ప్రభుత్వ రంగ బ్యాంకుల దశ తిరిగింది
అయిదు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి రూ.2 లక్షల కోట్లకు పైగా నష్టాలను చవిచూసిన ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్బీలు).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.లక్ష కోట్లకు పైగా లాభాలు ఆర్జించేలా దూసుకుపోతున్నాయి.
2022-23లో నికర లాభం రూ.లక్ష కోట్లకు చేరతాయనే అంచనాలు!
2017-18 నష్టం రూ.85,390 కోట్లు
2021-22 లాభం రూ.66,539 కోట్లు
అయిదు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి రూ.2 లక్షల కోట్లకు పైగా నష్టాలను చవిచూసిన ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్బీలు).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.లక్ష కోట్లకు పైగా లాభాలు ఆర్జించేలా దూసుకుపోతున్నాయి. ప్రభుత్వ సంస్కరణలకు తోడు, తగిన దిద్దుబాటు చర్యలే ఇందుకు కారణం.
ఈ గణాంకాలు చాలు.. పీఎస్బీల తీరులో ఎంత మార్పు వచ్చిందో చెప్పడానికి. ఇటీవల ఎన్నడూ లేనంతగా 2017-18లో రూ.85,390 కోట్ల భారీ నష్టాన్ని మూట గట్టుకున్న బ్యాంకులు.. అయిదేళ్ల వ్యవధిలో, ఒక్క ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల భారీ లాభాన్ని ఆర్జించేలా తమ పనితీరును మెరుగు పరచుకున్నాయి. ఒకదశలో బ్యాలెన్స్షీట్లు ఆందోళనకరంగా మారడంతో, ప్రభుత్వరంగంలోని 21 బ్యాంకుల్లో 11.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సత్వర దిద్దుబాటు నిబంధనల చట్రంలోకి చేరాయి. అవి జారీ చేసిన మొత్తం రుణాల్లో.. 14.58 శాతం మొండి బకాయిలుగా మారిన రోజులవి.
కష్టాలకు నేపథ్యం: మూలధనం తక్కువగా ఉండటం, యాజమాన్యాలు బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించడం, సిబ్బంది అసమర్థతతో విధులు నిర్వర్తించడం అప్పట్లో పీఎస్బీలను వేధించిన సమస్యలు. ఫలితంగా ఆయా బ్యాంకుల షేర్ల ధరలు కూడా భారీగా క్షీణించాయి.
ప్రక్షాళన ఇలా
ప్రభుత్వ రంగ బ్యాంకులను గాడిలో పెట్టేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టింది. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ఈ విషయంలో తీవ్రంగా శ్రమించారు.
* 2016-17 నుంచి 2020-21 మధ్య పీఎస్బీలకు రూ.3,10,997 కోట్ల మూలధన సాయం అందించారు. రీక్యాపిటలైజేషన్ బాండ్ల జారీ ద్వారా వాటి ఆర్థిక స్థితిని మెరుగుపర్చారు.
* 3.38 లక్షల డొల్ల కంపెనీల బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. ఎగవేతదార్లు, బ్యాంకు రుణాలను వేరే అవసరాలకు మళ్లించిన వారిపై కఠిన చర్యలకు దిగి, తిరిగి వసూలు చేయడం ప్రారంభించారు. భూషణ్ స్టీల్, జెట్ ఎయిర్వేస్, ఎస్సార్ స్టీల్, నీరవ్మోదీ, రొటొమ్యాక్ వంటి భారీమొత్తం ఎగవేతదార్లతో పాటు యెస్బ్యాంక్; డీహెచ్ఎఫ్ఎల్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ వంటి ఆర్థిక సంస్థలపైనా చర్యలకు ఉపక్రమించడం వల్ల అందరిలోనూ జవాబుదారీతనం పెరిగింది.
* 2018-19లో రికార్డు స్థాయిలో మొండి బకాయిలు రికవరీ అయ్యాయి. 2017 సెప్టెంబరులో నష్టభయం కలిగిన ఆస్తులు, మొత్తం స్థూల రుణాల్లో 80.3 శాతంగా ఉండగా, 2019 డిసెంబరు నాటికి 63.9 శాతానికి తగ్గాయి.
* ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి, పెద్ద బ్యాంకులుగా మార్చడం వల్ల ప్రస్తుతం 12 పీఎస్బీలే మిగిలాయి. ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించే దిశగా అడుగు వేయడం, సంస్కరణలపై ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు అర్థమయ్యేలా చేసింది.
* 2020-21లో లాభాల బాట పట్టిన 9 పీఎస్బీలు (ఎస్బీఐతో కలిపి) రూ.7,867 కోట్ల డివిడెండ్లను కూడా వాటాదార్లకు ప్రకటించాయి. కొవిడ్ పరిణామాల ఒత్తిళ్తున్నా.. 2021-22లో పీఎస్బీలన్నీ కలిపి రూ.66,539 కోట్ల లాభాన్ని ఆర్జించాయి.
* ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎస్బీలు రూ.80,000- 1 లక్ష కోట్ల లాభం ప్రకటించే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ ఎ.ఎస్.రాజీవ్ పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి