లక్షన్నర ఐటీ ఉద్యోగాలు పోయాయ్
కొవిడ్ సమయంలో అప్పటి అవసరాలకు అనుగుణంగా అధిక వేతనాలపై నిపుణులను భారీగా నియమించుకున్న టెక్నాలజీ సంస్థలు.. ఇప్పుడు గిరాకీ తగ్గడంతో, సాధ్యమైనంత మందిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 2022లో ఇదీ టెక్ కంపెనీల తీరు
లేఆఫ్స్.ఎఫ్వైఐ నివేదిక
కొవిడ్ సమయంలో అప్పటి అవసరాలకు అనుగుణంగా అధిక వేతనాలపై నిపుణులను భారీగా నియమించుకున్న టెక్నాలజీ సంస్థలు.. ఇప్పుడు గిరాకీ తగ్గడంతో, సాధ్యమైనంత మందిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. పని కంటే ఎక్కువ వేతనం పొందుతున్నారని భావిస్తున్న వారితో పాటు, పనితీరు సంతృప్తి కరంగా లేనివారు వేటుకు గురవుతున్నారు.
ఈనాడు - హైదరాబాద్
కొవిడ్ పరిణామాల్లో దాదాపు అన్ని రంగాల సంస్థలు, తమ కార్యకలాపాలను డిజిటలీకరణ చేసుకున్నాయి. ఇకామర్స్ కొనుగోళ్లు అధికంగా జరిగాయి. లాక్డౌన్ల కారణంగా, ఇళ్ల వద్ద ఖాళీగా ఉన్న వారు సామాజిక మాధ్యమాలను, యూట్యూబ్లో వీడియోలను ఎక్కువగా తిలకించారు. ఆన్లైన్లోనే పాఠ్యాంశాలు బోధించే ఎడ్యుటెక్ సంస్థలకూ అమిత డిమాండ్ ఏర్పడింది. దీంతో సాంకేతిక నిపుణులకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఇందువల్లే అంతర్జాతీయ సంస్థలైన మెటా, గూగుల్, అమెజాన్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి వాటితో పాటు దేశీయంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు తమకు వచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాయి. బైజూస్ వంటి అంకుర సంస్థలూ ఈ విషయంలో తగ్గలేద. రెండేళ్లు ఇదే పరిస్థితి. తదుపరి చూస్తే..
* 2022 నుంచి ఐటీ కంపెనీలకు డిజిటలీకరణ ప్రాజెక్టులు తగ్గుతున్నాయి. అమెరికా, ఐరోపాలను ఆర్థిక మందగమనం కలవర పెడుతోంది. అందుకే వ్యయ నియంత్రణ కోసం టెక్ సంస్థలు తమ ‘అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను’ వదిలించుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి.
* 2022లో ప్రపంచ వ్యాప్తంగా 1013 సంస్థలు 1,53,160 మంది ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్.ఎఫ్వైఐ లైవ్ ట్రాకింగ్ వెల్లడించింది. కొవిడ్ నుంచి చూస్తే, ఇప్పటివరకు 1539 సంస్థలు దాదాపు 2,49,151 మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది. అధిక తొలగింపులు కన్జూమర్, రిటైల్ రంగంలోనే ఉన్నాయి.
లాభాలు తగ్గడంతోనే..
టెక్ రంగం 2022లో ఒక్కసారిగా డీలాపడింది. అమెరికాలోని 5 అతి పెద్ద టెక్ కంపెనీల ఆదాయం తగ్గిపోయింది. ఆర్థిక మాంద్యం ఛాయలు కనిపిస్తుండటంతో, సాధ్యమైనంత తొందరగా ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2022లో మెటా 11,000, అమెజాన్ 10,000, సిస్కో 4,100 ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్.ఎఫ్వైఐ వెల్లడించింది. ట్విటర్ సిబ్బందిలో దాదాపు 75% మందిని నూతన యజమాని ఎలాన్ మస్క్ ఇంటికి పంపించినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.
అంకురాల నుంచే 18,000 మంది
గత ఏడాది కాలంలో మన దేశంలోని పలు అంకురాలు దాదాపు 18వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు ఇంక్.42.కామ్ నివేదిక వెల్లడించింది. బైజూస్ 2,500, ఓలా 2,300, బ్లింకిట్ 1,600, అనకాడమీ 1,150, వేదాంతు 1,109, వైట్హ్యాట్ జూనియర్ 1,000 ఉద్యోగాల్లో కోత విధించినట్లు పేర్కొంది.
ప్రాంగణ ఎంపికలు నెమ్మదిగా
దేశీయ సంస్థలతోపాటు, అంతర్జాతీయ సంస్థలూ నూతన నియామకాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ప్రారంభ స్థాయి, ప్రాంగణ ఎంపికలు నెమ్మదిగా సాగుతున్నాయి. కొత్తతరం సాంకేతికతలైన కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, వెబ్3, డేటాసైన్స్, అనలిటిక్స్లాంటి వాటికి గిరాకీ పెరుగుతోంది. సంస్థలు తమకు అవసరమైన పనిని చేయగల ఉద్యోగుల కోసం చూస్తున్నాయి. దీంతో ఇంటర్న్షిప్ల విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు