లక్ష్యాలు సూచించారు. రిలయన్స్ గ్రూప్ను దేశంలోనే అత్యంత పర్యావరణహిత కంపెనీగా తీర్చిదిద్దాలని తన వారసులైన ఈశా, ఆకాశ్, అనంత్ అంబానీలకు నిర్దేశించారు. నాయకత్వం వహించడంలో, బృందస్ఫూర్తితో సాగడంలో ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సిని ఉదాహరణగా తీసుకుని.. ముందుకు నడవాలని ఉద్బోధించారు. ఆర్ఐఎల్ వ్యవస్థాపకులు, ముకేశ్ తండ్రి ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా నిర్వహించిన ‘రిలయన్స్ ఫ్యామిలీ డే’ ఈ లక్ష్య నిర్దేశానికి వేదికగా మారింది. గతేడాది ఇదే రోజున తన ముగ్గురు పిల్లలకు గ్రూప్లోని 3 విభాగాలను ముకేశ్ అప్పజెప్పిన సంగతి విదితమే. టెలికాం, డిజిటల్ వ్యాపారాలు ఆకాశ్కు; రిటైల్ వ్యాపారం ఈశాకు అందించగా.. కొత్త ఇంధన వ్యాపారాన్ని చిన్న కుమారుడు అనంత్కు కేటాయించారు. బుధవారం జరిగిన రిలయన్స్ ఫ్యామిలీ డేలో ఉద్యోగులనుద్దేశించి ముకేశ్ చేసిన ప్రసంగాన్ని గురువారం మీడియాకు సంస్థ విడుదల చేసింది. అందులో ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఏళ్లు గడుస్తున్నాయి, దశాబ్దాలు వెళ్లిపోతాయి.. రిలయన్స్ మాత్రం అంతకంతకూ వృద్ధి చెందుతుంది. మర్రి చెట్టు ఎలాగైతే తన శాఖలను మరింత విస్తరించి, ఎంతగా వేళ్లూనుకుంటుందో.. అదే మాదిరి రిలయన్స్ కూడా భారతీయులందరి జీవితాలను స్పృశిస్తోంది. వారికి సాధికారత అందిస్తోంది. వచ్చే అయిదేళ్లలో రిలయన్స్ తన 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా కంపెనీ చేరుకోవాల్సిన లక్ష్యాలను ఉన్నతాధికారులు, ఉద్యోగులకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను.
గ్రామాలు, పట్టణాల మధ్య విభజన రేఖను తుడిచేయాలి
ఆకాశ్ అధిపతిగా ఉన్న జియో.. ప్రపంచంలోనే అత్యుత్తమ 5జీ నెట్వర్క్ను దేశవ్యాప్తంగా సిద్ధం చేస్తోంది. ఇంత వేగంగా ప్రపంచంలో ఎక్కడా ఈ సేవలను విస్తరించలేదు. 2023 కల్లా 5జీ దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. జియో ప్లాట్ఫామ్స్.. భారత తదుపరి అతిపెద్ద అవకాశానికి సిద్ధంగా ఉండాలి. అత్యుత్తమ డిజిటల్ ఉత్పత్తులు, పరిష్కారాలను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అందించాలి. ప్రతి గ్రామానికి 5జీ సేవలందాలి. సాంకేతికత సేవలు పొందడంలో గ్రామం-పట్టణం అనే తేడా ఉండకూడదు. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక కార్యలాపాల్లో అత్యంత నాణ్యత తీసుకురావడం ద్వారా, దేశ అభివృద్ధిలో జియో భాగం కావాలి.
రిటైల్తో రైతుల ఆదాయం పెరగాలి
ఈశా ఆధ్వర్యంలోని రిటైల్ వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతోంది. దేశంలో మరింతమందికి చేరువ అవుతోంది. ఇంకొన్ని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం రిటైల్ బృందానికి ఉందని నమ్ముతున్నాను. జియోలాగే రిటైల్ వ్యాపారాభివృద్ధి వల్ల దేశ వృద్ధిపైనా ప్రభావం కనిపించాలి. మరిన్ని ఉద్యోగాలు రావాలి. రైతులకు అధికాదాయం కలగాలి.
స్వయం సమృద్ధి దేశంగా భారత్ మారాలి
తదుపరి తరం వ్యాపారంలోకి అనంత్ చేరుతున్న ఈ సమయంలో.. జామ్నగర్లోని మా గిగా ఫ్యాక్టరీల్లో వేగవంతమైన ప్రగతి ఉండేలా చూస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద, అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్.. అత్యంత పర్యావరణహిత కంపెనీగానూ మారాలి. కొత్త ఇంధన బృందం ముందున్న లక్ష్యం ఇదే. ఇంధన అవసరాలకు దిగుమతులపై ఆధారపడడం తగ్గించి.. భారత్ను ఒక స్వయం సమృద్ధి దేశంగా మార్చాలి.
వివేకానందుడి స్ఫూర్తితో..
ఫుట్బాల్ ప్రపంచ కప్ను అర్జెంటీనా ఎలా గెలిచింది? నాయకత్వం, బృందస్ఫూర్తి కలయిక వల్లే సాధ్యమైంది. మెస్సి సొంతంగా ప్రపంచకప్ గెలవలేదు. అలాగే మెస్సి స్ఫూర్తిమంత నాయకత్వం లేకుండా ఆ టీమ్ గెలిచేదికాదు. తొలి గేమ్లో వెనకబడినా, వాళ్లు వెనకడుగు వేయలేదు. అత్యంత ఉత్కంఠ మ్యాచ్లో చివరకు గెలుపు సాధించారు. విజయాన్ని కలగనాలి. దాన్ని సాధించడానికి చేయాల్సిందంతా చేయాలి. ఫుట్బాల్లో పెనాల్టీ షాట్ వరకు విజయం కోసం సమష్ఠిగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇదే విధంగానే ధీరూభాయ్ అంబానీ కూడా రిలయన్స్ను నిర్మించారు. ఆయనతో పాటు స్వామి వివేకానంద ఆలోచనలూ నాలో స్ఫూర్తినింపాయి. ‘ఒక ఆలోచనను ఎంచుకోండి. దాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి. కల కనండి. దాని గురించే ఆలోచించండి. అందులోనే జీవించండి. మీ మెదడు, శరీరం, కండరాలు, నరాలు.. ఇలా శరీరంలో ప్రతి భాగాన్నీ ఆ ఆలోచనతో నింపండి. ఇతర అన్ని ఆలోచనలనూ వదిలేయండి. అదే మీ జీవితాన్ని విజయపథంలో నిలుపుతుంది.’ వివేకానందుడు చెప్పిన ఈ మంత్రాన్ని మనమందరం పఠిద్దాం. అనుసరిద్దాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు