లక్ష్యం.. విజయం.. అదే మన గమ్యం
దేశవ్యాప్తంగా 5జీ మొబైల్ సేవలను 2023 చివరికల్లా విస్తరించాలని ప్రణాళిక రూపొందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ.. రిటైల్ వ్యాపార విభాగానికీ లక్ష్యాలు సూచించారు.
మెస్సి ఆదర్శంగా బృందస్ఫూర్తితో సాగాలి
జియో, రిటైల్తో దేశాభివృద్ధికి ఊతమివ్వాలి
పర్యావరణహిత కంపెనీగా రిలయన్స్
వారసులకు ముకేశ్ దిశానిర్దేశం
రిలయన్స్ ఫ్యామిలీ డే
దిల్లీ
దేశవ్యాప్తంగా 5జీ మొబైల్ సేవలను 2023 చివరికల్లా విస్తరించాలని ప్రణాళిక రూపొందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ.. రిటైల్ వ్యాపార విభాగానికీ లక్ష్యాలు సూచించారు. రిలయన్స్ గ్రూప్ను దేశంలోనే అత్యంత పర్యావరణహిత కంపెనీగా తీర్చిదిద్దాలని తన వారసులైన ఈశా, ఆకాశ్, అనంత్ అంబానీలకు నిర్దేశించారు. నాయకత్వం వహించడంలో, బృందస్ఫూర్తితో సాగడంలో ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సిని ఉదాహరణగా తీసుకుని.. ముందుకు నడవాలని ఉద్బోధించారు. ఆర్ఐఎల్ వ్యవస్థాపకులు, ముకేశ్ తండ్రి ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా నిర్వహించిన ‘రిలయన్స్ ఫ్యామిలీ డే’ ఈ లక్ష్య నిర్దేశానికి వేదికగా మారింది. గతేడాది ఇదే రోజున తన ముగ్గురు పిల్లలకు గ్రూప్లోని 3 విభాగాలను ముకేశ్ అప్పజెప్పిన సంగతి విదితమే. టెలికాం, డిజిటల్ వ్యాపారాలు ఆకాశ్కు; రిటైల్ వ్యాపారం ఈశాకు అందించగా.. కొత్త ఇంధన వ్యాపారాన్ని చిన్న కుమారుడు అనంత్కు కేటాయించారు. బుధవారం జరిగిన రిలయన్స్ ఫ్యామిలీ డేలో ఉద్యోగులనుద్దేశించి ముకేశ్ చేసిన ప్రసంగాన్ని గురువారం మీడియాకు సంస్థ విడుదల చేసింది. అందులో ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఏళ్లు గడుస్తున్నాయి, దశాబ్దాలు వెళ్లిపోతాయి.. రిలయన్స్ మాత్రం అంతకంతకూ వృద్ధి చెందుతుంది. మర్రి చెట్టు ఎలాగైతే తన శాఖలను మరింత విస్తరించి, ఎంతగా వేళ్లూనుకుంటుందో.. అదే మాదిరి రిలయన్స్ కూడా భారతీయులందరి జీవితాలను స్పృశిస్తోంది. వారికి సాధికారత అందిస్తోంది. వచ్చే అయిదేళ్లలో రిలయన్స్ తన 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా కంపెనీ చేరుకోవాల్సిన లక్ష్యాలను ఉన్నతాధికారులు, ఉద్యోగులకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను.
గ్రామాలు, పట్టణాల మధ్య విభజన రేఖను తుడిచేయాలి
ఆకాశ్ అధిపతిగా ఉన్న జియో.. ప్రపంచంలోనే అత్యుత్తమ 5జీ నెట్వర్క్ను దేశవ్యాప్తంగా సిద్ధం చేస్తోంది. ఇంత వేగంగా ప్రపంచంలో ఎక్కడా ఈ సేవలను విస్తరించలేదు. 2023 కల్లా 5జీ దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. జియో ప్లాట్ఫామ్స్.. భారత తదుపరి అతిపెద్ద అవకాశానికి సిద్ధంగా ఉండాలి. అత్యుత్తమ డిజిటల్ ఉత్పత్తులు, పరిష్కారాలను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అందించాలి. ప్రతి గ్రామానికి 5జీ సేవలందాలి. సాంకేతికత సేవలు పొందడంలో గ్రామం-పట్టణం అనే తేడా ఉండకూడదు. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక కార్యలాపాల్లో అత్యంత నాణ్యత తీసుకురావడం ద్వారా, దేశ అభివృద్ధిలో జియో భాగం కావాలి.
రిటైల్తో రైతుల ఆదాయం పెరగాలి
ఈశా ఆధ్వర్యంలోని రిటైల్ వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతోంది. దేశంలో మరింతమందికి చేరువ అవుతోంది. ఇంకొన్ని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం రిటైల్ బృందానికి ఉందని నమ్ముతున్నాను. జియోలాగే రిటైల్ వ్యాపారాభివృద్ధి వల్ల దేశ వృద్ధిపైనా ప్రభావం కనిపించాలి. మరిన్ని ఉద్యోగాలు రావాలి. రైతులకు అధికాదాయం కలగాలి.
స్వయం సమృద్ధి దేశంగా భారత్ మారాలి
తదుపరి తరం వ్యాపారంలోకి అనంత్ చేరుతున్న ఈ సమయంలో.. జామ్నగర్లోని మా గిగా ఫ్యాక్టరీల్లో వేగవంతమైన ప్రగతి ఉండేలా చూస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద, అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్.. అత్యంత పర్యావరణహిత కంపెనీగానూ మారాలి. కొత్త ఇంధన బృందం ముందున్న లక్ష్యం ఇదే. ఇంధన అవసరాలకు దిగుమతులపై ఆధారపడడం తగ్గించి.. భారత్ను ఒక స్వయం సమృద్ధి దేశంగా మార్చాలి.
వివేకానందుడి స్ఫూర్తితో..
ఫుట్బాల్ ప్రపంచ కప్ను అర్జెంటీనా ఎలా గెలిచింది? నాయకత్వం, బృందస్ఫూర్తి కలయిక వల్లే సాధ్యమైంది. మెస్సి సొంతంగా ప్రపంచకప్ గెలవలేదు. అలాగే మెస్సి స్ఫూర్తిమంత నాయకత్వం లేకుండా ఆ టీమ్ గెలిచేదికాదు. తొలి గేమ్లో వెనకబడినా, వాళ్లు వెనకడుగు వేయలేదు. అత్యంత ఉత్కంఠ మ్యాచ్లో చివరకు గెలుపు సాధించారు. విజయాన్ని కలగనాలి. దాన్ని సాధించడానికి చేయాల్సిందంతా చేయాలి. ఫుట్బాల్లో పెనాల్టీ షాట్ వరకు విజయం కోసం సమష్ఠిగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇదే విధంగానే ధీరూభాయ్ అంబానీ కూడా రిలయన్స్ను నిర్మించారు. ఆయనతో పాటు స్వామి వివేకానంద ఆలోచనలూ నాలో స్ఫూర్తినింపాయి. ‘ఒక ఆలోచనను ఎంచుకోండి. దాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి. కల కనండి. దాని గురించే ఆలోచించండి. అందులోనే జీవించండి. మీ మెదడు, శరీరం, కండరాలు, నరాలు.. ఇలా శరీరంలో ప్రతి భాగాన్నీ ఆ ఆలోచనతో నింపండి. ఇతర అన్ని ఆలోచనలనూ వదిలేయండి. అదే మీ జీవితాన్ని విజయపథంలో నిలుపుతుంది.’ వివేకానందుడు చెప్పిన ఈ మంత్రాన్ని మనమందరం పఠిద్దాం. అనుసరిద్దాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
అంబానీ, అదానీ తొలిసారి చేతులు కలిపారు. ఓ పవర్ ప్రాజెక్ట్ విషయంలో వీరి మధ్య భాగస్వామ్యం కుదిరింది. -
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది. -
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. సోషల్మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రీమియం, ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి